ఇప్పుడు మేకపాటి.. అప్పుడు పునీత్.. ఇంచుమించు ఒకేలా!

Publish Date:Feb 21, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోమవారం ఉదయం గుండెపోటుతో హఠాత్తుగా మరణించారు. సోమవారం ఉదయం 7.30 గంటలకు జిమ్ కు వెళ్లేందుకు గౌతమ్ రెడ్డి రెడీ అయ్యారు. ఇంటిలో నుంచి బయటికి రాక ముందే ఛాతీలో నొప్పిగా ఉందని సోఫాలోనే ఆయన కూర్చున్నారట. వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు, గన్ కలిసి చికిత్స కోసం అపోలో ఆస్పత్రికి తరలించారు. గౌతమ్ రెడ్డిని బ్రతికించేందుకు వైద్యులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. గౌతమ్ రెడ్డి (50) మరణించినట్లు అపోలో వైద్యులు ప్రకటించారు. 1971 నవంబర్ 2వ తేదీన గౌతమ్ రెడ్డి జన్మించారు. 2022 ఫిబ్రవరి 21న ఆయన తుదిశ్వాస విడిచారు.

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యాయామాలు చాలా కఠినంగా చేసేవారు. జిమ్ కు వెళ్లేందుకు రెడీ అయిన ఆయనకు గుండెపోటు వచ్చింది. ఐదు పదుల వయస్సులోనే ఆయన అనంత లోకాలకు వెళ్లిపోయారు. సరిగ్గా ఇలాగే విపరీతంగా కఠినమైన వ్యాయామాలు చేసే కన్నడ సినీ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ 46 ఏళ్ల వయస్సులో గుండెపోటుకు గురై గత ఏడాది అక్టోబర్ 29న మరణించారు. పునీత్ రాజ్ కుమార్ 1975 మార్చి 17న జన్మించారు. పునీత్ కూడా విపరీతంగా వ్యాయామం చేస్తూ గుండెపోటుకు గురయ్యారు. ఇలా అటు పునీత్ రాజ్ కుమార్, ఇటు మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యాయామానికి వెళ్లేందుకు రెడీ అయి గుండెపోటుకు గురికావడం కాకతాళీయం కావచ్చు. అలాగే అటు పునీత్, ఇటు గౌతమ్ రెడ్డి కూడా పోస్ట్ కోవిడ్ పరిణామాలతోనే మరణించడం యాదృచ్ఛికం కావచ్చు. ఇద్దరూ కూడా కోవిడ్ వ్యాక్సిన్ పూర్తి డోస్ లు వేసుకున్న వారే కావడం గమనార్హం.

మేకపాటి గౌతమ్ రెడ్డి తన తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి వారసత్వాన్ని కొనగిస్తూ.. రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో, 2019లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గౌతమ్ రెడ్డి తుదిశ్వాస విడిచే దాకా ఏపీ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అటు పునీత్ రాజ్ కుమార్ కూడా తన తండ్రి కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ వారసత్వాన్నే కొనసాగించారు. ఆయన బాటలోనే పునీత్ సినిమా నటుడిగా ఎదిగారు. గౌతమ్ రెడ్డి- పునీత్ రాజ్ కుమార్ ఇద్దరూ కూడా మృదు స్వభావులే. ఇద్దరి తండ్రుల పేర్లలోనూ ‘రాజ’ (రాజ్ కుమార్, రాజమోహన్ రెడ్డి) కామన్ పాయింట్. ఇద్దరిలో ఏ ఒక్కరూ ఏనాడూ కఠినంగా వ్యవహరించిన, ఆగ్రహం వ్యక్తం చేసిన దాఖలాలు లేవని చెబుతుంటారు. ఇద్దరూ అజాత శత్రువులే అంటారు. పునీత్ రాజ్ కుమార్ కు మన తెలుగు చిత్రపరిశ్రమలోని అనేక మందితో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి. అలాగే.. గౌతమ్ రెడ్డి కూడా మంచి స్వభావి అని, అందరితోనూ ఎంతో మర్యాదగా, కలుపుగోలుగా వ్యవహరించే వారని టీడీపీ నేతలు సైతం చెబుతుండడం విశేషం. పార్టీలకు అతీతంగా ఆయన అందరినీ చిరునవ్వుతో పలకరించేవారని అంటారు. ఇద్దరూ కూడా ఐదు పదుల వయస్సుకు కాస్త అటూ ఇటూగానే మరణించడం బాధాకరం. తమ తమ రంగాల్లో మంచి ప్రతిభ కనబరడంతో పాటు, ముందు ముందు ఎంతో భవిష్యత్ ఉన్న పునీత్ రాజ్ కుమార్, మేకపాటి గౌతమ్ రెడ్డి మరణించడం పట్ల ఇద్దరి అభిమానులను తీవ్రంగా కలిచివేస్తోంది.

By
en-us Political News

  
తాజాగా కోటి సంత‌కాల సేక‌ర‌ణ చేసింది వైసీపీ.
ఇంతకీ రేవంత్ ఢిల్లీ ఎందుకు వెళ్లారంటే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ జన్మదినం గురువారం. తన 85వ జన్మదినాన్ని పురస్కరించుకుని రాజకీయ ప్రముఖులను బుధవారం రాత్రి విందు ఇచ్చారు. ఆ విందుకు తెలంగాణ సీఎం రేవంత్ హాజర్యారు.
బోరుగడ్డ అనిల్ కు కష్టాలు మొదలయ్యాయి. కేసులు చుట్టుముట్టాయి. అరెస్టై జైలుకు వెళ్లి వచ్చాడు కూడా. జైలుకు వెళ్లిన సమయంలోనూ, ఆ తరువాత బయటకు వచ్చి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలోనూ కూడా బోరుగడ్డ అనిల్ పదేపదే తనకు జగన్ అండ ఉందని చెప్పుకొచ్చారు.
అమరావతికి నాబార్డు నుంచి రూ.7,380.70 కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ ఆమెదం ఇవ్వనుంది. అదే విధంగా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్రవేసే అవకాశం ఉంది.
ల్గొండ జిల్లా కొర్లపహాడ్‌ గ్రామంలో పోలింగ్ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు.
ఉదయం ఏడుగంటలకు ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరుగుతుంది. ఇందు కోసం 37 వేల 552 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి విడతలో 56 లక్షల 19 వేల 430 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
తన ఎన్నికల చిహ్నమైన కత్తెర గుర్తు జెండాను పట్టుకుని అల్లు అర్జున్ చేత ప్రచారం చేయిస్తున్నారు. ఆగండాగండి వాస్త
త్రిపురకుండ్రం ఆరు షణ్ముఖ క్షేత్రాల్లో తొలి క్షేత్రంగా భాసిల్లుతోంది. అయితే ఈ కొండ‌కు ద‌గ్గ‌ర్లో ఒక ద‌ర్గా ఉంటే.. ఆ ద‌ర్గాకి సమీపంలో ఒక రాతి స్తంభం ఉంటుంది. ఆ రాతి స్థంభంపై త‌మిళ కార్తీక దీపం పెట్ట‌డం అనాదిగా వ‌స్తోన్న ఆచారం.
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నార‌న్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.