Publish Date:Jun 15, 2025
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ జరుగుతుంది. అందులో భాగంగా నియమితులైన సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ శనివారం పదవి బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన వాల్తేర్ డివిజనల్ మేనేజర్ తో పాటు రైల్వే అధికారులతో సమీక్ష నిర్వహించారు. జోన్ పరిధిలో పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తిచేసే అంశాలను చర్చించారు. మరోవైపు విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేసిన రైల్వే జోన్ లో వాల్తేర్ డివిజన్ కొనసాగించాలని ఇప్పటికే నిర్ణయించారు.
అయితే కొత్తగా ఏర్పాటు చేసిన రాయగడ డివిజన్లో పూర్తిగా ఒడిస్సా ప్రాంతం కలుపుతూ డివిజన్ పరిధిలో నిర్ణయించారు. కానీ వాల్తేర్ డివిజన్ కు సంబంధించిన కొన్ని ప్రాంతాలు మాత్రం ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోకి వెళ్లాయి. ఆరోగ్యంగా పలాస ఇచ్చాపురం... ఇటు కొత్తవలస నుంచి అరకు ప్రాంతం ఇతర డివిజనల్ లో ఉన్నాయి ఈ దశలో అరకు తో పాటు ఇచ్చాపురం వరకు ఉన్న రైల్వే ప్రాంతాన్ని విశాఖపట్టణం డివిజన్లో ఉంచుతూ సాంకేతికపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు కోరారు.
ఈ ప్రాంతానికి చెందిన ఎంపీ రామ్మోహన్ నాయుడు అరకు ఎంపీ డాక్టర్ తనుజా రాణి ఈ విషయంపై ఇప్పటికే కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు రైల్వే అధికారులకు కూడా లేఖలు రాయడం జరిగింది. ఈ దశలో కొత్తగా పదవి బాధ్యతలు చేపట్టిన జనరల్ మేనేజర్ త్వరలోనే రైల్వే బోర్డు అధికారుల నిర్ణయం మేరకు పరిధులు మార్చే అవకాశం ఉంది. ఈ మేరకు డి పి ఆర్ ను సవరించాలని కూడా అధికారులు భావిస్తున్నారు. ఇలా ఉండగా ఏపీ విభజన సమయంలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇస్తామని ప్రకటించినప్పటికీ పూర్తిస్థాయి ప్రక్రియ మాత్రం ఇప్పుడే మొదలైంది. ఈ దశలో ఆంధ్ర ప్రాంతంతో కూడిన రైల్వే స్టేషన్లు విశాఖ డివిజన్లో ఉండే రీతిన పరిధులు మార్చాలని అధికారులు చేస్తున్నట్టు తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/south-coast-railway-zone-39-199980.html
Publish Date:Mar 11, 2026
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండుసార్లు, కాంగ్రెస్ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ తగిలి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కోలుకుని ఆయన మండలికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాదరంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడలు బండ్లు అవుతాయి. బండ్లే ఓడలవుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవసరం తీరిపోయిన తర్వాత విసిరేసిన తెడ్డే.. చివరికి పడవ బోల్తా పడ్డప్పుడు దిక్కవుతుంది. అన్నదానికి జగన్ అపరిపక్వంతో కూడుకున్న రాజకీయ విధానాలే ఉదాహరణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జరుగుతుందో పవన్ కల్యాణ్ విడమరచి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫకేషన్ జారీ చేయగానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయకుడు, మాజీ హోం మంత్రి మహమూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ తర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం నరేందర్ రెడ్డి.. నేడు ఆయన రాజకీయ సలహాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్దల సభలోకి సగర్వంగా అడుగు పెడుతున్నారు.