Publish Date:Jul 29, 2025
సింగపూర్లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబుకు.. అక్కడి పారిశ్రామికవేత్తల నుంచే కాకుండా ఆ దేశ మంత్రుల నుంచి కూడా ప్రశంసల వర్షం కురుస్తోంది. సింగపూర్ నైపుణ్యాలు ఏపీకి అవసరం అంటూ చంద్రబాబు అక్కడి పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడి దారులు, ప్రభుత్వాన్ని కోరుతుంటే.. అందుకు ప్రతికా వారి నుంచి చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
చంద్రబాబుతో ఐదు నిమిషాల భేటీ చాలు ఏపీలో పెట్టుబడులపై సానుకూల నిర్ణయం తీసుకోవడానికి అని ఇండస్ట్రియలిస్టులు, ఇన్వెస్టర్లు అంటుంటూ.. చంద్రబాబు పని తీరు అద్భుతం, ఆయన నుంచి ఎంతో నేర్చుకోవాలి అంటూ సింగపూర్ మంత్రులు పొగడ్తలు కురిపిస్తున్నారు. తాజాగా సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి టాన్ సీ లాంగ్ చంద్రబాబు పని చేసే తీరు.. ప్రగతి పట్ల ఉన్న దార్శనికత అద్భుతమంటూ ప్రశంసించారు.
సింగపూర్ పర్యటనలో భాగంగా చంద్రబాబు ఆ దేశ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి టాన్ సీ లాంగ్తో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేలా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలని, గ్రీన్ హైడ్రోజన్ హబ్గా ఏపీ రూపాంతరం చెందుతోందని.. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలనిసూచించారు.
దీనిపై సానుకూలంగా స్పందించి టాన్ సీలాంగ్, నిరంతరం.. ప్రజల కోసం పని పని చేస్తుండటం మీకెలా సాధ్యమౌతోందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రజలతో మమేకం కావడం నుంచి వారి సమస్యల పరిష్కారం వరకూ చంద్రబాబు తీసుకుంటున్నశ్రద్ధ అనితర సాధ్యమని ప్రశంసించారు. టాన్ సీలాంగ్ తో భేటీ సందర్భంగా గృహనిర్మాణం, సముద్రంలో కేబుల్ నిర్మాణం వంటి కీలక ప్రాజెక్టులపై ఒప్పందాలు కుదిరాయి. చంద్రబాబుతో కలిసి పని చేయడానికీ తాము ఉత్సుకతతో ఉన్నామని టాన్ లాసింగ్ ఈ సందర్భంగా చెప్పారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్లో చేపట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ అంతే నాణ్యతతో కొనసాగుతుండటానికి కారణం చంద్రబాబు విజనే అని అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/singapore-minister-praises-cbn-work-culture-25-203022.html
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.