మదనపల్లె అక్కాచెల్లెళ్ల హత్య ఘటన.. వారికి తాయత్తులు కట్టింది నేనే!!

Publish Date:Jan 28, 2021

Advertisement

మదనపల్లె జంట హత్యలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. మూఢనమ్మకాల మాయలో పడి కన్నవారే తమ ఇద్దరు కూతుళ్ళ మరణానికి కారణమయ్యారు. ఇప్పుడు ఎక్కడ చూసినా అందరూ మదనపల్లె అక్కాచెల్లెళ్ల హత్యల గురించే చర్చించుకుంటున్నారు. విద్యావంతులైన మూర్ఖులు చేసిన పని ఇదంటూ ఆ తల్లిదండ్రుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండగా.. మరోవైపు కోట్ల ఆస్తి కోసం ఎవరో ఆ కుటుంబాన్ని హిప్నటైజ్ చేసుంటారని కొందరు అనుమానిస్తున్నారు. ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. 

 

అయితే తాజాగా అసలు ఆ ఇంట్లో హత్యలకు ముందు ఏం జరిగిందన్న విషయాన్ని ఓ మంత్రగాడు మీడియాకు తెలిపారు. ప్రతిరోజూ ఉదయాన్నే నాలుగు గంటలకు లేచి గుడికి వెళ్లే అలవాటున్న ఆయన వద్దకు.. పురుషోత్తమ నాయుడు స్నేహితులు వచ్చి.. తెలిసిన వాళ్ళ అమ్మాయికి బాలేదు వచ్చి చూడాలని కోరారు. దీంతో ఆయన పురుషోత్తమ నాయుడు ఇంటికి వెళ్లారు. గేటు దగ్గరకు రాగానే ఇంటి లోపల నుండి బయటకు పెద్దపెద్దగా అమ్మాయి అరుపులు వినిపించాయి. లోపలికెళ్లి చూడగా.. చిన్న కూతురు సాయి దివ్య వింతవింతగా ప్రవర్తిస్తూ కనిపించింది. గట్టిగట్టిగా కేకలు వేస్తూ, అక్కకి ముందు పెడుతూ వింతగా ప్రవర్తించింది. ఇక పెద్దమ్మాయి అలేఖ్య అయితే అసలు స్పృహలో లేదు. ఆమెని లే అమ్మా అంటూ తట్టి లేపితే కాసేపటికి స్పృహలోకి వచ్చింది. అలా కాసేపు వారితో మాట్లాడి, ధైర్యం చెప్పి.. పూజారి బయలుదేరుతుండగా.. అమ్మాయిలు ఎందుకో బాగా భయపడ్డారు, వారికి తాయత్తులు కట్టమని పురుషోత్తమ నాయుడు స్నేహితులు కోరారు. దీంతో ఆయన తన ఇంటికెళ్లి తాయత్తులు సిద్ధం చేసి, అలాగే గుడి దగ్గర నుండి పూజాసామాగ్రి తీసుకొని మళ్ళీ పురుషోత్తమ నాయుడు ఇంటికొచ్చారు. ఇద్దరు యువతులకు తాయత్తులు కట్టి, దేవుడి ముందు కొబ్బరికాయ కొట్టి, పూజ చేసి వచ్చేశారు. మళ్లీ మరుసటి కూడా రావాలని ఆయనను కోరగా.. తాను బిజీగా ఉన్నానని, తర్వాత వస్తానని చెప్పారు. కానీ ఆ తరువాత ఆయనకి పిలుపు రాలేదు. ఇంతలోనే యువతుల హత్య ఘటన వెలుగులోకి వచ్చింది.

By
en-us Political News

  
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్‌ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్‌ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు. ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు. 
మోకిల నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
Publish Date:Jan 7, 2026
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చ‌క్రం తిప్పారు. క‌విత ఎడ్యుకేటెడ్ కావ‌డం,  హిందీ కూడా బాగానే మాట్లాడ‌గ‌ల‌గ‌డంతో జాతీయ స్థాయి ప్ర‌తినిథిగా ఉండేవారు. అయితే క‌విత రెండో సారి ఎంపీగా గెల‌వ‌లేక పోయారు
ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.