ఏపీ రవాణాశాఖలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.ఒకే రాష్ట్రం..ఒకే కోడ్ అనే సరికొత్త పరిక్రియకు శ్రీకారం చుట్టింది.వాహనాల రిజిస్ట్రేషన్లో జిల్లాల కోడ్లను ఎత్తేసింది. రాష్ట్రమంతా ఒకే కోడ్ అమల్లోకి తీసుకొచ్చింది.ఏ జిల్లాలో వాహనం రిజిస్టర్ అయినా దానికి ‘ఏపీ 39’ కోడ్నే కేటాయిస్తుంది.ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాల్లో ఏపీ 01 నుంచి ఏపీ 38 వరకూ ఆర్టీఏ కోడ్ నంబర్లు ఉండేవి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ జిల్లాలన్నీ ‘టీఎస్’ రిజిస్ట్రేషన్కు మారిపోయాయి.కానీ ఏపీలో ఉన్నఆర్టీఏ కార్యాలయాల ఆధారంగా అనంతపురం-01 నుంచి మొదలుపెట్టి పశ్చిమ గోదావరికి చివరి నంబరు కేటాయిస్తారని ప్రచారం జరిగింది.అయితే రాష్ట్రమంతా ఒకే కోడ్ ఇవ్వాలని రవాణాశాఖ నిర్ణయించింది. దీనిప్రకారం ఇకపై జిల్లా ఏదైనా రిజిస్ట్రేషన్ నంబర్లు మాత్రం ‘ఏపీ39’ నుంచే మొదలవుతాయి.ఇప్పటివరకూ పోలీసు వాహనాలకు మాత్రమే కేటాయిస్తున్న ‘పీ’ సిరీస్ ను ఇకపైనా అలాగే కొనసాగిస్తారు. టీ, యూ, వీ డబ్ల్యూ, ఎక్స్, వై సిరీస్లు రవాణా వాహనాలకు, ‘జెడ్’ సిరీస్ ను ఏపీఎస్ఆర్టీసీకి కేటాయిస్తారు. ‘ఓ’ అక్షరం సున్నాలా ఉంటుంది కాబట్టి అది ఎప్పటికీ కేటాయించే అవకాశం ఉండదని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుత సిరీస్ ముగిసిన తర్వాత కోడ్ను ఏపీ39 నుంచి ఏపీ40కి మారుస్తారు.
ఒకే రాష్ట్రం..ఒకే కోడ్ తో ఫ్యాన్సీ నెంబర్లు ఆశించేవారు ఇబ్బంది ఎదుర్కోక తప్పదు.గతంలో జిల్లాకో కోడ్ ఉండటం వల్ల ఎదో ఒక సిరీస్ లో ఫాన్సీ నెంబర్ ను అతి సులభంగా పొందేవారు.కానీ ఇప్పుడు రాష్ట్రమంతా ఒకటే కోడ్ అవ్వటం వల్ల ఇక ఫ్యాన్సీ నెంబర్ కావలి అంటే ఆన్లైన్ ద్వారా బిడ్డింగ్కు వెళ్లాల్సిందే.దీనివల్ల ఫ్యాన్సీ నెంబర్ల కోసం పోటీ పెరగటమే కాకుండా రవాణాశాఖకు ఆదాయం కూడా పెరుగుతుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/single-code-soon-for-vehicle-registration-39-84184.html
తిరుపతి జిల్లా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఛత్తీస్గఢ్లో మరోసారి ఎన్కౌంటర్లో చోటుచేసుకుంది. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో శుక్రవారం భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మరో కీలక నేత మైలారపు ఆడెల్లు అలియాస్ భాస్కర్ మృతి చెందారు.
బీఆర్ఎస్ పార్టీలో దెయ్యాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలే విమర్శస్తుంటే మాజీ సీఎం కేసీఆర్ నోరు విప్పలేని స్ధితిలో ఉన్నారని సీఎం రేవంత్రెడ్డి ఎద్దేవా చేశారు.
వచ్చే ఏడేళ్లలో విశాఖను మరో ముంబైలా తీర్చిదిద్దాలని అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు. ఇవాళ అమరావతిలో జరిగిన నీతి ఆయోగ్ భేటీలో సీఎం చంద్రబాబు ఈ మేరకు కీలక నిర్ణయాలు ప్రకటించారు.
గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పరామర్శించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 25 వేల కోట్ల అవినీతికి పాల్పడిందని గతంలో కేటీఆర్ ఆరోపణలు చేశారు
క్వార్జ్ట్ అక్రమ తవ్వకాల కేసులో నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డికి ఇప్పట్లో బెయిల్ లభించే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా కోర్టు ఆదేశాలతో కాకాణిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
తన తండ్రి, వైసీపీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం క్యాన్సర్తో బాధపడుతున్నారనీ, అయితే తన సోదరుడు ముద్రగిరి ఆయనకు కనీసం వైద్యం అందించకుండా వేధిస్తున్నారనీ, ఆయన ఎవరినీ కలవకుండా, ఆయనను ఎవరూ చూడకుండా అడ్డు పడుతున్నారనీ ముద్రగడ కుమార్తె క్రాంతి ట్వీట్ చేశారు.
ప్రపంచంలోనే ఎత్తయిన చినాబ్ రైల్వే వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అదేవిధంగా కట్రాలో రూ.46 వేల కోట్లతో విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలతో ప్రారంభోత్సవాలు చేశారు.
ఇప్పటి వరకూ అత్యధిక గెలుపులంటే అవి ఆస్ట్రేలియావే. ఇప్పటి వరకూ వరల్డ్ క్రికెట్ ని ఈ దేశం శాసించినంతగా మరే దేశం శాసించలేదు. తొలి రోజుల్లో వెస్టిండీస్ ఇలాగే ఉన్నా.. తర్వాతి కాలంలో ఆస్ట్రేలియా ఈ విజయ పరంపర అందిపుచ్చుకుంది.
విరాళాలిచ్చి మరీ ట్రంప్ ని గెలిపించిన మస్క్ రివర్స్ కు కారణమేంటి?
హైదరాబాద్ నగరంలో రాబోయే 4 నెలలు స్పెషల్ డ్రైవ్ చేపడతామని హైడ్రా కమీషనర్ రంగనాథ్ తెలిపారు. నాలాలపై అక్రమంగా నిర్మించిన కమర్షియల్ భవనలను తొలిగిస్తామని కమీషన్ తెలిపారు.
ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించిన ఘటనపై సిద్దరామయ్య సర్కార్ సీరియస్ అయ్యింది.