ఇది క‌దా ప్ర‌జా పాల‌న అంటే!

Publish Date:Nov 10, 2024

Advertisement

చంద్ర‌బాబు పేరు చెప్ప‌గానే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌లు టెక్నాల‌జీ ముఖ్య‌మంత్రి, దార్శినికతను అరగుడుల నిదర్శనమని చెబుతుంటారు.  నూత‌న టెక్నాల‌జీని అందిపుచ్చుకొని దానిని    పాల‌నకు అన్వయించి అభివృద్ధిని పరుగులు పెట్టించడంలో ఆయన దిట్ట.   వ‌చ్చే ప‌దేళ్ల‌లో ప్ర‌పంచం ఏ రంగంలో ముందుకు దూసుకెళ్తుంద‌నే విష‌యాన్ని ప‌సిగ‌ట్టి..  ఆ మేర‌కు విజ‌న్ ను రూపొందించ‌డంలో చంద్ర‌బాబును మించిన‌వారు మరొకరు లేర‌నే చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల్లోని యువ‌త నేడు ఐటీ రంగంలో ప్ర‌పంచ వ్యాప్తంగా రాణిస్తున్నారంటే అందుకు చంద్ర‌బాబు ముందు చూపే కార‌ణ‌మ‌ని చెప్ప‌డానికి ఎటువంటి సందేహం అవసరం లేదు. అలా చెప్పడంలో అతిశయోక్తి ఇసుమంతైనా లేదు. చంద్ర‌బాబు తొలిసారి సీఎం అయిన స‌మ‌యంలో ఐటీ రంగానికి పెద్ద‌పీట వేశారు. హైటెక్ సిటీని నిర్మించి హైద‌రాబాద్ న‌గ‌రాన్ని ఐటీ హ‌బ్ గా మార్చి ప్ర‌పంచ దేశాల దృష్టిని ఆక‌ర్షించారు. ఐటీ రంగంలో ఉన్న‌త స్థానాల్లో రాణిస్తున్న తెలుగు వారు అధిక‌ శాతం మంది తాము ఈ స్థాయికి చేరుకోవ‌టానికి చంద్ర‌బాబే కారణమని ఇప్ప‌టికీ చెబుతుంటారు. ఉమ్మ‌డి రాష్ట్రం విడిపోయిన త‌రువాత ఏపీ ముఖ్య‌మంత్రిగా ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్ర‌బాబు.. టెక్నాల‌జీని ఉప‌యోగించి అనేక అద్భుత కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. వ్య‌వ‌సాయ రంగంలోనూ రైతులు టెక్నాల‌జీని  అందిపుచ్చుకునేలా చ‌ర్య‌లు చేప‌ట్టారు. అయితే, 2019లో జగన్ ప్ర‌భుత్వం రావ‌డంతో ఏపీ ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది. 

వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో టెక్నాల‌జీ వినియోగం లేదు, అభివృద్ధి లేదు. చాలా మంది ప‌నుల‌ కోసం ఇత‌ర రాష్ట్రాల‌కు వ‌ల‌స వెళ్లిన ప‌రిస్థితి. చంద్ర‌బాబు సీఎంగా ఉన్న స‌మ‌యంలో ఏపీకి తీసుకొచ్చిన కంపెనీల‌ు సైతం జగన్ అరాచక పాలన, అధ్వాన విధానాల కారణంగా ఏపీ నుంచి తరలిపోయాయి. దీంతో ఏపీ అన్ని రంగాల్లో వెనుక‌బ‌డిపోయింది. జగన్ హయాంలో రాష్ట్రం పురోగమించడం అటుంచి అన్ని రంగాలలోనూ తిరోగమించి  దేశంలోనే చివరి నుంచి మొదటి స్థానానికి దిగజారిపోయింది. జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌లో కేవ‌లం తెలుగుదేశం, జ‌న‌సేన నేత‌లు, కార్య‌క‌ర్త‌లపై అక్ర‌మ కేసులు, దౌర్జన్యాలు, దాడులకే ప్రభుత్వం పరిమితమరైంది. ప్ర‌భుత్వ తీరును ప్ర‌శ్నించిన వారిని జైళ్ల‌కు పంపించ‌డమే లక్ష్యంగా జగన్ పాలన సాగింది. జ‌గ‌న్ క‌క్ష‌ పూరిత పాల‌న‌తో విసిగిపోయిన ప్ర‌జ‌లు ఇటీవ‌ల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలోని ఎన్డీయే కూట‌మికి ప‌ట్టం క‌ట్టారు. ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన చంద్ర‌బాబు.. అప్పుల కుప్ప‌గా మారిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ఒక్కో అడుగు ముందుకేస్తున్నారు. అంతేకాదు.. నూత‌న సాంకేతికతను అంది పుచ్చుకొని రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశానికే ఆద‌ర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నారు. 

చంద్ర‌బాబు చొర‌వ‌తో సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకోవ‌డంలో కూట‌మి ప్ర‌భుత్వం ముందుంటోంది. గ‌తంలో ఎన్న‌డూలేని విధంగా అన్ని రంగాలూ టెక్నాలజీ వినియోగంతో ప్రజలకు మరింత దగ్గరయ్యే విధంగా విధానాలు రూపొందిస్తున్నారు. అమలు చేస్తున్నారు.    విప‌త్తుల స‌మ‌యంలో డ్రోన్ల‌ను వాడి ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందించారు. దేశంలోనే తొలిసారిగా ప‌ర్యాట‌క రంగంలోకి విజ‌య‌వంతంగా సీప్లేన్ ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇలా అవ‌కాశం ఉన్న అన్నిరంగాల్లో టెక్నాల‌జీని ఉప‌యోగించి ప్ర‌జ‌ల‌కు మెరుగైన పాల‌న అందించేలా సీఎం చంద్ర‌బాబు ముందుకు సాగుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు కొన్ని అవ‌స‌రాల‌కే వినియోగిస్తున్న డ్రోన్ల‌ను చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వినూత్నంగా వాడుకుంటున్నది. 

గ‌త సెప్టెంబ‌ర్ లో విజ‌య‌వాడ‌ భారీ వ‌ర‌ద‌లు ముంచెత్తిన స‌మ‌యంలో డ్రోన్ల‌ను ఉప‌యోగించి వ‌ర‌ద బాధితుల‌కు ఆహారం అందించారు. డ్రోన్ల‌ను ఇలా వినియోగించ‌డం దేశంలోనే తొలిసారి.  చంద్ర‌బాబు తెలివి తేట‌ల‌తో మ‌నుషులు వెళ్ల‌లేని ప్రాంతాల‌కు డ్రోన్ల ద్వారా బాధితుల‌కు ఆహార పొట్లాలు, తాగునీటి బాటిల్స్‌ అందించారు. డ్రోన్ల‌ను వ్య‌వ‌సాయ రంగంలోనూ విస్తృతంగా వినియోగించేలా ఏపీ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ క్ర‌మంలోనే విజ‌య‌వాడ కృష్ణా న‌ది తీరంలో ఐదు వేల డ్రోన్ల‌తో ఏర్పాటు చేసిన ప్ర‌ద‌ర్శ‌న  ఐదు విభాగాల్లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు  న‌మోదు చేసింది. ఓర్వ‌క‌ల్లులో డ్రోన్ హ‌బ్ ను ఏర్పాటు చేయడం ద్వారా ప్ర‌పంచ డ్రోన్ డెస్టినేష‌న్ గా ఏపీని నిలపాలని భావిస్తున్నారు. 

తెలుగు వారు ఊహించ‌ని విధంగా ప‌ర్యాట‌క రంగంలో సీ ప్లేన్‌ను వినియోగించాల‌ని సీఎం చంద్ర‌బాబు సంక‌ల్పించారు. అసలు 2017 డిసెంబ‌ర్ లోనే సీ ప్లేన్ వినియోగంపై చంద్ర‌బాబు దృష్టిసారించారు. ఆ త‌రువాత కాలంలో వైసీపీ అధికారంలోకి రావ‌డంతో ఆ ప్రాజెక్టుకు ముందుకు సాగ‌లేదు. వైసీపీ హ‌యాంలో ప‌ర్యాట‌క రంగంలో అభివృద్ధి కుంటుప‌డింది. రాష్ట్రంలో ప‌ర్యాట‌క రంటాన్ని అభివృద్ధి చేసేందుకు జగన్ ప్రభుత్వం చేసిందేమీ లేదు.  2024 ఎన్నికలలో చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టడంతోనే రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధిపై చంద్రబాబు దృష్టి సారించారు. అందులో భాగంగా దేశంలోనే తొలి సారిగా రాష్ట్రంలో సీప్లేన్ సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చారు.  ఇటీవ‌ల విజ‌య‌వాడ  శ్రీ‌శైలానికి సీ ప్లేన్ ను ప్రారంభించారు చంద్ర‌బాబు. అందులో ఆయ‌న స్వ‌యంగా ప‌ర్య‌టించారు. దేశంలోనే సీ ప్లేన్ లో ప‌ర్య‌టించిన మొద‌టి ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు గుర్తింపు పొందారు. దూర‌దృష్టితో అన్ని రంగాల్లోనూ టెక్నాల‌జీని సీఎం చంద్ర‌బాబు ప‌రుగులు పెట్టిస్తున్నారు. చంద్ర‌బాబు  నిర్ణ‌యాలు కార్యాచరణ అంద‌ర్నీ అబ్బుర పరుస్తున్నాయి. 

By
en-us Political News

  
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.