ఢీ.. లిమిటేషన్.. దక్షిణాది రాష్ట్రాల భయాలేంటి?!

Publish Date:Mar 24, 2025

Advertisement

ఆలు లేదు చూలు లేదు .. కొడుకు పేరు సోము లింగం అన్నట్లు, లోక్ సభ నియోజక వర్గాల పునర్విభజన అంశం పై, ఏడు రాష్ట్రాలకు చెందిన 14 పార్టీల నాయకులు చెన్నై లో సమావేసమయ్యారు. అయితే, దాహం వేసినప్పడు బావిని తవ్వడం కంటే, రేపటి అవసరాన్ని ముందుగానే గుర్తించి, ముందుగానే పలుగు పార ఎత్తడం విజ్ఞత అనిపించుకుంటుంది. సో.. నియోజక వర్గాల పునర్విభజన ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి, అడుగు ముందు కేయడం తప్పేమీ కాదు. అయితే, ఇలాంటి సున్నితమైన అంశాల విషయంలో ఇటూ అటూ కూడా ఆచి తూచి అడుగులు వేయడం అవసరం. 

నిజానికి డిలిమిటేషన్ కు సంబందించి కేంద్ర ప్రభుత్వం మనసులో ఏముందో  ఎవరికీ తెలియదు. ఇందుకు సంబందించి, దక్షిణాది రాష్ట్రాల్లో  ‘ఒక్క’ సీటు కూడా తగ్గదు అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా  చేసిన ప్రకటన తప్ప  కేంద్రం నోటి నుంచి మరొక్క మాట బయటకు రాలేదు. అసలు కేంద్రం మనసులో ఏముందో  తెలియక  పోవడమే కాదు.. ఇటు  నుంచి  మరో పాతికేళ్ళు, లోక్ సభ స్థానాల సంఖ్య విషయంలో  యథాతథ స్థితిని కొనసాగించాలనే ప్రతిపాదన తప్ప మరో ప్రత్యామ్నాయ ప్రతిపాదన ఏదీ పస్పుటంగా బయటకు రాలేదు. అదొకటి అయితే అసలు డిలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభానికే ఇంకా చాలా సమయం వుంది. అంతకు ముందు జనగణన జరగాలి. జనగణనతో ముడి పడిన కుల గణన కుంపటి ఒకటి అలా  రగులుతూనే వుంది.

ఈ అన్నిటినీ మించి మరో పాతికేళ్ళ పాటు, పునర్విభజన జోలికి వెళ్లరాదని, 2001 వాజపేయి ప్రభుత్వం విధించిన గడవు 2026లో గానీ ముగియదు. ఆ గడువు ముగిసన తర్వాతనే పునర్విభజన గురించి ఆలోచన చేస్తామని, అంతవరకు పునర్విభజన జరిపేది లేదని గతంలోనే మోదీ ప్రభుత్వం పార్లమెంట్ కు స్పష్టం చేసింది.ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విధంగా లోక్’సభ.శాసన సభ సీట్ల సంఖ్యను పెంచాలని, బీఆర్ఎస్ నోటి మాటగానే కాదు లిఖిత పుర్వకంగానూ సమాధానం ఇచ్చింది. 

అయితే  జనాభా దామాషా ప్రాతిపదికన లోక్ సభ నియోజక వర్గాల పునర్విభజ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్  లేవనెత్తిన ఆందోళన  దక్షణాది రాష్ట్రాలను ఏకం చేసింది. ఈ నేపధ్యంలో దక్షిణాది రాష్టాల ఐక్య వేదిక పురుడు పోసుకుంది. ఐక్య వేదిక తొలి సమావేశం ఆదివారం(మార్చి 22) చెన్నైలో  జరిగింది.  తమిళ నాడు ముఖ్యమంత్రి, డిఎంకె అధినేత ఎంకే స్టాలిన్  నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హాజరయ్యారు. అలాగే  కేరళ ముఖ్యమంత్రి  విజయన్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, పంజాబ్ ముఖ్యమంత్రి భగంత్ మాన్, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిథి స్టాలిన్ తోపాటుగా మరికొందరు ముఖ్యనాయకులు హాజరయ్యారు.

ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై ఐక్య పోరాటం సాగించాలని తీర్మానం చేశారు. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మరో అడుగు ముందుకేసి ‘‘జనాభా దామాషా ప్రాతిపదికన పునర్విభజనను దక్షిణాది వ్యతిరేకిస్తోంది. బీజేపీ ప్రతిపాదిస్తున్న ఈ పద్ధతిలో పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాల్లోని మనం రాజకీయ గళం కోల్పోతాం. ఉత్తరాది మనల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా తగ్గించి వేస్తుంది. అప్పుడు ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీ్‌సగఢ్‌ వంటి రాష్ట్రాలు ఆధిపత్యం చెలాయిస్తాయి అని సీఎం రేవంత్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం దీనికి అంగీకరించకూడదని,  దీనికి వ్యతిరేకంగా దక్షిణాది ప్రజలు, పార్టీలు, నేతలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. అంతే కాదు, 

పునర్విభజన ప్రక్రియపై రాష్ట్ర శాసన సభలో త్వరలోనే తీర్మానం ఆమోదిస్తామని, అదే తరహాలో మిగిలిన రాష్ట్రాల్లోనూ తీర్మానం చేయాలని సహచర ముఖ్యమంత్రులు, ఇతర నేతలకు రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పునర్విభజనపై తదుపరి సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహిస్తానని, పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడంపై అప్పుడు చర్చిద్దామని ప్రతిపాదించారు. ఈ పోరాటంలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తానని, దక్షిణాదిలోని ప్రతి ఒక్కరూ హక్కుల రక్షణకు కలిసి రావాలని పిలుపునిచ్చారు.

ఒక విధంగా చూస్తే, తమిళనాడు సిఎం  స్టాలిన్ లేవనెత్తిన అంశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి చంక నెత్తు కున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్ణాటక ఉపముఖ్యమంత్రి  డీకే శివకుమార్ కూడా సభకు హజరైనా, రేవంత్ రెడ్డి కొంచెం ఎక్కువ చురుగ్గా వ్యవహరించడం.. తదుపరి సమావేశం హైదరాబాద్ లో నిర్వహించాలని నిర్ణయించడం విషయంలో రాజకీయ వర్గాల్లో అనుమానాలు వ్యక మవుతున్నాయి, అలాగే  ఈ విష యం లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే పడవలో ప్రయాణించడం పట్ల కూడా  అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.

By
en-us Political News

  
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.