టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో మలుపు!?

Publish Date:Apr 27, 2022

Advertisement

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) రెండు పదుల వయసును దాటేసింది. 21 ఏళ్లను పూర్తి చేసుకుని 22లోకి అడుగుపెడుతోంది. ఒక ప్రాంతీయ పార్టీ చరిత్రలో 20 ఏళ్లు అంటే చిన్న వయసు కాదు. నిజానికి, తెరాస ఆవిర్భావ సందర్భంలో అయితే అంతకు ముందు ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా అంతకు ముందు ఏర్పడిన పార్టీల బాటలోనే తెరాస కూడా తెరమరుగై పోతుందనే అభిప్రాయమే బలంగా వినిపించింది. అయితే, పుష్కర కాలం పైగా తెరాస సారధ్యంలో సాగిన తెలంగాణ ఉద్యమం 1200 మంది తెలంగాణ బిడ్డల బలిదానంతో 2014 లో విజయవంతమైంది. అది చరిత్ర.

ఇక ప్రస్తుతంలోకి వస్తే, అలా, మఘలో పుట్టి పుబ్బలో పోతుందనుకున్న పార్టీ, ఈరోజు 21సంవత్సరాలు పూర్తి చేసుకుని 22 వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది.అంతే కాదు, ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్న తెరాస, కాలానుగుణంగా రూపాంతరం చెందుతూ వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు ఉద్యమ పార్టీగా అందరినీ కలుపుపోయిన తెరాస, రాష్ట్ర ఆవిర్భావ క్షణం నుంచే, ఫక్తు పదహారు అణాల రాజకీయ పార్టీగా అవతరించింది. అక్కడి నుంచి ఇప్పటి వరకు ఏమి జరిగింది అనేది, కళ్ళ ముందు కదులుతున్న చరిత్ర. నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ, ఉద్యమ పార్టీగా అవతరించిన తెరాస, ఇప్పుడు కుటుంబ పార్టీగా మారిపోయిందనే విమర్శలు, ఆ నాటి ఉద్యమ నాయకులే ఆరోపిస్తున్నారు.  

ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం తెరాస భవిష్యత్ విషయంలో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర అవతరణ నాటి నుంచి ఇంతవరకు జరిగిన అన్ని ఎన్నికలలో తెరాస ఆధిపత్యం కొనసాగుతూనే వుంది. అయినా, ముఖ్యమంత్రి ఇజ్జత్ కాసవాల్ గా తీసుకున్న హుజురాబాద్ ఉప ఎన్నికలో వేల కోట్ల రూపాయలు కుమ్మరించినా, ఫలితం లేక పోవడంతో తెరాసలో భయం మొదలైంది. హుజురాబాద్ ఓటమితో మొదలైన  అలజడి, ఈరోజు వరకు కూడా కొనసాగుతూనే వుంది. చివరకు, ఎన్నికల వ్యూహరచనలో ఎవరికీ తీసిపోని, కేసీఆర్, దేశంలో ఎన్నికల వ్యూహకర్తగా ఓ వెలుగు వెలుగుతున్న ప్రశాంత్ కిశోర్’ ను ఎంగేజ్ చేసుకున్నారు. ఇందుకు తెరాస నాయకులు ఏకారణం చెప్పినా, తెరాస నాయకత్వానికి విశ్వాసం సన్నగిల్లడం వల్లనే పీకే. ఐప్యాక్ అవసరం ఏర్పడిందని పరిశీలకులే కాదు, ప్రజలు కూడా నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. ఎవరో అన్నట్లుగా ఇలా ఒక ఉద్యమ పార్టీ, కిరాయి వ్యూహకర్తను వేల కోట్ల రూపాయలు కుమ్మరించి హైర్ చేసుకోవడం, ఉద్యమ స్పూర్తికే అవమానమా అనే మాట వినవస్తోంది.

అయితే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, అందుకు ఇంకా కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ, అన్నటికంటే ముఖ్యంగా 1200ల మంది బలిదానంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన, కుటుంబ అవినీతి పడుకుపోవదమే ప్రధాన కారణంగా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. అయితే, తెరాస నాయకత్వం మాత్రం, ఆవిషయంలో తగ్గేదేలే, అన్న విధంగా ముందుగు సాగుతోంది. ఈ రోజు జరుగుతున్న ప్లీనరీ క్రతువు మొత్తం, అంతా (తారక) రామ మయం అన్నవిధంగా సాగుతోంది. అంటే, కుటుంబ పాలనకు జై కొడుతోంది. కేసీఆర్’ స్థానంలో కేటేఆర్’ బొమ్మ కనిపిస్తోంది.ఈ నేపధ్యంలో తెరాస భవిష్యత్ ఏమిటి? ఎలా ఉంటుంది? ఏమవుతుంది?అనేది కాలమే నిర్ణయించాలి..నిర్ణయిస్తుంది, అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

By
en-us Political News

  
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. వచ్చారు. అందులో విశేషం లేదు. మరో రెండు మూడు రోజుల్లో ఈ నెల 30న మరో సారి కూడా వెడతారు. గ డచిన 17 నెలల్లో మొత్తం 44 సార్లు.. అంటే సగటున నెలకు రెండు సార్లు ముఖ్యమంత్రి ఢిల్లీ యాత్రలు చేశారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. నెలలో రెండు సార్లు కాదు, ఒకే రోజులో రెండు సార్లు ఢిల్లీ వెళ్లి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.
వైసీపీ సోషల్ మీడియా వింగ్ మాజీ హెడ్ పిల్ల సజ్జల అదేనండీ.. సజ్జల భార్గవరెడ్డి మంగళగిరి పోలీసు స్టేషన్ లో ఉన్నారు. సామాజిక మాధ్యమంలో అనుచిత వ్యాఖ్యలు కేసులో ఆయనకు జారీ అయిన నోటీసుల మేరకు విచారణకు ఆయన మంగళగిరి పోలీసు స్టేషన్ కు వచ్చారు.
నటుడిగా, నాయకుడిగా అంతకు మించి గొప్ప దార్శనికుడిగా ఎన్టీఆర్ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా ప్రధాని ఆయనకు ఘన నివాళులర్పించారు.
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఘన నివాళి అర్పించారు. జూనియర్ తో పాటు ఆయన సోదరుడు కల్యాణ్ రామ్ కూడా ఉన్నారు.
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఒక సంఘ సంస్కర్త అని, సంక్షేమానికి సరికొత్త మార్గం చూపిన మహనీయుడని కొనియాడారు.
కడన వేదికగా జరుగుతున్న తెలుగుదేశం మహానాడులో రెండో రోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పిస్తూ కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నాయకుడు పూసపాటి అశోక్ గజపతి రాజు తీర్మానం ప్రవేశ పెడతారు.
తెలుగుదేశం పెద్ద పండుగ మహానాడు ఈ సారి కడపలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తొలి రోజు మంగళవారం (మే26) పూర్తిగా పార్టీ అజెండాలపైనే సాగింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు లోకేశ్ తెలుగుజాతి విశ్వఖ్యాతి, యువగళం, స్త్రీశక్తి, పేదల సేవలో సోషల్‌ రీఇంజినీరింగ్‌, అన్నదాతకు అండగా కార్యకర్తలే అధినేత అన్న ఆరు శాసనాలను ప్రతిపాదించారు.
పైకి జంతుప్రేమికురాలిగా నటిస్తూ.. కుక్కలను చంపి తింటున్న మహిళ ఉదంతం చైనాలో వెలుగు చూసింది. గతంలో చైనాలో కుక్క మాంసంపై ఎలాంటి ఆంక్షలు లేకపోయినా.. కరోనా అనంతరం నిబంధనలు కఠినతరం చేసారు. కుక్కమాంసం తినడం పై నిషేధం విధించారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వేసవి సెలవులు ముగింపు దశకు వస్తుండటంతో తిరుమలేశుని దర్శనానికి భక్తులు పొటెత్తుతున్నారు.
తెలుగు జాతి గుండె చప్పుడు ఎన్టీఆర్. తెలుగు నేల, తెలుగు జాతి ఉన్నంత వరకూ గుర్తుండి పోయే మహోన్నత వ్యక్తిత్వం ఆయన సొంతం. తెలుగుజాతి ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడిన సందర్భంలో ఆయన చేసిన సింహ గర్జన యావత్ దేశాన్నే ఉలిక్కిపడేలా చేసింది.
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాల రెండో విడత ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరై, వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందజేశారు.
తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యధికంగా 64 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘భూభారతి’ అనేది పేద రైతుకు చుట్టమని ముఖ్యమంత్రి అన్నారు.
మహానాడు ఈ పదం విన్నా, చదివినా వెంటనే గుర్తుకు వచ్చేది తెలుగు దేశం పార్టీనే. అంతలా తెలుగువారి గుండెల్లో స్థిరపడిపోయిందని జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.