ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ కుప్పకూలి ఆరుగురు దుర్మరణం

Publish Date:Jun 15, 2025

Advertisement

అహ్మదాబాద్ లో  విమానం కుప్పకూలి కూలి 274 మంది మరణించిన దుర్ఘటన మరవక ముందే  ఉత్తరాఖండ్ లో ఓ హెలికాప్టర్ ప్రమాదంలో ఆరుగురు మరణించిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ కుప్పకూలిన సంఘటనలో ఆరుగురు మరణించారు.   డెహ్రాడూన్ నుంచి   కేదార్‌నాథ్‌కు ప్రయాణికులతో వెళ్తున్న హెలికాప్టర్ ఈ ఉదయం ఐదున్నర గంటల సమయంలో మార్గమధ్యంలో  కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు మరణించారు 

డెహ్రాడూన్ నుంచి కేదార్‌నాథ్‌కు బయలుదేరిన హెలికాప్టర్ త్రిజూగీనారాయణ్, గౌరీకుండ్ ప్రాంతాల మధ్య కుప్పకూలింది. ఆ హెలికాప్టర్ లో పైలట్ సహా ఆరుగురు ఉన్నారు. ఈ దుర్ఘటనలో ఆరుగురూ మరణించినట్లు అధికారులు తెలిపారు. హెలికాప్టర్ ప్రమాద సమాచరం అందుకున్న వెంటనే సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రతికూల వాతావరణమే ఈ ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు. 

By
en-us Political News

  
ఇప్పటికే ఎన్నో మలుపులు తిరిగిన ఫోన్ అక్రమ ట్యాపింగ్‌ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, చివరకు ఏ కంచికి చేరుతుందో.. ఎప్పుడు ఎలా ముగుస్తుందో ఏమో కానీ.. ఇంతవరకు అందుతున్న సమాచారం ప్రకారం ముందు ముందు పెద్ద తలకాయలకు చిక్కులు తప్పవని అంటున్నారు.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది.
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖలో సందడి మొదలైంది. కారణాలు ఏవైనా చాలా కాలంగా స్తబ్దుగా ఉన్న కమలదళం నాయకుల్లో కదలిక వచ్చింది. అయితే.. కదలికతో పాటు కయ్యాలకు తెర లేచింది.
వైసీపీ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. బుగ్గమఠం భూముల వ్యవహారంలో ఏపీ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
గుంతకల్లు తెలుగుదేశం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మరోసారి వివాదాల సుడిలో చిక్కుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిహసించేలా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
మంచు విష్ణు ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కన్పప్ప సినిమాకు సినిమా కష్టాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కన్నప్పలో కీలక సన్నివేశాల హార్డ్ డిస్క్ చోరీకి గురైంది. ఇప్పుడు సెన్సార్ సర్టిఫికేట్ విషయంలోనూ ఇబ్బందుకు ఎదురౌతున్నాయి.
మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావుకు పీపుల్స్‌వార్‌ మావోయిస్టు పేరుతో బెదిరింపు కాల్‌ వచ్చింది. ఈరోజు సాయంత్రంలోగా రఘునందన్ రావును చంపుతామని ఆగంతకుడు ఫోన్‌ చేశాడు
గుంటూరు జిల్లా తెనాలిలో సంచలనం రేకెత్తించిన జంట హత్యల కేసును పోలీసులు భేదించారు. పరిమి రోడ్డులో ఒంటరిగా ఉంటున్న వృద్ధ మహిళలు రాజేశ్వరి, అంజమ్మలను అత్యంత దారుణంగా హత్య చేసిన కేసులో కీలక సూత్రధారి మారిసి పేటకు చెందిన ఇన్సూరెన్స్ ఏజెంట్ పెరవలి కుసుమ కుమారిగా పోలీసులు నిర్ధారించారు.
బీజేపీ సీనియర్ నాయకుడు, పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు, నాగపూర్ ఎంపీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రధాన మంత్రి పదవిని ఆశిస్తున్నారా? ఆ దిశగా ఆయన అడుగులు పడుతున్నాయా? ప్రయత్నాలు ప్రారంభించారా? అంటే అటు నుంచి అటువంటి సంకేతాలే వస్తున్నాయని అంటున్నారు.
హైదరాబాద్ నాంపల్లిలోని గాంధీ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
తూర్పు నౌకాదళంలోకి మరో అత్యాధునిక యుద్ధ నౌక చేరింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ముంబైలో తయారైన యుద్ధనౌక ఐఎన్ఎస్ నీలగిరిని ఈ ఏడాది జనవరి 15న జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ జాతికి అంకితం చేసిన సంగతి తెలిసిందే.
నవంబర్ 15 నుంచి పది రోజుల పాటు సత్యసాయిబాబా శతజయంతి వేడుకలు జరగనున్నాయి.
జగన్ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి. విష ప్రయోగాలకు జగన్ సర్కార్ విద్యారంగాన్ని వాడుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.