సింహాద్రి అప్పన్న ఆలయంలో కూలిన షెడ్డు

Publish Date:Jul 5, 2025

Advertisement

సింహాచలం అప్పన్న ఆలయంలో వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనలపై భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన షెడ్డు కుప్పకూలింది. ఈ షెడ్డను  ఈ నెల తొమ్మిదో తేదీన గిరి ప్రదక్షిణ చేసే భక్తుల కోసం ఏర్పాటుచేశారు.  అదృష్టవశాత్తు షెడ్డు కూలిన  సమయంలో  భక్తులు లేకపోవడంతో  ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఫోల్స్ క్రింద కాంక్రీట్ వేయక పోవడంతో బరువు ఎక్కువై భారీ షెడ్డు ఒక్కసారిగా కుప్పకూలినట్లు  తెలుస్తోంది. ప్రమాద సమయంలో షెడ్డు క్రింద ఎవరూ లేకపోవడంతో సరిపోయింది. 

ఈ ఏడాది  ఏప్రిల్ 30న సింహాద్రి అప్పన్న చందన యాత్ర సందర్భంగా మెట్ల మార్గంలో  క్యూ లైన్ గోడ కూలి ఏడుగురు మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా గిరిప్రదర్శన సందర్భంగా భక్తుల కోసం ఏర్పాటు చేసిన షెడ్డు కూలిపోవడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నది. ఇదే సంఘటన 9వ తేదీన జరిగి ఉంటే భారీగా ప్రాణనష్టం జరిగి ఉండేదని అంటున్నారు. ఇప్పుడు జరిగిన ప్రమాదం వల్ల ఎటువంటి నష్టం వాటిల్లకపోయినప్పటికీ తాత్కాలిక నిర్మాణాలు చేపట్టే సమయంలో నిర్లక్ష్యం, అశ్రద్ధను ఇప్పటికైనా వీడాలని భక్తులు కోరుతున్నారు.  

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన రెండో రోజు సోమవారం (జులై 28) పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల ప్రతినిథులతో వరుస భేటీలతో బీజీబిజీగా సాగనుంది.
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్. రామచంద్ర రావు బాధ్యతలు చేపట్టి అట్టే కాలం కాలేదు. ఈ నెల మొదటి తేదీన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన, 5వ తేదీన అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు కావేరి నదికి వరద పోటెత్తింది. రాష్ట్రంలో వాగులు, వంకలు, నదులూ అన్ని పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. సోమవారం (జులై 28) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 12 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హస్తిన పర్యటనకు సమాయత్తమౌతున్నారు. కేంద్రంలోని పెద్ద‌ల‌తో ఆయ‌న భేటీ అవ్వాలని భావిస్తున్నారు.
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ విచారణకు డుమ్మా కొట్టారు. తెలుగుదేశం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసుకు సంబంధించి ఆయన విచారణకు హాజరు కాలేదు.
ములుగు జిల్లాలోని వాటర్ ఫాల్స్ సందర్శనకు వచ్చిన ఏడుగురు NIT విద్యార్థులు అడివిలో తప్పిపోయారు
బాలకృష్ణ కూడా సినీ పొలిటీషియనే. ఆయనా హిందూపూర్ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు. ఇటు రాజకీయాల్లో ఉంటూనే అటు వరుస సినిమాలు చేస్తున్నారు.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేం ఎవరితో కలిసి ప్రసేక్తే లేదు. తెలంగాణ ఉన్నంతకాలం మా పార్టీ ఉంటుందన్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో కేటీఆర్‌ మాట్లాడారు
తిరుమల శ్రీ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్ నాయుడు తో కలిసి తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏపీలో అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌ల మధ్య మాటల యుద్దం రెండు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పెంచేస్తోంది. వారి డైలాగ్ వార్‌లోకి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంట్రీతో అగ్గికి మరింత ఆజ్యం పోసినట్లైంది.
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌‌ కేసులో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. తన వద్దకు వచ్చిన దంపతులకు ఐవీఎఫ్ ద్వారా పిల్లలు పుట్టలేరని, సరోగసితో పిల్లలు పుడతారని నమ్మించారు. సరోగసితో కోసం వేరే దంపతులకు రూ. 5లక్షలు ఇవ్వాలని చెప్పారు.
అన్నమయ్య జిల్లా నందలూరులో జయంతి ఎక్స్‌ప్రెస్ రైలు కింద భాగం లో పొగలు వచ్చాయి. కన్యాకుమారి నుండి పూణే మధ్య ఈ జయంతి ఎక్స్ప్రెస్ నడుస్తుంది. ఆదివారం రైలు లోని ఏసీ భోగి లోని కింద భాగంలో పొగలు రావడంతో గమనించిన ప్రయాణికులు గార్డుకు సమాచారం ఇచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.