Publish Date:Jun 15, 2025
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ జరుగుతుంది. అందులో భాగంగా నియమితులైన సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ శనివారం పదవి బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన వాల్తేర్ డివిజనల్ మేనేజర్ తో పాటు రైల్వే అధికారులతో సమీక్ష నిర్వహించారు. జోన్ పరిధిలో పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తిచేసే అంశాలను చర్చించారు. మరోవైపు విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేసిన రైల్వే జోన్ లో వాల్తేర్ డివిజన్ కొనసాగించాలని ఇప్పటికే నిర్ణయించారు.
అయితే కొత్తగా ఏర్పాటు చేసిన రాయగడ డివిజన్లో పూర్తిగా ఒడిస్సా ప్రాంతం కలుపుతూ డివిజన్ పరిధిలో నిర్ణయించారు. కానీ వాల్తేర్ డివిజన్ కు సంబంధించిన కొన్ని ప్రాంతాలు మాత్రం ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోకి వెళ్లాయి. ఆరోగ్యంగా పలాస ఇచ్చాపురం... ఇటు కొత్తవలస నుంచి అరకు ప్రాంతం ఇతర డివిజనల్ లో ఉన్నాయి ఈ దశలో అరకు తో పాటు ఇచ్చాపురం వరకు ఉన్న రైల్వే ప్రాంతాన్ని విశాఖపట్టణం డివిజన్లో ఉంచుతూ సాంకేతికపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు కోరారు.
ఈ ప్రాంతానికి చెందిన ఎంపీ రామ్మోహన్ నాయుడు అరకు ఎంపీ డాక్టర్ తనుజా రాణి ఈ విషయంపై ఇప్పటికే కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు రైల్వే అధికారులకు కూడా లేఖలు రాయడం జరిగింది. ఈ దశలో కొత్తగా పదవి బాధ్యతలు చేపట్టిన జనరల్ మేనేజర్ త్వరలోనే రైల్వే బోర్డు అధికారుల నిర్ణయం మేరకు పరిధులు మార్చే అవకాశం ఉంది. ఈ మేరకు డి పి ఆర్ ను సవరించాలని కూడా అధికారులు భావిస్తున్నారు. ఇలా ఉండగా ఏపీ విభజన సమయంలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇస్తామని ప్రకటించినప్పటికీ పూర్తిస్థాయి ప్రక్రియ మాత్రం ఇప్పుడే మొదలైంది. ఈ దశలో ఆంధ్ర ప్రాంతంతో కూడిన రైల్వే స్టేషన్లు విశాఖ డివిజన్లో ఉండే రీతిన పరిధులు మార్చాలని అధికారులు చేస్తున్నట్టు తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/south-coast-railway-zone-25-199981.html
ఇంగ్లాండ్తో బర్మింగ్హామ్లో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ 587 పరుగులకు ఆలౌటైంది.
అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలో తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉండడంతో అరెస్టు చేసిన ఇరువురి ఇళ్లను సోదాలు చేశామని, భారీ మొత్తంలో విస్పోటక పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని కర్నూలు రేంజ్ డి.ఐ.జి డాక్టర్ కోయ ప్రవీణ్ తెలిపారు.
అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను పోలీసులు నిర్వీర్యం చేశారు.
ఐదు మంది సెంచురీలు చేసినా ఫస్ట్ టెస్ట్ లో ఓటమి భారత్ కి అత్యంత చెత్త రికార్డును తీసుకొచ్చి పెట్టింది. గిల్ కెప్టెన్సీలోని టీమిండియా. ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సీరీస్ లో రెండో టెస్ట్ లో ఎలాగైనా సరే విజయం సాధించాలన్న గట్టి పట్టుదలతో ఆడుతున్నాడు యంగ్ కెప్టెన్ శుభ్ మన్ గిల్.
ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ఫోర్టులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు.
వరంగల్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ, రెండుగా చీలిపోయిందా? అంటే, విశ్లేషకులు అవుననే అంటున్నారు. మంత్రి కొండా సురేఖ అండ్ ఫ్యామిలీ ఒక జట్టుగా, మిగిలిన ఎమ్మెల్యేలు మరో జట్టు హస్తం పార్టీ రెండుగా చీలి పోయిందని, మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రియుడి మోజులో పడి ప్రియుడితో కలిసి తన సంవత్సన్నర వయస్సు గల కూతురిని చంపిన కేసులో ఇద్దరు ముద్దయిలకు జీవిత కాలం ఖైదు మరియు 5 వేల రూపాయల జరిమానా విధించారు.
బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు అస్వస్థతకు గురియ్యారు. ఆయన సీజనల్ ఫీవర్తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరారు.
కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరుని తోమాల సేవ, అభిషేక సేవలలో కూర్చుని తనివి తీరా చూడాలని భావించిన వారి కోరిక ఫలించలేదు
హైదరాబాద్, ఏస్ఆర్నగర్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. క్రిష్ హొటల్ భవనంలో ఉన్న కాఫీడేలో మంటలు చేలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళకు గురయ్యారు.
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ పతంజలి ఆయుర్వేద్ కంపెనీకి ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. డాబర్ చ్యవన్ప్రాష్ లక్ష్యంగా చేసుకుని తప్పుదోవ పట్టించే ప్రకటనలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.
అంగన్వాడీ హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి పొందేందుకు ఉన్న గరిష్ఠ వయోపరిమితిని 45 నుంచి 50 ఏళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రఖ్యాత ఫుట్బాల్ క్లబ్ లివర్పూల్ స్టార్ ఆటగాడు డియోగో జోటా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు.