Publish Date:Sep 19, 2025
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో సిట్, ఈడీలు ఏకకాలంలో దూకుడు పెంచడంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిలో ఖంగారు పెరిగిపోతున్నది. ఒక వైపు సిట్ ఈ కేసు దర్యాప్తులో మద్యం కుంభకోణం సొమ్ము అంతిమ లబ్ధిదారు ఎవరన్నది తేల్చే దిశగా దర్యాప్తు చేస్తుంటే.. ఈడీ ఈ మద్యం స్కాంకు సబంధించిన మనీ లాండరింగ్ ఏ విధంగా జరిగిందో తేల్చే పనిలో పడింది. అందులో భాగంగానే ఈడీ గురువారం (సెప్టెంబర్ 18) ఏకకాలంలో పలు రాష్ట్రాలలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. దీంతో వైసీపీ పెద్దల్లో ఒక్కసారిగా కంగారు మొదలైంది.
ఇంత కాలం సిట్ మాత్రమే విచారణ జరుపుతోందని భావించిన ఈ కేసులో నిందితులు.. ఈడీ ఎంట్రీతో స్కాం చెయిన్ గుట్టు మొత్తం రట్టౌంతుందన్న ఆందోళనలో పడ్డారు. ఇప్పటి వరకూ ఈ కేసులో ఇంకా సమన్లు అందుకోని వారూ, సిట్ రాడార్ లోకి రాలేదని సంబరపడుతున్నవారు ఉలిక్కి పడుతున్నారు. దర్యాప్తు తమ దాకా రావడానికి ఇంకెంతో కాలం పట్టదన్న ఆందోళనలో పడ్డారు.
అన్నిటికంటే ముఖ్యంగా ఈడీ పక్కా సమాచారంతో, అంతకు మించి పక్కా ప్రణాళికతో సోదాలు నిర్వహిస్తున్నట్లు గురువారం (సెప్టెబర్ 18) సోదాలను గమనిస్తే అర్ధమౌతోంది. లిక్కర్ స్కాము సొమ్ములు ఎవరెవరికి చేరాయి. బ్లాక్ ను వైట్ ఎలా చేశారు. అందుకోసం ఎవరెవరు ఎన్నెన్ని సూట్ కేసు కంపెనీలు పెట్టారు. వంటి మొత్తం సమాచారం దగ్గరుంచుకుని వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోందని పరిశీలకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
ఈ తరహాలో ముందుకు వెడుతున్న ఈడీ మద్యం స్కాం సూత్రధారి ఎవరు అన్నది గుర్తించడానికి ఎంతో కాలం పట్టదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సిట్, ఈడీలు పూర్తి సమన్వయంతో దర్యాప్తు చేస్తున్నాయని అవగతమౌతోందని అంటున్నారు. మనీలాం డరింగ్ ద్వారా విదేశాలకు నగదు ఎలా వెళ్లింది అన్న విషయంపై దర్యాప్తు చేసిన ఈడీ సోదాలు నిర్వహించింది. ఇప్పుడు అలా విదేశాలకు వెళ్లిన సొమ్ము వైట్ గా మారి ఎక్కడికి ఎలా చేరిందన్న విషయంపై దృష్టిసారిస్తుందని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sit-and-ed-coordination-in-ap-liquoe-scam-investigation-39-206473.html
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.