కోడికత్తి జగన్నాటకానికి ఆరేళ్లు

Publish Date:Oct 25, 2024

Advertisement

2019 ఎన్నికలను జీవన్మరణ సమస్యగా తీసుకున్న జగన్ ఆ ఎన్నికలలో విజయం కోసం రకరకాల వ్యూహాలు పన్నారు. ఇష్టారీతిగా హామీలు గుప్పించి ప్రజలను మభ్యపెట్టారు. అలాగే కోడికత్తిదాడి, సొంతబాబాయ్ హత్య ఘటనలను తనకు సానుభూతి వచ్చేలా మలచుకున్నారు. ఎన్నికల పబ్బం గడిచి, అధికార పగ్గాలు అందుకోగానే  కొడికత్తి దాడి కేసు, వివేకా హత్య కేసుల దర్యాప్తునకు ఇసుమంతైనా సహకరించలేదు సరికదా, ఆ కేసుల దర్యాప్తునకు అడుగడుగునా అడ్డుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహనరెడ్డిపై విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో  జరిగిందని చెప్పబడుతున్న కోడికత్తి దాడికి ఆరేళ్లు పూర్తయ్యింది.

 2018లో విశాఖ‌ప‌ట్నంలో జ‌గ‌న్‌పై కోడి క‌త్తితో దాడికి పాల్పడ్డాడంటే జనుపల్లె శ్రీను అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. జగన్ మాత్రం తనపై దాడి వెనుక భారీ కుట్ర ఉందని ఆరోపిస్తూ, రాష్ట్ర పోలీసుల విచారణపై నమ్మకం లేదని పట్టుబట్టి మరీ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తునకు డిమాండ్ చేసి సాధించుకున్నారు. సరే  ఎన్ఐఏ దర్యాప్తు చేసి జగన్ పై కోడికత్తి దాడి కేసు వెనుక ఎటువంటి కుట్రకోణం లేదని తేల్చేసింది. ఈ కేసులోదాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొం టున్న జనుపల్లె శ్రీను బెయిలుకు కూడా నోచుకోకుండా  దాదాపు ఐదేళ్ల పాటు జైల్లో మగ్గిపోయాడు. 

2019 ఎన్నికలకు ముందు జరిగిన ఈ సంఘటన ద్వారా వచ్చిన సానుభూతి ఆ ఎన్నికలలో జగన్ పార్టీ ఘన విజయానికి కారణాల్లో ఒకటి అయ్యింది. అలాగే అప్పట్లో జగన్ పై సానుభూతి వెల్లువెత్తడానికి మరో సంఘటన కూడా కారణమైంది.  ఎన్ఐఏ ఈ కేసులో ఎటువంటి కుట్ర కోణం లేదని తేల్చేసిన తరువాత కూడా జగన్ కోర్టుకు హాజరై దాడి కేసులో బాధితుడిగా వాంగ్మూలం ఇవ్వడానికి సిద్ధపడలేదు సరికదా.. ఎన్ఐఏ విచారణనే తప్పుపడుతూ లోతైన దర్యాప్తు పరపాలని కోరుతూ  ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ దాఖ లు చేశారు. 

 ఇక్కడ ఒక విషయాన్నిచెప్పుకోవాల్సి ఉంటుంది. సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు జగన్ సొంత బాబాయ్, మాజీ మంత్రి, మాజీ ఎంపీ తన సొంత ఇంట్లో దారుణ హత్యకు గురయ్యారు. ఆయన ఒంటిపై గాయాలకు కుట్లు వేసి బ్యాండేజీలు కట్టి అది హత్య కాదు గుండెపోటు అని నమ్మించడానికి జగన్ విఫలయత్నం చేశారు.  ఆ కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ గత నాలుగేళ్లుగా కనీసం అరెస్టు కాకుండా హాయిగా తిరుగుతున్నారు.  అరెస్టు చేస్తాం అని కేంద్ర దర్యాప్తు సంస్థ కోర్టుకు చెప్పింది. అయినా ఆయ నకు ముందస్తు బెయిలు వచ్చింది.  కానీ హత్యాయత్నం కేసులో అరెస్టైన జనుపల్లె శ్రీనుకు మాత్రం ఐదేళ్ల పాటు బెయిలు దొరకలేదు. జనుపల్లె శ్రీనుకు బెయిలు రావాలంటే ఆ కేసులో బాధితుడిగా ఉన్న జగన్ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలి. జగన్ ఆ పని చేయలేదు.  అప్పట్లో అంటే కోడికత్తితో జగన్ పై విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన దాడి వెనుక అప్పటి అధికార పార్టీ తెలుగుదేశం కుట్ర ఉందంటూ అప్పట్లో ఆరోపణలు చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయంలో దాడి జరిగిందన్న సాకుతో ఎన్ఐఏ దర్యాప్తును సాధించుకున్నారు.  కానీ ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా తనపై జరిగిన దాడి కుట్రదారులకు శిక్ష పడాలని కేసు విచారణ వేగవంతం కావాలని కోరలేదు. పైపెచ్చు కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇవ్వకుండా కేసు విచారణను ఉద్దేశపూర్వకంగా నత్తనడకన సాగేలా చేశారు.  ఈకేసులో బెయిలుకు కూడా నోచుకోకుండా ఐదేళ్ల పాటు జైల్లో మగ్గిపోయిన జనుపల్లె శ్రీనుకు ఎట్టకేలకు కండీషన్డ్ బెయిలు లభించింది అది వేరే సంగతి. అయితే జగన్ తీరు కారణంగా ఇప్పటికే కేసు విచారణ పూర్తి కాలేదు. 

By
en-us Political News

  
ఆ ఆత్మీయ విందులో పాల్గొన్న వారెవరి మెబైల్ ఫోనూ ఒక్కసారి కూడా రింగ్ అవ్వలేదు. అంతెందుకు ఆ సమయంలో ఎవరూ ఫోన్ జోలికే పోలేదు. వాట్సాప్ చాటింగ్ ల ఊసే లేదు. కుటుంబాల ముచ్చట్లు, పెళ్లిళ్లు, పిల్లల చదువులు, కుటుంబాలా క్షేమ సమాచారాలు పంచుకోవడంతో అంతా ఆనందంగా ఆహ్లాదంగా గడిపారు.
తాజా జాబితాలో 5.67 కోట్ల మంది ఓటర్లు నమోదు కాగా, వీరిలో 2.77 కోట్ల మంది పురుషులు, 2.89 కోట్ల మంది మహిళలు 7,617 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. క్లెయిమ్‌లు, అబ్జెక్షన్ పీరియడ్‌లో దాఖలు చేసిన దరఖాస్తులను సమీక్షించి మార్పులు చేసినట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది.
రాష్ట్రంలో కాపు సామాజికవర్గం బానిస వర్గం కాదన్నారు. అరెస్టులకు భయపడేది లేదని ముద్రగడ ఈ సందర్భంగా చెప్పారు. గతంలో చంద్రబాబు తనను, తన కుటుంబాన్నీ వేధించిన తీరు అందరికీ తెలుసునని చెప్పిన ఆయన మాజీ మంత్రి ఇంటిపై ఏడు గంటల పాటు దాడులు చేయడం, అరెస్టులతో భయపెట్టాలని చూడటం ప్రజాస్వామ్యంలో సరికాదన్నారు.
కల్తీ పాల వల్లే వారు అనారోగ్యం పాలయ్యారని ప్రాథమికంగా నిర్థారణ అయిందన్నారు. అంతకుముందు కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ, వైద్యారోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో వర్చువల్ గా చంద్రబాబు సమావేశమైన చంద్రబాబు కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. పాల శాంపిల్స్ ఫలితాలు వచ్చిన తర్వాత పాలు అమ్మినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఇటీవ‌ల కిరాక్ ఆర్పీ.. వైసీపీ ఎమ్మెల్సీ, మండ‌లి ప్ర‌తిప‌క్ష నేత‌ బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ను అవ‌హేళ‌న చేస్తూ మాట్లాడారు. ఆ వెంట‌నే కాపుల్లో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంది. దీంతో దిగి వ‌చ్చిన ఆర్పీ క్ష‌మాప‌ణ చెప్పారు కూడా. అలాగ‌ని కాపులంతా వైసీపీకి స‌పోర్ట్ చేయ‌డం అని అర్ధం కాదు క‌దా ? అంటున్నారు వంగవీటి రాధా అభిమానులు.
రాజకీయ ప్రవేశంపై తనకు ఆసక్తి ఉన్న మాట వాస్తవమేననీ, అయితే అందుకు ఇంకా సమయం ఉందన్నారు. ఇప్పటికే ఆమె సోదరుడు వంగవీటి రాధా రాజకీయాల్లో చురుగ్గా ఉన్న సంగతి విదితమే.
తెలంగాణ‌లో కమలం పార్టీ ఎప్ప‌టి నుంచి పుంజుకుంది? రాష్ట్రంలో అధికారం చేప‌ట్టే అవ‌కాశ‌మెంత‌ అన్న‌దొక చ‌ర్చ‌.
తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైలు బ్రిడ్జిపై నుంచి అధిక సంఖ్యలో కవాహనాలతో వెళ్ల కూడదని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ అంబడి రాంబాబు, జక్కంపూడి రాజా ఆ నోటీసులను ధిక్కరించి భారీ ర్యాలీ నిర్వహించడమే కాకుండా రైల్ కం రోడ్డ బ్రిడ్జిపై పెద్ద సంఖ్యలో వాహనాలతో వెళ్లడంతో రాజమహేంద్రవరం పోలీసులు కేసు నమోదు చేశారు.
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
గుంటూరులోని తన నివాసంపై తెలుగుదేశం శ్రేణుల దాడి, తనపై హత్యయాత్నం చేయడం తదితర విషయాలను జగన్ కు తెలియజేశారు. ఈ సందర్భంగా జగన్ అంబటికి కేసులకు భయపడవద్దని ధైర్యం చేప్పారు. కేసులను చట్టపరంగా ఎదుర్కొందామని భరోసా ఇచ్చారు.
అప్పట్లో అధికారపార్టీలో ఉన్న అనంతబాబుతో అధికారంలో ఉన్న వై ఉన్న అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కయ్యారని వ్యాఖ్యానించింది. డీఫాల్ట్ బెయిల్ వచ్చేలా ఛార్జ్‌షీట్ దాఖలు చేశారని న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది.
వైసీపీ సభ్యులు వేంకటేశ్వర స్వామి ఫొటోలు, ప్లకార్డులతో పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. సభలో వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.