ఇది క‌దా ప్ర‌జా పాల‌న అంటే!

Publish Date:Nov 10, 2024

Advertisement

చంద్ర‌బాబు పేరు చెప్ప‌గానే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌లు టెక్నాల‌జీ ముఖ్య‌మంత్రి, దార్శినికతను అరగుడుల నిదర్శనమని చెబుతుంటారు.  నూత‌న టెక్నాల‌జీని అందిపుచ్చుకొని దానిని    పాల‌నకు అన్వయించి అభివృద్ధిని పరుగులు పెట్టించడంలో ఆయన దిట్ట.   వ‌చ్చే ప‌దేళ్ల‌లో ప్ర‌పంచం ఏ రంగంలో ముందుకు దూసుకెళ్తుంద‌నే విష‌యాన్ని ప‌సిగ‌ట్టి..  ఆ మేర‌కు విజ‌న్ ను రూపొందించ‌డంలో చంద్ర‌బాబును మించిన‌వారు మరొకరు లేర‌నే చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల్లోని యువ‌త నేడు ఐటీ రంగంలో ప్ర‌పంచ వ్యాప్తంగా రాణిస్తున్నారంటే అందుకు చంద్ర‌బాబు ముందు చూపే కార‌ణ‌మ‌ని చెప్ప‌డానికి ఎటువంటి సందేహం అవసరం లేదు. అలా చెప్పడంలో అతిశయోక్తి ఇసుమంతైనా లేదు. చంద్ర‌బాబు తొలిసారి సీఎం అయిన స‌మ‌యంలో ఐటీ రంగానికి పెద్ద‌పీట వేశారు. హైటెక్ సిటీని నిర్మించి హైద‌రాబాద్ న‌గ‌రాన్ని ఐటీ హ‌బ్ గా మార్చి ప్ర‌పంచ దేశాల దృష్టిని ఆక‌ర్షించారు. ఐటీ రంగంలో ఉన్న‌త స్థానాల్లో రాణిస్తున్న తెలుగు వారు అధిక‌ శాతం మంది తాము ఈ స్థాయికి చేరుకోవ‌టానికి చంద్ర‌బాబే కారణమని ఇప్ప‌టికీ చెబుతుంటారు. ఉమ్మ‌డి రాష్ట్రం విడిపోయిన త‌రువాత ఏపీ ముఖ్య‌మంత్రిగా ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్ర‌బాబు.. టెక్నాల‌జీని ఉప‌యోగించి అనేక అద్భుత కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. వ్య‌వ‌సాయ రంగంలోనూ రైతులు టెక్నాల‌జీని  అందిపుచ్చుకునేలా చ‌ర్య‌లు చేప‌ట్టారు. అయితే, 2019లో జగన్ ప్ర‌భుత్వం రావ‌డంతో ఏపీ ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది. 

వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో టెక్నాల‌జీ వినియోగం లేదు, అభివృద్ధి లేదు. చాలా మంది ప‌నుల‌ కోసం ఇత‌ర రాష్ట్రాల‌కు వ‌ల‌స వెళ్లిన ప‌రిస్థితి. చంద్ర‌బాబు సీఎంగా ఉన్న స‌మ‌యంలో ఏపీకి తీసుకొచ్చిన కంపెనీల‌ు సైతం జగన్ అరాచక పాలన, అధ్వాన విధానాల కారణంగా ఏపీ నుంచి తరలిపోయాయి. దీంతో ఏపీ అన్ని రంగాల్లో వెనుక‌బ‌డిపోయింది. జగన్ హయాంలో రాష్ట్రం పురోగమించడం అటుంచి అన్ని రంగాలలోనూ తిరోగమించి  దేశంలోనే చివరి నుంచి మొదటి స్థానానికి దిగజారిపోయింది. జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌లో కేవ‌లం తెలుగుదేశం, జ‌న‌సేన నేత‌లు, కార్య‌క‌ర్త‌లపై అక్ర‌మ కేసులు, దౌర్జన్యాలు, దాడులకే ప్రభుత్వం పరిమితమరైంది. ప్ర‌భుత్వ తీరును ప్ర‌శ్నించిన వారిని జైళ్ల‌కు పంపించ‌డమే లక్ష్యంగా జగన్ పాలన సాగింది. జ‌గ‌న్ క‌క్ష‌ పూరిత పాల‌న‌తో విసిగిపోయిన ప్ర‌జ‌లు ఇటీవ‌ల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలోని ఎన్డీయే కూట‌మికి ప‌ట్టం క‌ట్టారు. ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన చంద్ర‌బాబు.. అప్పుల కుప్ప‌గా మారిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ఒక్కో అడుగు ముందుకేస్తున్నారు. అంతేకాదు.. నూత‌న సాంకేతికతను అంది పుచ్చుకొని రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశానికే ఆద‌ర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నారు. 

చంద్ర‌బాబు చొర‌వ‌తో సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకోవ‌డంలో కూట‌మి ప్ర‌భుత్వం ముందుంటోంది. గ‌తంలో ఎన్న‌డూలేని విధంగా అన్ని రంగాలూ టెక్నాలజీ వినియోగంతో ప్రజలకు మరింత దగ్గరయ్యే విధంగా విధానాలు రూపొందిస్తున్నారు. అమలు చేస్తున్నారు.    విప‌త్తుల స‌మ‌యంలో డ్రోన్ల‌ను వాడి ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందించారు. దేశంలోనే తొలిసారిగా ప‌ర్యాట‌క రంగంలోకి విజ‌య‌వంతంగా సీప్లేన్ ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇలా అవ‌కాశం ఉన్న అన్నిరంగాల్లో టెక్నాల‌జీని ఉప‌యోగించి ప్ర‌జ‌ల‌కు మెరుగైన పాల‌న అందించేలా సీఎం చంద్ర‌బాబు ముందుకు సాగుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు కొన్ని అవ‌స‌రాల‌కే వినియోగిస్తున్న డ్రోన్ల‌ను చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వినూత్నంగా వాడుకుంటున్నది. 

గ‌త సెప్టెంబ‌ర్ లో విజ‌య‌వాడ‌ భారీ వ‌ర‌ద‌లు ముంచెత్తిన స‌మ‌యంలో డ్రోన్ల‌ను ఉప‌యోగించి వ‌ర‌ద బాధితుల‌కు ఆహారం అందించారు. డ్రోన్ల‌ను ఇలా వినియోగించ‌డం దేశంలోనే తొలిసారి.  చంద్ర‌బాబు తెలివి తేట‌ల‌తో మ‌నుషులు వెళ్ల‌లేని ప్రాంతాల‌కు డ్రోన్ల ద్వారా బాధితుల‌కు ఆహార పొట్లాలు, తాగునీటి బాటిల్స్‌ అందించారు. డ్రోన్ల‌ను వ్య‌వ‌సాయ రంగంలోనూ విస్తృతంగా వినియోగించేలా ఏపీ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ క్ర‌మంలోనే విజ‌య‌వాడ కృష్ణా న‌ది తీరంలో ఐదు వేల డ్రోన్ల‌తో ఏర్పాటు చేసిన ప్ర‌ద‌ర్శ‌న  ఐదు విభాగాల్లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు  న‌మోదు చేసింది. ఓర్వ‌క‌ల్లులో డ్రోన్ హ‌బ్ ను ఏర్పాటు చేయడం ద్వారా ప్ర‌పంచ డ్రోన్ డెస్టినేష‌న్ గా ఏపీని నిలపాలని భావిస్తున్నారు. 

తెలుగు వారు ఊహించ‌ని విధంగా ప‌ర్యాట‌క రంగంలో సీ ప్లేన్‌ను వినియోగించాల‌ని సీఎం చంద్ర‌బాబు సంక‌ల్పించారు. అసలు 2017 డిసెంబ‌ర్ లోనే సీ ప్లేన్ వినియోగంపై చంద్ర‌బాబు దృష్టిసారించారు. ఆ త‌రువాత కాలంలో వైసీపీ అధికారంలోకి రావ‌డంతో ఆ ప్రాజెక్టుకు ముందుకు సాగ‌లేదు. వైసీపీ హ‌యాంలో ప‌ర్యాట‌క రంగంలో అభివృద్ధి కుంటుప‌డింది. రాష్ట్రంలో ప‌ర్యాట‌క రంటాన్ని అభివృద్ధి చేసేందుకు జగన్ ప్రభుత్వం చేసిందేమీ లేదు.  2024 ఎన్నికలలో చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టడంతోనే రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధిపై చంద్రబాబు దృష్టి సారించారు. అందులో భాగంగా దేశంలోనే తొలి సారిగా రాష్ట్రంలో సీప్లేన్ సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చారు.  ఇటీవ‌ల విజ‌య‌వాడ  శ్రీ‌శైలానికి సీ ప్లేన్ ను ప్రారంభించారు చంద్ర‌బాబు. అందులో ఆయ‌న స్వ‌యంగా ప‌ర్య‌టించారు. దేశంలోనే సీ ప్లేన్ లో ప‌ర్య‌టించిన మొద‌టి ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు గుర్తింపు పొందారు. దూర‌దృష్టితో అన్ని రంగాల్లోనూ టెక్నాల‌జీని సీఎం చంద్ర‌బాబు ప‌రుగులు పెట్టిస్తున్నారు. చంద్ర‌బాబు  నిర్ణ‌యాలు కార్యాచరణ అంద‌ర్నీ అబ్బుర పరుస్తున్నాయి. 

By
en-us Political News

  
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో మాజీ మంత్రి తోట త్రిమూర్తులు నేతృత్వంలో జరిగిన వైసీపీ కాపు సామాజిక వర్గాల నాయకుల సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించింది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో పాల్గొని భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఒక బలమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోందన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇటీవల జరిగిన సుదీర్ఘ భేటీ తర్వాత పవన్ టోన్ పూర్తిగా మారినట్లు స్పష్టమవుతోంది. తాను కేవలం 21 సీట్లు గెలిచిన ఒక ప్రాంతీయ పార్టీ నేతగా మాత్రమే కాకుండా.. కేంద్రంలోని పెద్దల అండదండలు ఉన్న సుపీరియర్ పొజిషన్‌లో ఉన్నాననే సంకేతాన్ని పవన్ పంపించారన్నారు.
కూటమి ప్రభుత్వంలో పరిపాలనా లోపాలు, రాజకీయ సమన్వయ లేమి స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. గతంలో ఆర్టీజీఎస్ వంటి డిజిటల్ వ్యవస్థల ద్వారా లభించిన 80 శాతం ప్రజా సంతృప్తి కేవలం కాగితాలకే పరిమితమైందనీ.. డిజిటల్ కనెక్టివిటీ పెరిగి భౌతిక సంబంధాలు దెబ్బతినడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తమ సర్వేలో తేలిందని చెప్పారు.
ఎన్నికల బరిలో కేసీఆర్, బీఆర్ఎస్ కూటమిని ఢీకొట్టడం ఎవరికైనా పెద్ద సవాలే. గతంలో కేసీఆర్ వాడే ఘాటైన రాజకీయ విమర్శలు, వ్యంగ్యాస్త్రాలపై ఆయనకు మాత్రమే పేటెంట్ హక్కు ఉందనే భావన ఉండేది. కానీ రేవంత్ రెడ్డి రాకతో.. ఆ ముద్రను పూర్తిగా చెరిపివేశారు. కేసీఆర్, కేటీఆర్ ల కంటే మరింత దూకుడుగా, ఘాటుగా రేవంత్ ప్రజల్లోకి వెళ్లారు.
కేంద్ర ప్రభుత్వం పాలసీలు లేదా ప్రాజెక్టులను ఏ ఒక్కరి కోసమో కాకుండా దేశ ప్రజలందరి కోసమే ప్రవేశపెడుతుందని బదులిచ్చారు. అయితే.. ఆ ప్రాజెక్టులను అందుకోవడంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంత వేగంగా, సానుకూలంగా స్పందిస్తుందనే దానిపైనే వాటి రాక ఆధారపడి ఉంటుందని చెప్పారు.
చంద్రబాబు నాయుడు కుమారుడిగా, ఐటీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న నేతగా మాత్రమే గుర్తింపు ఉన్న యువకుడు నారా లోకేష్. అదే నారా లోకేష్ ఇప్పుడు ప్రజా క్షేత్రంలో తిరుగులేని నాయకుడిగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యారు.
ఈ చర్చోపచర్చలు, ఊహాగాన సభలపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ ప్రెస్ అడ్డా వేదికగా క్లారిటీ ఇచ్చారు. దేశానికి నరేంద్ర మోదీ రూపంలో ఒక బలమైన ప్రధానమంత్రి ఉన్నారన్న లోకేష్.. చంద్రబాబు ప్రధాని అన్న చర్చకు, వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టేశారు.
ఆయనకు పార్టీ నేతల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదన్న చర్చ గత కొంత కాలంగా జనసేనలో అంతర్గతంగా సాగుతోంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా, మీడియా ముఖంగా చేస్తున్న విమర్శలను, తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడంలో జనసేన ద్వితీయ శ్రేణి నాయకత్వం వెనుకబడిందన్న భావన సర్వత్రా వ్యక్తమౌతోంది.
నగర ప్రజల చిరకాల స్వప్నమైన హైదరాబాద్ మెట్రో విస్తరణ, నిధుల విడుదలే లక్ష్యంగా వీరిద్దరూ కలిసి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ భేటీ చాలా సానుకూల వాతావరణంలో జరిగిందనీ, మెట్రో ప్రాజెక్టుకు ఎదురవుతున్న ఆర్థిక అవరోధాలను అధిగమించడానికి ఇదొక కీలక ముందడుగని సీఎం రేవంత్ రెడ్డి భేటీ అనంతరం పేర్కొన్నారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని సమర్ధంగా, ఎఫెక్టివ్ గా అమలు చేయగలుగుతున్నామని చెప్పారు. ఇప్పుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు దీనిని మరొక మెట్టు పైకి తీసుకువెళ్లి ముందుకు తీసుకెళ్లి ఈజ్ ఆఫ్ లివింగ్ అనే భావనను తీసుకొచ్చారనీ, ప్రజలు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలలో ఎప్పటినుంచో అనేక అంతరాలు, ఘర్షణలు ఉన్నాయనీ, సాంకేతికత ద్వారా ఆ అవరోధాలను తొలగించాలనేదే మా ఆలోచన అన్నారు.
ఎక్స్‌ప్రెస్ అడ్డా వేదికపైకి విప్లవాత్మక మార్పులకు, పాలనా విధానాలకు కేంద్ర బిందువులుగా నిలిచే అత్యున్నత ప్రముఖులను మాత్రమే ఆహ్వానిస్తారు. గతంలో ఈ వేదికపై కేంద్ర మంత్రులు ఎస్. జైశంకర్, నితిన్ గడ్కరీ, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ వంటి దిగ్గజాలు పాల్గొని ప్రసంగించారు. ఇప్పుడు ఆ లీగ్‌లో నారా లోకేష్ నిలవడం ఆయన స్థాయిని రుజువు చేస్తోంది.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ తో కలిసి తెలుగువన్ వాస్తవవేదికలో మాట్లాడిన ఆయన మోదీ, అమిత్ షా రాజకీయ చాణక్యాన్ని తట్టుకోవడంలో ప్రాంతీయ పార్టీలు పూర్తిగా విఫలమవుతున్నాయని, వ్యూహాత్మక ఒంటరితనం లేదా అంతర్గత బలహీనతలు ఆయా పార్టీలను దెబ్బతీస్తున్నాయని విశ్లేషించారు.
గత ప్రభుత్వ హయాంలో దాదాపు 1.25 లక్షల సచివాలయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షకు 19 లక్షల మందికి పైగా నిరుద్యోగులు హాజరయ్యారు. నిబంధనల ప్రకారం జనరల్ కేటగిరీకి 60 మార్కులు, బీసీలకు 52.5 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 మార్కులను కనీస అర్హతగా నిర్ణయించారు. అయితే.. అధికారిక వెబ్‌సైట్‌లో ఎక్కడా అభ్యర్థుల పేర్లు, వయసు, సాధించిన మార్కులతో కూడిన పూర్తి స్థాయి మెరిట్ జాబితాను బహిర్గతం చేయకుండా కేవలం మొబైల్ ఫోన్లకు సమాచారం పంపి నాటకీయంగా ప్రక్రియ ముగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.