ఏపీ మద్యం కుంభకోణం.. మరో కేసు నమోదు చేసిన సిట్
Publish Date:Feb 14, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో సిట్ మరో కేసు నమోదు చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఏపీఎస్పీబీసీఐ డిపోల నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలకు సరఫరా చేసే రవాణా టెండర్లలో అక్రమాలకు సంబంధించి తాజా కేసు నమోదయింది. ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లేలా వ్యవహరించారనీ, రవాణా టెండర్లలో రూ. 200 కోట్ల నుంచి రూ. 400 కోట్ల వరకు అక్రమాలను పాల్పడినట్టు సమాచారం. ఈ కేసు విచారణ బాధ్యతలను సిట్ చీఫ్ ఎస్వీ రాజశేఖర్ బాబుకు అప్పగించారు. మరోవైపు, లిక్కర్ స్కామ్ లో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న రాజ్ కేసిరెడ్డి బెయిల్ పిటిషన్ ను ఇటీవల సుప్రీంకోర్టు తిరస్కరిస్తూ, ఈ కుంభకోణంలో రాజకీయ నాయకులు, అధికారుల ప్రమేయంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ స్కామ్ లో రూ. 3,500 కోట్లకు పైగా అక్రమ లావాదేవీలు జరిగినట్టు సిట్ అధికారులు అంచనా వేశారు. ఈ కేసును ఈడీ కూడా దర్యాప్తు చేస్తోంది. పలువురు వ్యక్తులకు ఇప్పటికే నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసులో ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేశారు. మరో 9 మంది విదేశాల్లో తలదాచుకున్నట్టు సిట్ అధికారులు తెలిపారు.
http://www.teluguone.com/news/content/sit-another-case-on-madyam-scam-36-214084.html





