ప్ర‌భాక‌ర్ రావు విచారణలో సిట్ కొత్త టెక్నిక్

Publish Date:Jun 17, 2025

Advertisement

బాధితుల ముందు నిందితుడి విచార‌ణ‌ 

ఫోన్ ట్యాపింగ్ విచార‌ణాధికారులైన డీసీపీ విజ‌య్ కుమార్, ఏసీపీ వెంక‌ట‌గిరి  ప్రభాకరరావును విచారించడంలో కొత్త టెక్నిక్ వాడుతున్నారు.  అదేంటంటే ఫోన్ ట్యాపింగ్ బాధితుల ముందు ప్ర‌ధాన నిందితుడు ప్రభాకరరావును విచారించనున్నారు.  

ఇంత‌కీ ప్ర‌భాక‌ర్ రావు అధ్వ‌ర్యంలో ఎంద‌రి ఫోన్లు ట్యాప్ అయ్యాయ‌ని చూస్తే..  బాధితులు చెప్పే లెక్క‌ల్ని బట్టి  4వేల నుంచి ఆరు వేల వ‌ర‌కూ ఉన్నారు. ఆఖ‌రున డీఎస్పీగా యాక్సిల‌రేటెడ్ ప్ర‌మోట్ అయిన ప్ర‌ణీత్ ఫోన్లోనూ ఎంద‌రో రాజ‌కీయ  నాయ‌కుల ఫోన్ రికార్డింగులున్నాయంటే ప‌రిస్థితి ఏమిటో ఊహించుకోవ‌చ్చు.

ప్ర‌భాక‌ర్ రావు చెప్ప‌డం వ‌ల్లే తామిలా చేశామ‌ని ప్ర‌ణీత్ త‌దిత‌రులు చెబితే.. నేను మాత్రం నాటి డీజీపీ  మ‌హేంద‌ర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ అనిల్ చెప్పిన‌ట్టు చేశాన‌ని అంటున్నారు ప్ర‌భాక‌ర్ రావు. ప్ర‌ణీత్ ద్వారా కొన్ని ఎఫ్ఎస్ఎల్ రిపోర్టుల ద్వారా ప్ర‌భాక‌ర్ రావును క్రాస్ క్వ‌శ్చిన్ చేసిన అధికారులు మంగళవారం (జూన్ 17) ఆయనను కొత్త టెక్నిక్ తో  విచారించ‌బోతున్నారు.

ట్యాపింగ్ బాధితుల్లో సుమారు 600 మంది డేటా సేక‌రించి వారంద‌రినీ పిలిపించి విష‌యం చెప్పారు అధికారులు. మీరు ఈ ఇన్వెస్టిగేష‌న్లో కోప‌రేట్ చేయాల‌ని వారిని కోరారు. వారు కూడా స‌రే అన్నారు. 

ఇక బాధితుల ఆవేద‌న బ‌ట్టి చూస్తే..  భార్యాభ‌ర్త‌ల ఫోన్ కాల్స్ సైతం విన‌డం అన్యాయ‌మ‌ని వాపోయారు. అంతే కాదు త‌మ బంధుమిత్రులంద‌రి ఫోన్ కాల్స్ విన్నార‌నీ.. మేము ఎవ‌రికీ చెప్ప‌కుండా దాచుకున్న నెంబ‌ర్ల‌ను కూడా రికార్డింగ్ లో పెట్టార‌నీ. మా ప్ర‌తి క‌ద‌లిక కాపు కాచార‌నీ.. మా ప్ర‌తి కాల్ విన్నార‌న్న‌ది వీరి ఆవేద‌న‌.

అయితే ఒక రిటైర్డ్ ఐజీ అయిన ప్ర‌భాక‌ర్ రావును, ఆనాటి సీఎస్ సోమేశ్ తిరిగి  ఒక ప‌ద‌విలో  కూర్చోబెట్టి ఇంత‌టి ఘ‌న‌కార్యం చేయ‌డం కూడా క‌రెక్టు కాద‌న్న కోణంలో కొంద‌రు మాట్లాడారు. ఇందులో సోమేశ్ ని సైతం శిక్షించాల్సి ఉంద‌ని డిమాండ్ చేసిన వారున్నారు. వ‌చ్చే రోజుల్లో మ‌రే పాల‌కుడూ కూడా ఇలా చేయ‌కుండా నిందితుల‌కు శిక్ష‌లు ప‌డాల‌ని సూచించారు.

ఇదిలా ఉంటే హోం మంత్రిత్వ శాఖ‌కు త‌ప్పుడు స‌మాచారం ఇచ్చి.. మావోయిస్టుల మ‌ద్ద‌తు దారుల‌న్న ముద్ర వేసి ప్ర‌స్తుత మంత్రి ,  ఉద్యోగుల ఫోన్ నెంబ‌ర్లు మొత్తం ట్యాప్ చేశారు నాటి ఎస్ఓటీ అధికారులు. 

మ‌రీ ముఖ్యంగా ప్ర‌ణీత్ రావుకు మునుగోడు బంప‌రాఫ‌ర్ ప్ర‌క‌టించారు ప్ర‌భాక‌ర్ రావు. న‌ల్గొండ జిల్లాకు తాను ఎస్పీగా ఉండ‌గా బీబీన‌గ‌ర్ లో ఎస్సైగా ప‌ని చేసేవారు ప్ర‌ణీత్.. ఆ స‌మ‌యంలో సామాజిక వ‌ర్గ సంబంధ బాంధ‌వ్యాల‌ను అడ్డు పెట్టుకుని ప్ర‌భాక‌ర్ రావుతో బాగా ద‌గ్గ‌రైన ప్ర‌ణీత్. ఆయ‌న ఇంటెలిజెన్స్ ఎస్ఐబీకి వెళ్ల‌గానే తాను కూడా ఒక ఇన్ స్పెక్ట‌ర్ గా అందులో జాయిన్ అయ్యారు. ఐదేళ్లు తిరిగే స‌రిక‌ల్లా డీఎస్పీగా ప్ర‌మోట‌య్యారాయ‌న‌.  2007 లో ప్ర‌ణీత్ తో పాటు సుమారు 450 మంది ఎస్సైలు డిపార్ట్ మెంట్లో జాయిన్ అయితే.. వారంద‌రిలోకీ ఒక్క ప్ర‌ణీత్ మాత్ర‌మే డీఎస్పీ ర్యాంక్ లో ఉన్నారు. ఇది అసాధార‌ణంగా చెబ‌తారు.  ప్ర‌ణీత్ పొందిన యాక్సిల‌రేటెడ్ ప్ర‌మోష‌న్ అన్న‌ది యాంటీ మావోయిస్టు కార్య‌క‌లాపాల్లో యాక్టివ్ రోల్ ప్లే చేసే వారికిస్తారు. అలాంటిది అక్ర‌మ ట్యాపింగ్ కి పాల్ప‌డ్డ ఒక అధికారికి ఇవ్వ‌డం ఇదే తొలిసారిగా భావిస్తున్నారు.

2023లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక‌.. అప్ప‌టి వ‌ర‌కూ తాము సేక‌రించిన ప్రొఫైల్స్ డేటా మొత్తం 1200 పేజీలు. ఈమొత్తాన్ని ధ్వంసం చేశారు ప్ర‌ణీత్ రావు. అంతే కాదు.. హార్డ్ డిస్క్ ల‌ను ముక్క‌లు చేసి వాటిని మూసీలో ప‌డేశారు. వీట‌న్నిటిని బ‌ట్టి చూస్తే వీరెంత‌టి చేయ‌రాని ప‌ని చేశారో అర్ధం చేసుకోవ‌చ్చంటారు నిపుణులు.

ప్ర‌ణీత్- ప్ర‌భాక‌ర్ ని కూడా ఎదురెదురుగా పెట్టి.. విచారించ‌నున్నారు అధికారులు. ఆపై బాధితుల ఎదుట  కూడా ప్ర‌ధాన నిందితుడు ప్ర‌భాక‌ర్ రావును విచారించ‌నున్నారు. ఆయ‌న‌కు ఈ కేసు తీవ్ర‌త  ఎంతటిదో అర్ధ‌మ‌య్యేలా చేయ‌నున్న‌ట్టు ఈ ప‌థ‌క ర‌చ‌న చేసిన‌ట్టు చెబుతున్నారు. 

బాధితుల్లో కొంద‌రు ఇప్ప‌టికే మీడియాతో మాట్లాడుతూ.. ఒక వేళ పై వాళ్లు చెప్పినా.. వీరికంటూ ఒక విచ‌క్ష‌ణ ఉండాలి  క‌దా?  మేము వ్య‌క్తిగ‌తంగా మాట్లాడుకున్న ప్ర‌తి మాట విన‌డ‌మేంటి? ఇది  ముమ్మాటికీ త‌ప్పు. రాజ్యాంగం  క‌ల్పించిన గోప్య‌తా హ‌క్కును హ‌రించే అధికారం వీరికి ఎవ‌రిచ్చారంటూ తీవ్ర స్తాయిలో విరుచుకుపడుతున్నారు వీరు.. మ‌రి చూడాలి ఈ విచార‌ణ ద్వారా ప్ర‌భాక‌ర్ రావు నుంచి మ‌రెన్ని నిజాలు రాబ‌డుతారో అధికారులు.

By
en-us Political News

  
శాంతి గోదావరి వరద ఉధృతితో మహోగ్రరూపం దాల్చింది. తెలుగు రాష్ట్రాలలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వానల కారణంగా గోదావరికి వరద నీరు పోటెత్తుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పర్యాటక రంగ ప్రగతిని ఇస్తున్న అత్యధిక ప్రాముఖ్యతకు గుర్తింపు దక్కింది. ఏపీ పర్యాటక శాఖకు అత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది.
బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిన నేపథ్యంలో కోస్తాంధ్రలో ఆదివారం వరకు భారీ వర్షాల అంచన నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత సూచించారు.
ఐఏఎస్ శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలిందే . గతంలో ఇదే తెలంగాణ హైకోర్టు ఇదే ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి ప్రమేయం లేదని పేర్కొంటూ, ఆ కేసునుంచి తప్పించాలని సీబీఐ, ఈడీలను ఆదేశించింది.
వరుస పరాజయాలు మూటగట్టుకున్న గులాబీ పార్టీలో నెలకొన్న వివాదాలు, ఆధిపత్యపోరు ఆ పార్టీ ఉనికికే ప్రశ్నార్ధకంగా మారుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కారు పార్టీని తిరిగి రేసులోకి తీసుకురావాల్సిన పార్టీ ముఖ్యనేతలు, అందులోనూ కల్వకుంట్ల వారసులు వ్యవహరిస్తున్న తీరు బీఆర్ఎస్ వర్గాకు అసలు మింగుడుపడటం లేదంట.
ఉపరాష్ట్రపతి పదవికి ధన్ ఖడ్ రాజీనామా కు న్యాయమూర్తి వర్మ ఉదంతమే ప్రధాన కారణమని దాదాపుగా నిర్ధారణ అయ్యిందని పరిశీలకులు అంటున్నారు. ప్రతిపక్ష నాయకుల సంతకాలతో వర్మ అభిసంసన తీర్మానం ఆమోదించమే ధన్ ఖడ్ నిష్క్రమణ కు కారణమైంది. అంతకు ముందే బీజేపీ పెద్దలతో ఆయనకున్న విభేదాలకు ఇది క్లైమాక్స్ గా భావించాల్సి ఉంటుందంటున్నారు.
కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోకగజపతిర రాజు శుక్రవారం (జులై 25) గోవాకు బయలుదేరి వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన గోవాకు బయలు దేరారు. గోవా గవర్నర్ గా నియమితులైన ఆయన శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ విశ్వాసాలతో, ఆయన పరిపాలనా విధానాలతో ఎవరైనా విభేదించవచ్చుకానీ, భాతర రాజకీయాల్లో ఆయన స్థానాన్ని మాత్రం ఎవరూ కాదన లేరు.
తెలంగాణ క్యాబినెట్ సమావేశం వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం జరగాల్సిన మంత్రివర్గ సమావేశాన్ని సోమవారానికి వాయిదా వేశారు.
హ‌లో ట్రంప్ ఎక్స్ క్యూజ్ మీ.. మీ దేశంలో మా వాళ్ల ప‌నితీరుకు ఆయా కంపెనీలు ఏం రేంజ్ లో లాభాల బాట‌లో ఉన్నాయో తెలుసా.. తెలియకపోతే ఒక్క‌సారి ఈ వివ‌రాల‌ను చూడండి.
ఏపీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మరి కొన్ని రోజులు జైలువాసం తప్పేటట్లు కనిపించడం లేదు. తనను ఏ4 నిందితుడిగా చేర్చిన నాటి నుంచి బెయిల్ కోసం గజనీ మహ్మద్‌లా విఫల యత్నాలు చేసుతున్న రాజంపేట ఎంపీ జూనియర్ పెద్దిరెడ్డికి మరోసారి నిరాశే ఎదురైంది.
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు కాకాణి గోవర్ధన్ రెడ్డికి 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధిస్తూ నెల్లూరు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ భూముల కబ్జాకు వెంకటాచలం తహశీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ కాకాణిపై నమోదైన కేసుకు సంబంధించి నెల్లూరు అడిషన్ మేజిస్టేట్ కోర్టు ఈ ఉత్తర్వలు జారీ చేసింది.
సజ్జలపై కేసు సంగతి ఏమిటని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రాసిక్యూషన్ ను నిలదీసింది. అమరావతి మహిళలపై సజ్జల చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదు చేస్తున్నారా లేదా తెలపాలని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో సజ్జల దాఖలు చేసుకున్న యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ ను హైకోర్టు వారం రోజులకు వాయిదా వేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.