ధర్మస్థలి మిస్టరీ మరణాలు.. సిట్ గోప్యత ఎందుకు?

Publish Date:Aug 5, 2025

Advertisement

ధర్మస్థలి మరణాల కేసు దర్యాప్తు చేస్తున్న సిట్.. ఈ విషయంలో పాటిస్తున్న గోప్యత.. తవ్వకాలలో బయటపడుతున్న విషయాలను వెల్లడించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు థర్మస్థలితో ప్రతి మరణం ఒక మిస్టరీగానే ఉంది. ఈ మిస్టరీ మరణాలలో   పద్మలత కేసు మరో మిస్టరీగా వెలుగులోకి వచ్చింది. దేవాలయానికి చెందిన కాలేజీలో  పద్మలత పీయూసి రెండవ సంవ త్సరం చదువుతున్నది.1986 డిసెంబర్ 22వ తేదీ మాయం అయింది. ఆమె వయస్సు 17 సంవత్సరాలు. ఆమె అదృశ్యం అయిన 56 రోజులు తర్వాత ఆమె శరీరం నేత్రావతీనదీ తీరంలో ఆస్థి పంజరంలా దొరికింది. ఆమె దుస్తులను బట్టి  ఆ అస్తిపంజరం పద్మలతదే అని గుర్తించారు. అప్పట్లో ధర్మస్థలిలో పోలీస్ స్టేషన్ లేదు.ఆమె ఆచూకీ లభించినా, అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా  ఎవరూ పట్టించుకోలేదు.  పద్మలత తండ్రి దేవానంద్ కమ్యూనిస్టు నాయకుడు. ఆయన కమ్యూనిస్టు పార్టీతో  కలిసి చేసిన  ఆందోళనతో చివరకు కేసు నమోదు చేసుకున్నారు. దేవానంద్ సమీప స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.

పోలీసులు ఆమె మృతదేహం లభ్యమైన తరువాత కూడా  సరైన దర్యాప్తు చేయక,ఆధారాలు లేవని కేసు క్లోజ్ చేసారు. హిందువుల కుటుంబానికి చెందిన పద్మలత శరీరాన్ని సాధారణంగా దహనం చేస్తారు. కాని ఆమె తండ్రి   తన కుమార్తె మరణానికి కారకులకు ఎప్పటికైనా శిక్ష పడాలన్న ఉద్దేశంతో ఖననం చేశారు.  ఆమె శరీరం అవశేషాలు భవిష్యత్తు లో నిజాలవెలికితీతకు ఉపయోగపడతాయన్న ముందు చూపుతో పద్మలత తండ్రి ఆ పని చేశారు. ఇప్పుడు థర్మస్థలి దురాగతాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. నాడు పద్మలత మరణానికి కారకులైన వారిని పట్టుకుని చట్టం ముందు నిలిపి శిక్షించాలంటూ అలుపెరుగని పోరాటం చేసిన దేవానంద్ ఇప్పుడు బతికి లేరు. అయితే పద్మలత తల్లి,అక్క,బావా ఉన్నారు. దేవానంద్ కమ్యూనిస్టు నాయకుడు కావడంతో ప్రత్యర్థి రాజకీయవర్గాలు ఆమెను కిడ్నాప్ చేసారని తల్లి ఆరోపిస్తున్నారు. కాలేజీ యాజమాన్యం కూడా పద్మావతి కిడ్నాప్ పై సరైన సమాచారం ఇవ్వలేదని చెబుతున్నారు. అత్యాచారంచేసి 56 రోజులు హింసించి ఆమె శరీరాన్ని సమీపంలోని అడవిలో పడేశారని ఆరోపిస్తున్నారు. ధర్మస్థలి అసహజ మరణాల కారకులే పద్మలతనూ హత్య చేసి ఉంటారని ఆమె కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. 

ఇలా ఒక్క పద్మలత అనే కాదు.. ఇలాంటి వారు ఎందరో ఉన్నారు. పద్మలత లాగే అనన్య భట్, సౌజన్య దారుణ హత్యకు గురయ్యారు. వీరి మరణాల విషయంలో కూడా కనీస సమాచారం లభించలేదు. అనన్య తల్లి సుజాత సీబీఐలో పనిచేస్తున్నా ఏమీ చేయలేకపోయారు.  22 ఏళ్లుగా అనన్య  అవశేషాలు దొరికితే సాంప్రదాయ పద్ధతిలో ముక్తి కలిగించాలని ఇమె ఎదురు చూస్తున్నారు.  అలాగే థర్మస్థలి మిస్టరీ మరణాల జాబితాలో సౌజన్య విషయం కూడా.  అనన్య, సౌజన్యల అసహజ మరణాల విషయంలో  సీబీఐ దర్యాప్తు లో  సంతోష్ అనే అనామకుడిని నిందితుడని తేల్చారు. కాని రెండేళ్ల కిందట  అతను నిర్దోషి గా తేలింది. అనన్య మృతదేహం లభ్యం కాలేదు. సౌజన్య మృతదేహం లభ్యమై, ఆమెపై అత్యాచారం జరిగిందని నిర్ధారణ అయ్యింది. ఇలాంటి పద్మలతలు, అనన్యలు,సౌజన్య లు ఎంతో మంది ధర్మస్థలి కర్కొకటకుల కాటుకు బలయ్యారు.  ఈ మరణాల మిస్టరీ ఛేదించడానికి రంగంలోకి దిగిన  సిట్ దర్యాప్తులో భాగంగా జరుపుతున్న   తవ్వకాల్లో పుర్రెలు,ఎముకలు దొరికాయన్న వార్తలు వస్తున్నా పోలీసు అధికారులు వాటిని ధృవీకరించడం లేదు.  

వందల శవాల పాతిపెట్టానని చెప్పిన పారిశుద్ధ కార్మికుడిని సిట్ బృందంలోని పోలీసు అధికారి బెదిరించాడని వార్తలు వస్తున్నాయి. అయితే వాటిని కూడా ఎవరూ ధృవీకరించడం లేదు. అంతే కాకుండాసిట్ దర్యాప్తులో భాగంగా జరుపుతున్న తవ్వకాలలో బయటపడుతున్న మానవ శరీరాల అవశేషాలకు సంబంధించి ఎటువంటి వార్తా బయటకు పొక్కడం లేదు. తవ్వకాలు జరుగుతున్న ప్రదేశాలకు మీడియాను అనుమతించడం లేదు. దీంతో దర్యాప్తు తీరుపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. దర్యాప్తు పారదర్శకంగా సాగాలనీ, థర్మస్థలి తవ్వకాలలో బయటపడుతున్న వివరాలను వెల్లడించాలన్న డిమాండ్ జోరందుకుంటోంది. 

By
en-us Political News

  
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.
ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం.
2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్ల పై లెక్కించవచ్చు. ఇక అసెంబ్లీకి అయితే.. కేవలం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే హాజర్యారని చెప్పవచ్చు.
ఇటీవలే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ముందు స్వల్ప వ్యవధిలో చంద్రబాబు కేంద్ర విత్త మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.