వీర్రాజుకు ఉద్వాసన.. అందుకేనా ప్రేలాపనలు ?

Publish Date:Jan 28, 2022

Advertisement

ఆంధ్ర ప్రదేశ్’లో రాజకీయాల్లో బీజేపీ పరిస్థితి ఏంటో, ఎన్నికల్లో  ఆపార్టీ స్టేక్’ ఏంటో, ఓటింగ్ షేర్ ఏంటో వేరే చెప్పనక్కర్లేదు. లేటెస్ట్’గా ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్’ లోనూ బీజేపీకి ‘జీరో’ సీట్లే వచ్చాయి. ఓటింగ్  షేర్ కూడా జీరోకు దగ్గరగానే వుంది. అయినా, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడడం వలన చేత, రాష్ట్రంలో ఆ పార్టీకి, ఆ పార్టీ నాయకులకు ఇంకా అంతో ఇంతో  రాజకీయ గౌరవం దక్కుతోంది.
అయితే, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆ కాసింత గౌరవం, గుర్తింపును కూడా ఖర్చు రాసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారని, సోషల్ మీడియాలో కమల దళం అభిమానులే సెటైర్’లు వేస్తున్నారు. రాజకీయాలలో నోరు, రెండు వైపులా పదునున్న కత్తి. మాటలతో మాయ చేసి రాజకీయ పరమపదసోపాన పటంలో, పై మెట్టుకు చేరినవవారున్నారు. అలాగే, నోరు జారి కింది మెట్టుకు చేరిన వారూ ఉన్నారు. ఆనాలోచిత,అసందర్భ ప్రేలపనాలు చేసి ..కథ కంచికి మనం ఇంటికి.. అన్నట్లుగా రాజకీయ జీతానికి స్వయంగా చుక్క పెట్టుకున్న పెద్దలూ ఉన్నారు.
అదలా ఉంచి, విషయంలోకి వస్తే, సోము వీర్రాజు ఇటీవలి కాలంలో పొరపాటునే నోరు జరుతున్నారో, పెద్ద నోరు నానీలను ఆదర్శంగా తీసుకుంటున్నారో ఏమో కానీ, వరస పెట్టి వివాదస్పద వ్యాఖ్యలు  చేస్తున్నారు. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఆయన ఇమేజ్’ని పెంచుతున్నాయో, తగ్గిస్తున్నాయో కానీ, పార్టీకి తలవపులు తెస్తున్నాయని, పార్టీ ఇమేజిని దెబ్బతీస్తున్నాయని  పార్టీలోనే ఒక వర్గంలో చర్చ జరుగుతోంది.
కొద్ది కాలం కాలం క్రితం ఆయన తమ పార్టీ అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ యాభై రూపాయలకే ఇస్తామని చేసిన ప్రకటన రాష్ట్ర సరిహద్దులు దాటి ప్రకంపనలు సృష్టించింది. చివరకు, తెలంగాణ మంత్రులు, తెరాస నాయకులు కూడా, అక్కడ బీజేపీని  ఆట పట్టించేందుకు వీర్రాజు ప్రకటనను వాడుకున్నారు. వీర్రాజు వ్యాఖ్యలు దేశవ్యాప్తంగానూ బీజేపీకి మచ్చను తెచ్చి పెట్టాయి.

అదలా ఉంటే ఇప్పుడు తాజాగా, కడప జిల్లా రక్తపాతానికి, హత్యలకు నిలయం అన్న అర్థం వచ్చేలా, కడప జిల్లాలో ఎయిర్‌పోర్టు ఎందుకు వాళ్లకి ప్రాణం తీయడమే వచ్చు అంటూ వీర్రాజు వేసిన సెటైర్, చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైసీపీ అభిమానులు పెద్ద ఎత్తున సోము వీర్రాజుపై విరుచుకుపడుతున్నారు. సోము వీర్రాజు ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారో ఏమో కానీ, మళ్ళీ మరోమారు పార్టీ సంజాయిషీ ఇచ్చుకోవలసిన  పరిస్థితి ఏర్పడింది. ఓ వంక రాయల సీమ జిల్లాల్లో పార్టీని బలోపెతంచేసేందుకు,టీడీపీ నుంచి బీజ్పీలో చేరిన సుజనా చౌదరి,సీఎం రమేష్, ఇతర నాయకులు ప్రయత్నిస్తున్న సమయంలో  వీర్రాజు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో పార్టీ డిఫెన్సులో పడిందని అంటున్నారు.

నిజానికి, సోము వీర్రాజుకు పాత ‘కాపు’, మొదటి నుంచి పార్టీలో ఉన్న వ్యక్తి అనే నమ్మకంతోనే పార్టీ ఆయనకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. అయితే, గడచిన రెండు సంవత్సరాలలో ఆయన ఫెయిల్ అయ్యారు. పార్టీని ఫైల్ చేశారు. వాట్ నెక్స్ట్ ... ఉద్వాసనేనా ..అంటే .. అవుననే అంటున్నారు. నిజానికి, ఉద్వాసన తప్పదనే సంకేతాలు చేరడం వల్లనే సోమూజీ, ఫ్రస్ట్రేషన్’లో కి జారుకుని  ... నోరు జరుతున్నారని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీలో ఎవరు వచ్చినా బీజేపీని లేపడం అయ్యే పనికాదని, రాష్ట్రంలో టీడీపీ, వైసేపీ తప్ప మూడో పార్టీకి సమీప భవిష్యత్’ లో భవిష్యత్ లేదని రాజకీయ పండితులు జోస్యం చెపుతున్నారు.

By
en-us Political News

  
ఏపీలో అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల వేళ నేతల ప్ర‌చారం హోరెత్తుతోంది. రాష్ట్రం న‌లుమూల‌లా అభ్య‌ర్థులు గెలుపుకోసం ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లి ఓట్లు అభ్య‌ర్థిస్తున్నారు. ఏపీ మొత్తం ఒక ఎత్త‌యితే గుంటూరు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ఒక్కటీ ఒక ఎత్తు. ఈ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో రాజ‌కీయ చైత‌న్యం ఎక్కువ‌, మేధావి వ‌ర్గ‌మూ ఎక్కువే. అలాంటి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం అభ్య‌ర్థి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ పార్టీకి రైతులు ఓట్లు పడే అవకాశాలు ఎంతమాత్రం లేకుండా పోయాయి.. దీని వెనుక ఎన్నో
చిన్నారుల్ని ఎన్నికల ప్రచారానికి వినియోగించటం తప్పుగా పేర్కొన్న నిరంజన్ రెడ్డి ఫిర్యాదుకు ఎన్నికల సంఘం స్పందించింది. జరిగిన సంఘటనపై విచారణ జరిపించాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను ఆదేశించింది. దీంతో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ.. సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రాకు ఆదేశాలు జారీ చేశారు. అమిత్ షాతో పాటు.. మరో నలుగురిపైనా మొఘల్ పురా పోలీసులు కేసు నమోదు చేసి.. ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
పదవి ఊడబోతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నవరత్నాల పేరుతో ఏవేవో పథకాలు అనౌన్స్ చేసి 2019లో
తన అన్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మానసిక పరిస్థితి మీద తనకు అనుమానంగా వుందని ఆయన సోదరి,
ఈ ఏడాది దీపావళి పండగ కొద్ది నెలల ముందే రాబోతోంది. ఈ ఏడాది మే 13న నరక చతుర్దశి, జూన్ 4న దీపావళి రానున్నాయి
ఇది ప్రపంచ వింతల్లో ఎన్నో నంబర్ అవుతుందో తెలియదుగానీ, ఇది నిజంగానే ప్రపంచ వింతే! మజ్లిస్ పార్టీ అధినేత,
సోనియా గాంధీ, రాహుల్​ గాంధీలు ఇప్పటికే పార్లమెంట్​లో ఉన్నారు. ఇప్పుడు తాను కూడా పోటీ చేసి గెలిస్తే. గాంధీ కుటుంబలో ఉన్న ముగ్గురూ. చట్టసభలో కూర్చున్నట్టు అవుతుంది. ఇది బీజేపీకి మరో అస్త్రంగా మారుతుందని ప్రియాంక గాంధీ భ‌య‌ప‌డ్డారు.
అమెరికాలో నర్సుగా పనిచేసిన 41 ఏళ్ళ హీథర్ ప్రెస్డీ అనే మహిళకు కోర్టు 7 వందల సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
గంజాయి వ్యాపారం సామ్రాజ్యాన్ని సృష్టించిన వారిని గుంజీలు తీయిస్తానని పెమ్మసాని హెచ్చరించారు.  గుంటూరులో ఎమ్మెల్యే స్థాయి వ్య‌క్తి గుట్కా, గంజాయి అమ్ముతున్నాడని ఘాటుగా విమ‌ర్శించారు. గుంటూరు జిల్లాను గంజాయి మత్తులో ముంచుతారా అంటూ నిలదీస్తున్నారు. గంజాయి మొక్కలను పీకి పారేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. 
హైదరాబాద్ నుయూటీ చేసే కుట్ర జరుగుతున్నదని,దాన్ని తిప్పి కోట్టాలని బీఆర్ఎస్ అందుకున్న కొత్త పల్లవి కేవలం తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి లోక్ సభ ఎన్నికలలో లబ్ధి పొందే ఎత్తుగడేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ నగరాన్ని యూటీ చేయాలని బీజేపీ కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఇటీవల ఆరోపించారు.
స్త్రీ, పురుషుల వైవాహిక స్థితి ఎలా వున్నప్పటికీ, పరస్పర అంగీకారంతో ఇద్దరు స్త్రీ పురుషులు శారీరక సంబంధం కలిగి వుంటే దాన్ని నేరం
రాజకీయ నాయకులంటే జనం చెవుల్లో పూలు పెట్టకపోతే కుదరదు. తెలంగాణ ప్రజల చెవుల్లో ఇప్పటి వరకు బీఆర్ఎస్ నాయకులు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.