Publish Date:Jul 27, 2020
చిత్తూరు జిల్లా మదనపల్లె సమీపంలోని మహల్ రాజు పల్లెకు చెందిన ఓ రైతు కుటుంబానికి సోనూ సూద్ ట్రాక్టర్ సాయం చేసిన సంగతి తెలిసిందే. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇద్దరు ఆడపిల్లలు ఎద్దులకు బదులుగా నాగలి లాగుతూ పొలం దున్నుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇది చూసి చలించిపోయిన సోనూ సూద్.. 24గంటల్లోనే వారికి ట్రాక్టర్ అందించారు. దీంతో, లీడర్ల నుంచి సామాన్యల వరకు అందరూ సోనూ సూద్ ని ప్రశంసిస్తున్నారు.
అయితే, ఇప్పుడీ వ్యవహారంలో అనూహ్య ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ట్రాక్టర్ సాయం పొందిన వీరదల్లు నాగేశ్వరరావు కుటుంబం ఏటా వ్యవసాయం చేసే కుటుంబం కాదని తెలుస్తోంది. సమీప పట్టణంలో నివాసం ఉంటూ ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో ఉపశమనం కోసం ఊరికి వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే తమకున్న పొలంలో వ్యవసాయం మొదలుపెట్టారు. పొలం దున్నడానికి ఎడ్లు లేకపోవడం గానీ, ఆర్థిక సమస్యలుండి గానీ అలా చేయలేదని, కేవలం కొత్త అనుభూతి కోసమే ఇలాంటి పని చేశారని ఆ ఊరి వాసులు చెబుతున్నారు. అయితే, ఊహించని రీతిలో మలుపు తీసుకుని ఇది సంచలనంగా మారిందని అంటున్నారు.
వీరదల్లు నాగేశ్వరరావు అనే ఆయన వ్యవసాయం చేసే వ్యక్తి కాదని.. ఉద్యోగాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేశారని తెలుస్తోంది. అంతేకాదు, స్థానికంగా అంతో ఇంతో పేరున్న వ్యక్తని సమాచారం. వీరదల్లు నాగేశ్వర రావు గతంలో 2009 ఎన్నికల్లో లోక్ సత్తా పార్టీ తరపున మదనపల్లి బరిలో దిగారు. పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేసారు. అలాంటి వ్యక్తిని ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న రైతుగా ఎందుకు చిత్రీకరించారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
సోనూ సూద్ లాక్ డౌన్ ప్రారంభమైన దగ్గర నుంచి ఎందరికో సాయం చేస్తున్నారు. అదే క్రమంలో ఈ వార్తకి కూడా చలించిపోయి సాయం చేశారు. కానీ ఇప్పుడు కొత్త ట్విస్ట్ వెలుగులోకి రావడంతో.. సోషల్ మీడియాలో, మీడియాలో ప్రచారం చేసిన వారిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ సాయాన్ని అర్హులకి చెందేలా చూడాలని సామాన్యులు కోరుతున్నారు. మరోవైపు, నాగేశ్వర రావు కుటుంబం కూడా తాము ఇలా జరుగుతుందని ఊహించలేదని, ఆ ట్రాక్టర్ ని పంచాయతీకి ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/shocking-facts-about-farmer-nageswara-rao-25-101967.html
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.