ధర్మస్థలి మిస్టరీ మరణాలు.. సిట్ గోప్యత ఎందుకు?

Publish Date:Aug 5, 2025

Advertisement

ధర్మస్థలి మరణాల కేసు దర్యాప్తు చేస్తున్న సిట్.. ఈ విషయంలో పాటిస్తున్న గోప్యత.. తవ్వకాలలో బయటపడుతున్న విషయాలను వెల్లడించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు థర్మస్థలితో ప్రతి మరణం ఒక మిస్టరీగానే ఉంది. ఈ మిస్టరీ మరణాలలో   పద్మలత కేసు మరో మిస్టరీగా వెలుగులోకి వచ్చింది. దేవాలయానికి చెందిన కాలేజీలో  పద్మలత పీయూసి రెండవ సంవ త్సరం చదువుతున్నది.1986 డిసెంబర్ 22వ తేదీ మాయం అయింది. ఆమె వయస్సు 17 సంవత్సరాలు. ఆమె అదృశ్యం అయిన 56 రోజులు తర్వాత ఆమె శరీరం నేత్రావతీనదీ తీరంలో ఆస్థి పంజరంలా దొరికింది. ఆమె దుస్తులను బట్టి  ఆ అస్తిపంజరం పద్మలతదే అని గుర్తించారు. అప్పట్లో ధర్మస్థలిలో పోలీస్ స్టేషన్ లేదు.ఆమె ఆచూకీ లభించినా, అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా  ఎవరూ పట్టించుకోలేదు.  పద్మలత తండ్రి దేవానంద్ కమ్యూనిస్టు నాయకుడు. ఆయన కమ్యూనిస్టు పార్టీతో  కలిసి చేసిన  ఆందోళనతో చివరకు కేసు నమోదు చేసుకున్నారు. దేవానంద్ సమీప స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.

పోలీసులు ఆమె మృతదేహం లభ్యమైన తరువాత కూడా  సరైన దర్యాప్తు చేయక,ఆధారాలు లేవని కేసు క్లోజ్ చేసారు. హిందువుల కుటుంబానికి చెందిన పద్మలత శరీరాన్ని సాధారణంగా దహనం చేస్తారు. కాని ఆమె తండ్రి   తన కుమార్తె మరణానికి కారకులకు ఎప్పటికైనా శిక్ష పడాలన్న ఉద్దేశంతో ఖననం చేశారు.  ఆమె శరీరం అవశేషాలు భవిష్యత్తు లో నిజాలవెలికితీతకు ఉపయోగపడతాయన్న ముందు చూపుతో పద్మలత తండ్రి ఆ పని చేశారు. ఇప్పుడు థర్మస్థలి దురాగతాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. నాడు పద్మలత మరణానికి కారకులైన వారిని పట్టుకుని చట్టం ముందు నిలిపి శిక్షించాలంటూ అలుపెరుగని పోరాటం చేసిన దేవానంద్ ఇప్పుడు బతికి లేరు. అయితే పద్మలత తల్లి,అక్క,బావా ఉన్నారు. దేవానంద్ కమ్యూనిస్టు నాయకుడు కావడంతో ప్రత్యర్థి రాజకీయవర్గాలు ఆమెను కిడ్నాప్ చేసారని తల్లి ఆరోపిస్తున్నారు. కాలేజీ యాజమాన్యం కూడా పద్మావతి కిడ్నాప్ పై సరైన సమాచారం ఇవ్వలేదని చెబుతున్నారు. అత్యాచారంచేసి 56 రోజులు హింసించి ఆమె శరీరాన్ని సమీపంలోని అడవిలో పడేశారని ఆరోపిస్తున్నారు. ధర్మస్థలి అసహజ మరణాల కారకులే పద్మలతనూ హత్య చేసి ఉంటారని ఆమె కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. 

ఇలా ఒక్క పద్మలత అనే కాదు.. ఇలాంటి వారు ఎందరో ఉన్నారు. పద్మలత లాగే అనన్య భట్, సౌజన్య దారుణ హత్యకు గురయ్యారు. వీరి మరణాల విషయంలో కూడా కనీస సమాచారం లభించలేదు. అనన్య తల్లి సుజాత సీబీఐలో పనిచేస్తున్నా ఏమీ చేయలేకపోయారు.  22 ఏళ్లుగా అనన్య  అవశేషాలు దొరికితే సాంప్రదాయ పద్ధతిలో ముక్తి కలిగించాలని ఇమె ఎదురు చూస్తున్నారు.  అలాగే థర్మస్థలి మిస్టరీ మరణాల జాబితాలో సౌజన్య విషయం కూడా.  అనన్య, సౌజన్యల అసహజ మరణాల విషయంలో  సీబీఐ దర్యాప్తు లో  సంతోష్ అనే అనామకుడిని నిందితుడని తేల్చారు. కాని రెండేళ్ల కిందట  అతను నిర్దోషి గా తేలింది. అనన్య మృతదేహం లభ్యం కాలేదు. సౌజన్య మృతదేహం లభ్యమై, ఆమెపై అత్యాచారం జరిగిందని నిర్ధారణ అయ్యింది. ఇలాంటి పద్మలతలు, అనన్యలు,సౌజన్య లు ఎంతో మంది ధర్మస్థలి కర్కొకటకుల కాటుకు బలయ్యారు.  ఈ మరణాల మిస్టరీ ఛేదించడానికి రంగంలోకి దిగిన  సిట్ దర్యాప్తులో భాగంగా జరుపుతున్న   తవ్వకాల్లో పుర్రెలు,ఎముకలు దొరికాయన్న వార్తలు వస్తున్నా పోలీసు అధికారులు వాటిని ధృవీకరించడం లేదు.  

వందల శవాల పాతిపెట్టానని చెప్పిన పారిశుద్ధ కార్మికుడిని సిట్ బృందంలోని పోలీసు అధికారి బెదిరించాడని వార్తలు వస్తున్నాయి. అయితే వాటిని కూడా ఎవరూ ధృవీకరించడం లేదు. అంతే కాకుండాసిట్ దర్యాప్తులో భాగంగా జరుపుతున్న తవ్వకాలలో బయటపడుతున్న మానవ శరీరాల అవశేషాలకు సంబంధించి ఎటువంటి వార్తా బయటకు పొక్కడం లేదు. తవ్వకాలు జరుగుతున్న ప్రదేశాలకు మీడియాను అనుమతించడం లేదు. దీంతో దర్యాప్తు తీరుపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. దర్యాప్తు పారదర్శకంగా సాగాలనీ, థర్మస్థలి తవ్వకాలలో బయటపడుతున్న వివరాలను వెల్లడించాలన్న డిమాండ్ జోరందుకుంటోంది. 

By
en-us Political News

  
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.