Publish Date:Aug 22, 2023
ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం పుష్ఫ. ఈ చిత్రం మొదటి భాగం.. దేశవ్యాప్తంగా వసూళ్ల రికార్డ్ సృష్టించింది. ఈ చిత్రం రెండో భాగం.. షూటింగ్ శరవేగంగా జరుపుకొంటుంది. అయితే ఈ చిత్ర తొలి భాగంలో హీరో అల్లు అర్జున్.. ఎర్రచందనం స్మగ్లర్గా అందరికీ షాక్ల మీద షాక్లు ఇస్తుంటే.. రియల్ లైఫ్లో మాత్రం.. అల్లు అర్జున్తో పాటు ఆయన మామ గారు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి తెలంగాణ సీఎం కేసీఆర్ గట్టి షాక్ ఇచ్చారు.
అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా నాగార్జున సాగర్ నుంచి పోటీ చేసేందుకు.. తన వంతు ప్రయత్నాలు చేసుకొంటున్నారు. అయితే ఆగస్ట్ 19వ తేదీన నాగార్జున సాగర్లో కంచర్ల కన్వెన్షన్ ప్లేస్ పేరుతో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించిన ఫంక్షన్ హాల్ను అల్లు అర్జున్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భారీగా జనం తరలివచ్చారు. ఈ సందర్బంగా అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
అయితే ఆ ఫంక్షన్ హాల్ ప్రారంభించిన రెండు రోజులకే అంటే ఆగస్ట్ 21వ తేదీన.. బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్.. వచ్చే ఎన్నికల్లో బరిలో దిగనున్న 115 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేశారు. ఆ జాబితాలో అల్లు అర్జున్ మామ గారు పేరు లేదు. ఆ అసెంబ్లీ స్థానం నుంచి మళ్లీ ప్రస్తుత ఎమ్మెల్యే నోముల భగత్ పేరునే పార్టీ అధినేత ప్రకటించారు. దీంతో అల్లు అర్జున్ మామకు కేసీఆర్ ఝలక్ ఇచ్చినట్లు అయింది. మరోవైపు 2014లో జరిగిన ఎన్నికల్లో ఇబ్రహింపట్నం అసెంబ్లీ స్థానం నుంచి నాటి టీఆర్ఎస్ అభ్యర్థిగా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి బరిలోకి దిగి.. టీడీపీ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి చేతిలో ఓటమి పాలైయ్యారు. ఇక నాగార్జున సాగర్ ఎమ్మెల్యే టికెట్ కోసం కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయనే ఓ చర్చ సైతం స్థానికంగా కొన.. సాగుతోంది.
ఇక 2018 ఎన్నికల్లో నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల నర్సింహయ్య.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, హోం శాఖ మాజీ మంత్రి కె. జానారెడ్డిపై గెలుపొందారు. ఆ తర్వాత నోముల నర్సింహయ్య మరణంతో ఆ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఆయన కుమారుడు నోములు భగత్ను టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగడంతో.. ఆయన ఘన విజయం సాధించారు. కానీ వచ్చే ఎన్నికల్లో మళ్లీ నోముల భగత్కే బీఆర్ఎస్ అధినాయకత్వం టికెట్ కేటాయించడం గమనార్హం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/shock-in-pushpa-family-25-160408.html
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో విజయ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జననాయగన్ సినీమా విడుదలపై నెలకొన్న అనిశ్చితిని ఆయన ప్రజల ముందు ఉంచారు. అలాగే.. కరూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాద ఘటనను ప్రస్తావిస్తూ.. అది యాధృచ్ఛికంగా జరిగింది కాదని, దాని వెనుక కూడా లోతైన కుట్ర దాగి ఉందన్న అనుమానాలున్నాయన్నారు.
నిజానికి తాను రాజకీయ సన్యాసం చేసినట్టు చెబుతూనే ఉన్నా.. ఇప్పటికీ ఆయన తన టీం ద్వారా అకౌంట్ సర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు. ఆపై జగన్ కి లోపాయికారిగా సహకరించేందుకే ఈ రాజీనామా డ్రామాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బేసిగ్గా విజయసాయిరెడ్డి కామెంట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే.. ఇటీవల జగన్ అర్ధంపర్దం లేకుండా చేసిన మావిగన్ అనే ప్రతిపాదన మీదే. కానీ రేణుక చౌదరి సభలో లేవనెత్తిన కమ్మరావతిని పట్టుకుని.. పోస్టులు పెట్టడం సరికాదంటున్నారు.
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి.
గురువారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును రాజ్యసభలో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని విషయంలో ఉన్న చట్టపరమైన అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణ అత్యవసరమని పేర్కొన్నారు. బిల్లుపై జరిగిన చర్చ అనంతరం, సభాపతి సి.పి. రాధాకృష్ణన్ క్లాజ్ వారీగా ఓటింగ్ నిర్వహించగా సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజ్యసభ ఆమోదం లభించింది.
. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదనీ, అయితే రాజధాని పేరుతో సాగుతున్న పరిణామాలు, ఆర్థిక భారాలనే ప్రశ్నిస్తున్నామన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి ఇన్నాళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు.
అమరావతికి చట్టబద్ధత అమరావతి రైతుల నైతిక విజయంగా అభివర్ణించారు. సుదీర్ఘకాలం పాటు మొక్కవోని దీక్షతో రైతులు చేసిన పోరాటం వల్లే ఇది సాధ్యమైందన్నారు.
రాజధాని ఉద్యమ సమయంలో పాలకులు ప్రయోగించిన అణచివేత చర్యలను ఈ సందర్భంగా రేణుకా చౌదరి గుర్తు చేశారు.
సీఎం హోదాలో నాడు అమరావతి శాసన రాజధాని , విశాఖ పరిపాలన రాజధాని , కర్నూలు న్యాయ రాజధాని అంటూ ఓ కొత్త వాదనను తెరమీదకు తీసుకువచ్చారు. ఆ దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు పడకపోయినా.. అప్పటి వరకూ పరుగెడుతున్న అమరావతి నిర్మాణ పనులను నిలిపివేశారు.
దేశంలో ఉన్న అన్ని పార్టీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు నిలిపి అమరావతి బిల్లుకు చట్టబద్ధత కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీని పార్లమెంటు హాలులో గురువారం ఉదయం కలిసిన లోకేష్ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.
వైసీపీ నేతలు అవగాహన లేకుండా ప్లాట్లు, ఖర్చులంటూ అవగాహనా రాహిత్యంతో వ్యాఖ్యలు చేస్తూ తమ అజ్ణానాన్ని చాటుకుంటున్నారని ఎద్దేవా చేశారు.