ఆటోన‌గ‌ర్ స్థ‌లాల‌కు ప‌ట్టాలు రిజిస్ట్రేష‌న్ చేయిస్తాం.. కేశినేని చిన్ని

Publish Date:Apr 16, 2024

Advertisement

ఆటోన‌గ‌ర్ అనుబంధ సంఘాల‌తో ఆత్మీయ స‌మావేశం 
ముఖ్యఅతిధిగా పాల్గొన్న కేశినేని శివ‌నాథ్ 
చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో ఐలా ఏర్పాటు  


జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత తీసుకువ‌చ్చిన జీవో నెంబ‌ర్ 5,6 వ‌ల్ల ఆటోన‌గ‌ర్ ఆటోమొబైల్ కార్మికులు, య‌జ‌మానులు చాలా అయోమ‌యానికి గురై తీవ్ర అవ‌స్థ‌లు ప‌డ్డారు. అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన ఈ జీవో వ‌ల్ల కార్మికులు ఉపాధి కోల్పోతారు. కార్మికుల‌కి, ఆటోన‌గ‌ర్ మ‌నుగ‌డికి ప్ర‌మాదక‌ర‌మైన ఈ జీవోను చంద్ర‌బాబు గారు అధికారంలోకి రాగానే ర‌ద్దు చేయ‌టం జ‌రుగుతుంద‌ని బిజెపి, జ‌న‌సేన బ‌ల‌ప‌రిచిన టిడిపి విజ‌య‌వాడ ఎంపి అభ్య‌ర్ధి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) చెప్పారు.  తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలోని ఎన్.ఎ.సి క‌ళ్యాణ‌మండ‌పంలో మంగ‌ళ‌వారం ఆటోన‌గ‌ర్ అనుబంధ సంఘాల స‌భ్యుల‌తో ఆత్మీయ స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి ముఖ్యఅతిధిగా కేశినేని శివ‌నాథ్ , జిల్లా అధ్య‌క్షులు నెట్టెం ర‌ఘురామ్, ఎమ్మెల్యే అభ్య‌ర్ది గ‌ద్దె రామ్మోహ‌న్ తో క‌లిసి  పాల్గొన్నారు. 

ఈ సంద‌ర్భంగా కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ 1966లో ఏర్పాటైన ఆటోన‌గ‌ర్ అభివృద్ది  తెలుగుదేశం ప్ర‌భుత్వంలోనే జ‌రిగింద‌న్నారు. చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో ఆటోన‌గ‌ర్ లో ఐలా ఏర్పాటు చేయ‌టం జ‌రిగింద‌న్నారు. ఐలా ఏర్పాటు చేయ‌టం వ‌ల్ల ఆటోన‌గ‌ర్ స‌మ‌స్య‌ల‌తో పాటు, ఆటోమొబైల్ కార్మికుల స‌మ‌స్య‌లు కూడా ప‌రిష్కారం అయ్యాయ‌న్నారు. ఆటోన‌గ‌ర్ లో ఐలా ఎన్నిక‌లు నిర్వ‌హించ‌టానికి జ‌గ‌న్ భ‌య‌ప‌డుతున్నాడు. అందుకే ఇంత‌వ‌ర‌కు ఐలా ఎన్నిక‌లు నిర్వ‌హించ‌లేదు. నిర్వ‌హిస్తే టిడిపి ప్యానెల్ నెగ్గుతుంద‌ని జ‌గ‌న్ తెలుసే...ఎన్నిక‌లు నిర్వ‌హించ‌లేద‌ని మండిప‌డ్డారు. ఎన్డీయే ప్ర‌భుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయ‌క‌త్వంలో ఐలా ఎన్నిక‌లు నిర్వ‌హిస్తామ‌న్నారు. 

2014-19 మ‌ధ్య కాలంలో ఆటోన‌గ‌ర్ లో ఆటోమొబైల్, ట్రాన్స్ ఫోర్ట్ రంగం చాలా అభివృద్ది సాధించింది.అప్పుడు మెకానిక్స్ దగ్గ‌ర నుంచి టింక‌రింగ్, పెయింటింగ్ అంద‌రికి ప‌నులు వుండేవి. ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు. అధికారంలోకి రాగానే ఆటోన‌గ‌ర్ కి పూర్వ వైభ‌వం తీసుకువ‌చ్చేందుకు కృషి చేస్తాను. కాల‌నుగుణంగా ఆటోమొబైల్ కార్మికులు నైపుణ్యం పెంపొందించుకునేందుకు వీలుగా సిల్క్ డెవ‌ల‌ప్మెంట్ సెంట‌ర్స్ ఏర్పాటు చేయిస్తాన‌ని చెప్పారు. 

అలాగే ఆటోన‌గ‌ర్ ఏర్ప‌డి 58 సంవ‌త్స‌రాలు అవుతున్నా...ఇప్ప‌టి వ‌ర‌కు తాగునీటి స‌మ‌స్య ప‌రిష్కారం కాలేదు. ఇక్క‌డ వాట‌ర్ క‌ట్టినా..క‌నెక్ష‌న్స్ ఇచ్చే విష‌యంలో జాప్యం చేస్తున్నారు. అలాగే ఆటోన‌గ‌ర్ లో ప్ర‌ధాన స‌మ‌స్య అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్య‌వ‌స్థ స‌రిగా లేదు. దీంతో చిన్నపాటి వ‌ర్షం ప‌డినా ఆటోన‌గ‌ర్ మునిగిపోతుంది. అలాగే గుంట తిప్ప డ్రైయిన్ స‌మ‌స్య ప్ర‌ధానం గా వుంది. ఈ స‌మ‌స్య‌ల‌తో పాటు బందురు రోడ్డు, ఏలూరు రోడ్డు కు క‌నెక్టివిటి ఏర్పిచే సాల్వెంట్ రోడ్డు ఆక్ర‌మ‌ణ‌కు గురైంది.

ఈ స‌మ‌స్య‌ల‌న్నీ గ‌ద్దె రామ్మోహ‌న్, నెట్టం ర‌ఘురామ్‌, బోడె ప్ర‌సాద్ ల‌తో క‌లిసి చంద్ర‌బాబు  దృష్టి తీసుకువెళ్లి పరిష్కరించేంత వ‌ర‌కు కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు. యువ‌గ‌ళం పాద‌యాత్ర జ‌రిగిన‌ప్పుడే తెలుగుదేశం జాతీయ పార్టీ ప్ర‌ధాన  కార్య‌ద‌ర్శి లోకేష్ ను ఆటోన‌గ‌ర్ తీసుకురావ‌టానికి ప్ర‌య‌త్నించాను. అయితే ఆ రోజు ఆదివారం కావ‌టం వ‌ల్ల సాధ్య‌ప‌డ‌లేద‌న్నారు. పాత ప‌ద్దతుల్లో న‌డుస్తున్న ఆటోన‌గ‌ర్ ను అప్ గ్రేడెష‌న్ చేసే విష‌యం లోకేష్ తో మాట్లాడి..ఏ విధంగా ఆటోన‌గ‌ర్ ను అప్ గ్రేడేష‌న్ చేయాలో ప్ర‌ణాళిక సిద్దం చేసిన‌ట్లు తెలిపారు. ఆటోన‌గ‌ర్ లో ఆటో మొబైల్ వ్యాపారం చేసిన త‌న‌కి...ఇక్క‌డి స‌మ‌స్య‌లు బాగా తెలుసు అన్నారు. కేంద్రం లోనే కాదు రాష్ట్రంలో కూడా ఎన్డీయే ప్ర‌భుత్వం అధికారంలోకి రాబోతుంది. కేంద్రంలో మోదీ ప్ర‌ధాన‌మంత్రిగా , రాష్ట్రంలో చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా పద‌వీ స్వీకారం చేస్తార‌ని తెలిపారు. 

ఈ కార్య‌క్ర‌మంలో టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర అధ్య‌క్షుడు గొట్టుముక్క‌ల ర‌ఘురామ‌రాజు, మోటార్ కార్పెంట‌ర్ అసోసియేష‌న్ అధ్య‌క్షులు వి.ల‌క్ష్మీనారాయ‌ణ గారు, ఆటోన‌గ‌ర్ మెకానిక్ యూనియ‌ర్ కార్య‌ద‌ర్శి ద‌స్త‌గిరి, పెయింట్ అసోసియేష‌న్ కార్య‌ద‌ర్శి వీరాచారి, ఎపి లారీ అసోసియేష‌న్ అధ్యక్షులు వై.వి. ఈశ్వ‌ర‌రావు, అమ‌రావ‌తి కారు అసోసియేష‌న్ అధ్యక్షులు దివాక‌ర్, ఐలా అధ్య‌క్షులు దుర్గ‌ప్ర‌సాద్, శాస‌న‌మండలి మాజీ చైర్మ‌న్ ష‌రీష్,  ఎన్టీఆర్ జిల్లా అధ్య‌క్షుడు నెట్టెం రఘురామ్,  తూర్పు నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే అభ్య‌ర్ధి గ‌ద్దె రామ్మోహ‌న్, పెన‌మ‌లూరు ఎమ్మెల్యే అభ్య‌ర్ధి బోడే ప్ర‌సాద్, తెలుగుదేశం నాయ‌కులు బొప్ప‌న భ‌వ‌కుమార్, ఎమ్.ఎస్.బేగ్, చెన్నుపాటి వ‌జీర్,  జ‌న‌సేన ఎన్టీఆర్ జిల్లా స‌మ‌న్వ‌య క‌ర్త అమ్మిశెట్టి వాసు, మాజీ మేయ‌ర్ కోనేరు శ్రీధ‌ర్, బిజెపి తూర్పు నియోజ‌క‌వ‌ర్గ క‌న్వీన‌ర్ పోతంశెట్టి నాగేశ్వ‌ర‌రావు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

By
en-us Political News

  
రాయల్ భూటాన్ మొనాస్టరీ ప్రధాన బౌద్ధాచార్యులు ఖెన్ పొ ఉగేన్ నాంగెల్, బుద్ధవనం బౌద్ధ వారసత్వ థీమ్ పార్క్ ప్రత్యేకతలను ప్రశంసించినట్లు బుద్ధవనం కన్సల్టెంట్ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ మరోసారి పేదల ఖాతాల్లోకి సొమ్ము అంటూ హామీ ఇచ్చారు. దీంతో గతంలో కూడా విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని దేశానికి రప్పించి పేదల ఖాతాల్లో జమ చేస్తానంటూ ఇచ్చిన హామీ గురించి జనం గుర్తు చేసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల ప్రజలు జగన్ రావొద్దని, జగన్‌తో తమకు అవసరం లేదని, మళ్ళీ ఇంకొకసారి ఈ పెద్ద తిమింగలం అధికారంలోకి రాకూడదని కోరుకున్నారు.. 
రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగడం వల్ల ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెంచుకోవడం కోసం తప్ప ప్రభుత్వాలకు భూముల విలువ పెంచడం వెనుక మరో ఉద్దేశమేమీ కనిపించడం లేదు. 
సింగపూర్ ఎయిర్​లైన్స్​కు చెందిన ఓ విమానం ఆకాశంలో తీవ్రమైన కుదుపునకు లోనవ్వడం వల్ల ఓ వ్యక్తి మరణించారు. మరో 30 మంది ప్రయాణికులకు గాయాలైనట్లు సమాచారం. లండన్​ నుంచి సింగపూర్ వెళ్తున్న  విమానంలో మంగళవారం ఈ ఘటన జరిగినట్లు సింగపూర్ ఎయిర్​లైన్స్ సంస్థ వెల్లడించింది.
నేను చెప్పింది జరగకపోతే జనం నా ముఖం మీద పేడ కొడతారు. అదే, నేను చెప్పింది జరిగితే ఆ పేడ జగన్ ముఖాన పడుతుంది అన్నారు.
ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందడం మీద అనేక సందేహాలు ముసురుకుంటున్నాయి.
తెలంగాణా రాష్ట్రంలో ఉన్న 10 విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్స్‌లర్ల పదవీకాలం మంగళవారంతో ముగిసింది. అయితే, పారిపాలనా సౌలభ్యం కోసం ఉన్న వారికే ఇంచార్జీలుగా బాధ్యతలు ఆప్పగిస్తారా? లేదా ఐఎఎస్‌లను ఇంచార్జీలుగా నియమిస్తారా? అనే విషయం ఆసక్తికరంగా మారింది.
ఏపీలోని తూర్పు గోదావ‌రి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పెండ్యాల వెంక‌ట కృష్ణారావు (కృష్ణ‌బాబు) అనారోగ్యంతో మృతిచెందారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న హైద‌రాబాద్‌లో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఇవాళ తెల్లవారుజామున కృష్ణ‌బాబు చనిపోయినట్లు వైద్యులు, కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. 
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు కావడంతో గత నాలుగు రోజుల నుంచి భారీ సంఖ్యలో భక్తులు శ్రీవారి ద‌ర్శ‌నం కోసం క్యూక‌డుతున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు కిలో మీటర్ల మేర బారులు తీరుతున్నారు. ఇలా భ‌క్తుల తాకిడి పెర‌గడంతో టీటీడీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్ల జారీని తిరిగి ప్రారంభించాల‌ని నిర్ణ‌యించింది. ఈ నిర్ణయంతో భక్తుల రద్దీ ఉన్నాస‌రే.. శ్రీవారిని దర్శించుకునే సమయం తగ్గనుంది.
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నాయకుడు మనీష్ సిసోడియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆర్థిక, విద్య, ప్రణాళిక, పట్టణాభివృద్ధి, రెవెన్యూ, సేవలు, స్థానిక సంస్థలు, భూమి & భవనాలు, ఉన్నత విద్య, శిక్షణ & సాంకేతిక విద్య, విజిలెన్స్, సహకార సంఘాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ఇన్ఫర్మేషన్ & పబ్లిసిటీ వంటి అనేక ముఖ్యమైన విభాగాలకు సిసోడియా ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు.
ఈసారి లోకేష్‌కి 60 వేల ఓట్ల మెజారిటీ పక్కా అని తెలుగు తమ్ముళ్ళు ఢంకా బజాయించి చెబుతుంటే, వైసీపీ సానుభూతిపరులు మాత్రం తమ అభ్యర్థి ఆర్కే మీద సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
ఆత్మహత్య సదృశ్యం జగన్ రెడ్డి పరిపాలనాని అంటారు సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మాదిగాని గురునాదం. తిరుపతి, అనంతపురం, మాచర్లలో జరిగిన అల్లర్ల, విధ్వంసం, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇళ్లు ధ్వంసం చేసిన ఘటనలో వైసిపి పాత్ర వుంది. వీటన్నింటిపై సిట్ దర్యాప్తు జరుగుతుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.