రాజకీయ నాయకులంతా ఒకే తీరుగా వ్యవహరిస్తారు. అధికారంలోకి వచ్చేవరకూ ఒకలా, సీఎం పీఠం ఎక్క గానే వెంటనే అప్పటివరకూ వున్న సీఎం కలగా పేర్కొనే పెద్ద ప్రాజెక్టుకు వంక పెడుతూంటారు. మహా రాష్ట్ర లోనూ అదే జరిగింది. నిన్న సీఎం అయిన షిండే ముంబైలో వివాదాస్పద మెట్రో కార్షెడ్ అంశంపై గతంలో ఫడ్నవీస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికే మొగ్గు చూపారు. దీంతో థాక్రే ప్రభుత్వ నిర్ణయాలకు ఎలాంటి ప్రాధాన్యతా లేకుండా పోయింది. ఈ షెడ్డును ముంబైలోని ఆరే కాలనీలో ఏర్పాటుకు వీలు కల్పించమని కోరుతూ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేయమని అడ్వకెట్ జనరల్ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే ఆదేశించారు.
వాస్తవానికి 2019 లోనే ఈ మెట్రో షెడ్ గురించి ముంబై మెట్రో రైల్ కార్పోరేషన్ ఆరే కాలనీ ప్రాంతంలో చెట్లు కొట్టించేందుకు అనుమతించాలని బృహన్ ముంబై మునిసిపల్ కార్పోరేషన్ (బిఎంసి) ని కోరింది.
ఈ అంశంపై ఇప్పటికే ముంబైలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వెల్లువెత్తింది. ఇది పర్యావరణానన్ని దెబ్బ తీస్తుందని పర్యావరణ వేత్తలు ఆందోళన చేపట్టారు. కానీ ముంబైలో చెట్లతో పచ్చగా నిండిన, చెప్పుకోదగ్గ ప్రాంతంగా ఆరే కాలనీ ప్రసిద్ధం. కానీ అప్పట్లో బిఎంసి అందుకు అంగీకరించడంతో ముంబైలో ఉవ్వె త్తున నిరసనలు వెల్లువెత్తాయి. కానీ మెట్రో కార్షెడ్ ఏర్పాటుకు ఎంచుకున్న ఆ ప్రాంతం ఎలాంటి అటవీ భూమి కాదని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అప్పట్లో అన్నారు. పచ్చటి చెట్లతో స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. కానీ ఇప్పుడీ అండర్గ్రౌండ్ మెట్రో రావడంతో ఆ స్వచ్ఛతకు అంతగా నష్టంవాటిల్లదనీ అన్నారు. ఆ ఏడాది తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని వదిలిన ఉద్ధవ్ థాక్రే మహా వికాస్ అఖండ పార్టీ అధికారం లోకి వచ్చింది.
కార్యకర్తల నిరసనలను దృష్టిలో ఉంచుకుని కొత్త ప్రభుత్వం మెట్రో కార్ షెడ్ను కంజుర్మార్గ్కు మార్చా లని నిర్ణయించింది. ఆ తర్వాత, కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం 2020లో బాంబే హైకోర్టు కు వెళ్లింది, ఈ భూమి తమ ఉప్పు శాఖకు చెందినదని పేర్కొంది. దీంతో హైకోర్టు స్టే విధించింది. అప్పటి నుంచి ప్రాజెక్టు పనులు కొలిక్కివస్తున్నాయి.
ఆరేలో షెడ్డు నిర్మించాలన్న యోచనను తాము బీజేపీ కూటమి భాగస్వాములుగా ఉన్నప్పుడు కూడా శివసేన వ్యతిరేకిస్తోంది. ప్రాజెక్ట్ను మార్చడంపై బిజెపి విమర్శలపై గత ఏడాది ముఖ్యమంత్రి థాకరే స్పందిస్తూ, త్వరితగతిన చేపట్టిన మౌలిక సదుపాయాల పనులు వృధాకు దారితీస్తాయని, నిజమైన అభివృద్ధి కాదని అన్నారు. షిండే చర్య తీసుకున్న వెంటనే, ముంబై మెట్రో పనులను తిరిగి ట్రాక్లోకి తీసుకువస్తామని బిజెపి నాయకుడు కిరీట్ సోమయ్య ట్వీట్ చేశారు.
ఆరే వద్ద ఉన్న మెట్రోకార్ షెడ్ను తిరిగి తీసుకురావాలని షిండే ఫడ్నవీస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ముంబై మెట్రో పనులను తిరిగి ట్రాక్ చేస్తుంది అని ఆయన ట్వీట్ చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/shinde-supports-phadnavis-decision-on-metroshed-25-138846.html
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.