స్పీడ్ న్యూస్ 2

Publish Date:Jul 19, 2023

Advertisement

21.  యమునా నది   మళ్లీ ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తోంది. దీంతో దేశ రాజధాని నగరం ఢిల్లీ మళ్లీ జలదిగ్బంధనంలో చిక్కుకుంది. పొరుగు రాష్ట్రాలైన హర్యానా, ఉత్తరాఖండ్ లలో కురుస్తున్న తాజా వర్షాల కారణంగా యమున ఉప్పొంగి ప్రవహిస్తోంది. 

...................................................................................................................................................

22. జమ్మూకశ్మీరులో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.   అనంత్ నాగ్ జిల్లాలో ఉగ్రవాదుల   కాల్పుల్లో ఇద్దరు వలస కార్మికులు గాయపడ్డారు. ఉగ్రవాదుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. క్షతగాత్రులకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.

............................................................................................................................................

23. సిటీ బస్సులో చిల్లర సమస్యకు చెక్‌ పెట్టేందుకు టీఎస్‌ఆర్టీసీ  టికెట్ల కొనుగోలుకు క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌  విధానాన్ని తీసుకురానుంది. దీంతో కండక్టర్‌కు డబ్బు చెల్లించకుండా   నగదు రహిత టికెట్‌ కొనుగోలు చేయడానికి వీలౌతుంది.  

.....................................................................................................................................

24. తిరుమల నడకదారిలో చిరుతపులి సంచారం భక్తులను భయపెడుతోంది. తాజాగా నిన్న రాత్రి  33 వ మలుపు వద్ద చిరుత సంచారాన్నిభక్తులు గుర్తించారు.  నడకదారిన వెళ్లే భక్తులు గుంపులు గుంపులుగానే  వెళ్లాలని ఫారెస్ట్ సిబ్బంది, టీటీడీ అధికారులు  సూచిస్తున్నారు.  

........................................................................................................................................

25. రోడ్డు ప్రమాద మరణాలలో ప్రపంచంలోనే భారత్ అగ్ర స్థానంలో ఉంది. దేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా  ఏటా 15 లక్షల మంది మరణిస్తున్నారు.  ఈ వివరాలను ఫిక్కీ నివేదిక వెల్లడించింది. మానవుల మరణాలలో  రోడ్డు ప్రమాదాలు 8వ స్థానంలో ఉన్నాయని నివేదిక పేర్కొంది.

.......................................................................................................................................

26.శంషాబాద్ విమానాశ్రయంలో 1.7 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కువైట్ నుంచి హైదరాబాద్ కు వస్తున్న విమానంలో కొందరు అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇద్దరిని అరెస్టు చేశారు.

.......................................................................................................................................

27.వారం రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయకుంటే ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్ సర్కార్ ను హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్ కు ఒక బహిరంగ లేఖ రాశారు.

................................................................................................................................................

28. మూడు పంటలు, 24 గంటల కరెంటు అంటూ  బీఆర్ఎస్ చెబుతున్న మాటలు పచ్చి అబద్ధాలని వైఎస్సీర్టీపీ అధినేత్రి షర్మిల అన్నారు. కనీసం ఎనిమిది గంటల కరెంటు కూడా ఇవ్వలేనోళ్లు 24 గంటలూ విద్యుత్ సరఫరా చేస్తున్నామనడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ట్వీట్ చేశారు.

...................................................................................................................................................

29. ఢిల్లీలో నిన్న జరిగిన ఎన్డీయే సమావేశానికి హాజరైన పార్టీలలో కొన్ని పార్టీల పేర్లే తాను ఎన్నడూ వినలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు.  ఊరూపేరూ లేని పార్టీలు ఆ మీటింగ్ కు హాజరయ్యాయని విమర్శించారు. 

................................................................................................................................

30. ఒడిశా బాలేశ్వర్లో త్రుటిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. సిగ్నలింగ్ లో  రైలు  లూప్ లైన్లో ప్రవేశించింది. అయితే లోకోపైలట్ అప్రమత్తతతో  బ్రేకులు వేయడంతో ఘోర ప్రమాదం తప్పింది.  

................................................................................................................................................................

31.పెద్దపల్లి జిల్లా  రంగాపూర్ శివారులోని ఎస్సారెస్పీ కాలువలో ప్రమాదవశాత్తు దుప్పి పడిపోయింది. ఇది  గమనించిన గ్రామస్తులు   దానిని బయటకు తీసి అటవీ అధికారులకు సమాచారం అందించారు. అటవీ అధికారులు గ్రామస్తులను అభినందించారు. 

.................................................................................................................................................

32. పార్లమెంటు వర్షాకాల సమావేశాలపై చర్చించేందుకు కేంద్రం నేడు అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. రేపటి నుంచి పర్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

.........................................................................................................................................................

33. విపక్షాల ఐక్యతా సమావేశానికి వేదిక అయిన బెంగళూరులో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ఒక వంతెనను నిర్మించలేని వ్యక్తి దేశానికి ప్రధాని పదవికి పోటీ పడటమా అంటే వెలిసిన పోస్టర్లను బెంగళూరు నగరపాలక సంస్థ తొలగించింది.

..................................................................................................................................................

 

34. ర్ణాటక రాజధాని బెంగళూరులో పేలుళ్లకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా ఐదుగురు అనుమానితులను సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు.  

......................................................................................................................................................

35. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై మంత్రి ఆర్కే రోజా  మరో సారి ఫైర్ అయ్యారు. పవన్  దళపతి కాదు దళారి అంటూ విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆమె చంద్రబాబు కోసం జగన్  ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు.  

.........................................................................................................................................

36. మైనార్టీ మహిళలకు కుట్టుమిషన్లు అందజేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన  కేసీఆర్‌ కానుక పథకం దరఖాస్తులకు  రేపటితో గడువు ముగియనున్నది.   నిరుపేదలైన మైనార్టీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం 20 వేల కుట్టుమిషన్లను అందజేయనున్నది.  

...................................................................................................................................................

 

37. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు   మహారాష్ట్ర పర్యటన ఖరారైంది. వచ్చే నెల 1వ తేదీన మహారాష్ట్రలోని   వాటేగావ్‌ లో తుకారం భావురావ్‌ సాఠే జయంతి వేడుకల్లో కేసీఆర్‌ పాల్గొననున్నారు. మహాలో బీఆర్ఎస్ విస్తరణ కోసం కేసీఆర్ కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. 

.............................................................................................................................................

38. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ   దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని విప్‌ అరెకపూడి గాంధీ అన్నారు.   హఫీజ్‌పేట్‌ డివిజన్‌కు చెందిన  పలువురు వ్యాపారులు   బీఆర్‌ఎస్‌లో  చేరిన సందర్భంగా గాంధీ మాట్లాడుతూ కేసీఆర్ సీఎంగా హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు.  

...................................................................................................................................................

39.నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ జిరాయాత్ నగర్ లో ఇద్దరు మహిళల దారుణ హత్య కలకలం రేపింది.   అక్క చెల్లెళ్లయిన మగ్గిడి గంగవ్వ (62 ) ,మగ్గిడి రాజవ్వ (72 )ను గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో కొట్టి హత్య చేశారు.

..............................................................................................................................................

40. ఆగస్టు 8న పాక్ జాతీయ అసెంబ్లీ రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాక్  జాతీయ అసెంబ్లీని పదవీ కాలం ముగియడానికి రోజుల ముందే రద్దు చేసేందుకు  పాలక సంకీర్ణ భాగస్వామ్య పక్షాలు అంగీకరించినట్లు తెలుస్తోంది.

By
en-us Political News

  
జన్ సూరాజ్ పార్టీని స్థాపించి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. 2014 ఎన్నికలలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే ఘన విజయం సాధించడం నుంచి మొదలు పెడితే.. 2019లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ నాయకత్వంలోని వైసీపీ, ఆ తరువాత పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ లను అధికారంలోకి తీసుకురావడానికి తన వ్యూహాలే కారణమని తన భుజాలను తానే చరిచేసుకుని మరీ చెప్పుకున్న ప్రశాంత్ కిషోర్.. తన సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోలేక చతికిల పడ్డారు.దీంతో ప్రశాంత్ కిశోర్ ప్రతిష్ఠ మసకబారింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎండగట్టారు. అమరావతిని జగన్ నిరంతరం ప్రయత్నిస్తున్నారనీ, ఇప్పుడు కొత్తగా మావిగన్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు
ఏపీకి రాజధాని ఏది? అమరావతి శాశ్వతమా లేక మావిగాన్ అంటూ జగన్ చేసిన ప్రతిపాదనతో మళ్లీ రాజధానిపై జనంలో అనుమానాలు మొదలయ్యాయా? అన్న చర్చ మొదలైంది. ఏపీ రాజధాని విషయంలో మరో ప్రయోగం మొదలుకాబోతోందా? అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతి వేడుకలు దేశరాజధానిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్లమెంటు ఆవరణలోని ప్రేరణా స్థల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేశాధినేతలు, రాజకీయ దిగ్గజాలు ఒకే వేదికపైకి వచ్చారు. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
బీజేపీకి ఓటేస్తే.. సామాజిక న్యాయానికి పాడె కట్టడమేనన్నారు. రాష్ట్రంలోని బీజేపీని అడుగుపెట్టనీయవద్దని, ఒక్క సీటు కూడా వారికి ఇవ్వకుండా తమిళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల కోరారు.
అమరావతికి సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధ రాజధానిగా గుర్తింపు లభించిన తరువాత కూడా సజ్జల మౌలిక వసతులు లేని ప్రాంతంలో వేలకోట్టు కుమ్మరిస్తోందంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు కూడా అమరావతి అభివృద్ధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నా.. గ్రాఫిక్స్ రాజధాని అంటూ పాత పాటే పాడారు సజ్జల.
ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశం అత్యంత ఆత్మీయంగా, భావోద్వేగాల మధ్య సాగింది. చాలా కాలం తర్వాత తన పాత మిత్రుడిని కలిసిన జీవన్ రెడ్డి ఒ ఉద్వేగానికి లోనయ్యారు.
గత కొంతకాలంగా తనపై సాగుతున్న అభిశంసన ప్రక్రియ, అలాగే నివాసంలో లభించిన లెక్కకు రాని నగదు వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం నితీశ్ కుమార్ ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి పదవికి మరో మూడు నాలుగు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. తాను లేని పక్షంలో రాష్ట్ర బాధ్యతలను కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
వైసీపీ సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా న్యాయమూర్తులు రాజకీయ ఫ్లెక్సీలపై స్పందిస్తూ.. ఎవరిని ధ్వంసం చేయాలని చూస్తున్నారు? 2029లో రాష్ట్రాన్నా లేక ప్రజలనా? అంటూ ప్రశ్నించారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన రోజున జరిగిన పరిణామాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.