నీట్ నిరసనల వేళ శశి థరూర్ రీపోస్ట్.. బాలీవుడ్ మౌనంపై ఊపందుకున్న చర్చ!

Publish Date:Jul 23, 2026

Advertisement

దేశవ్యాప్తంగా నీట్  లీకేజీ వ్యవహారం దుమారం రేపుతున్న వేళ.. తమ న్యాయమైన హక్కుల కోసం, భవిష్యత్తు రక్షణ కోసం ఢిల్లీ వీధుల్లో ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం, నిర్బంధం వంటి అణచివేత చర్యలకు పాల్పడటం వివాదానికి దారితీసింది. రాజకీయ నాయకులు, సామాజిక వేత్తలు పోలీసు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు.  ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు,  ఎంపీ శశి థరూర్  సామాజిక మాధ్యమం  వేదికగా చేసిన  రీపోస్ట్ ఇప్పుడు  చర్చనీయాంశంగా మారింది.

శశి థరూర్ తన  ఎక్స్  ఖాతాలో ఎలాంటి అదనపు వ్యాఖ్యలు జోడించకుండా..  2012లో   బాలీవుడ్ దిగ్గజ నటుడ, బిగ్ బి  అమితాబ్ బచ్చన్ చేసిన   ట్వీట్ ను రీట్వీట్ చేశారు.  2012 డిసెంబర్‌లో ఢిల్లీలో జరిగిన  సామూహిక అత్యాచార ఘటనకు నిరసనగా ఇండియా గేట్, రైసినా హిల్ వద్ద ప్రజలు, యువత ఆందోళన చేపట్టిన సమయంలో ఆందోళనకారులపై పోలీసులు   భాష్పవాయు  ప్రయోగం, వాటర్ క్యానన్ల చర్యలపై బిగ్ బీ ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే   బాధగా,దిగ్భ్రాంతిగా ఉంది.. శాంతియుతంగా జరుగుతున్న నిరసనలపై భాష్పవాయు గోళాలు, వాటర్ క్యానన్లను ఉపయోగిస్తున్నారు  అంటూ  అమితాబ్ బచ్చన్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.  

ఇప్పుడు శశిథరూర్ అప్పట్లో  అమితాబ్ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. శశిథరూర్ చర్య వెనుక స్పష్టమైన  సందేశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2012లో ప్రభుత్వ చర్యలను నిలదీస్తూ గళమెత్తిన బాలీవుడ్ అగ్ర నటులు, ఈ రోజు నీట్ విద్యార్థులపై పోలీసుల దమనకాండ విషయంలో మౌనంగా ఉండటాన్ని శశిథరూర్ నాటి అమితాబ్ ట్వీట్ ను తిరిగి పోస్టు చేయడం ద్వారా నిలదీసి, నిగ్గదీసి ప్రశ్నించారని అంటున్నారు.  బాలీవుడ్ అగ్రనటుల ద్వంద్వ వైఖరిని ఎండగట్టారని చెబుతున్నారు. 

అయితే నీట్ లీకేజీకి వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న నిరసనలపై  బాలీవుడ్ పరిశ్రమ మొత్తం మౌనంగా అయితే లేదు.  కొద్దిమంది సినీ ప్రముఖులు  విద్యార్థుల పక్షాన నిలబడ్డారు.  శబానా అజ్మీ, ప్రకాష్ రాజ్, స్వర భాస్కర్ వంటి వారు స్వయంగా  జంతర్ మంతర్ వద్దకు వెళ్లి మరీ విద్యార్థులకూ, వారి పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. అలాగే..  హుమా ఖురేషి, నసీరుద్దీన్ షా, సోనాక్షి సిన్హా, అభయ్ డియోల్ వంటి వారు సామాజిక మాధ్యమం వేదికగా  విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు.   ప్రీతి జింటా, భూమి పెడ్నేకర్ వంటి నటీమణులు హింసకు తావులేకుండా, విద్యార్థుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడంపైనే పాలకులు దృష్టి పెట్టాలని బహిరంగంగా కేంద్రానికి విజ్ణప్తి చేశారు. 

అయితే ఇక్కడ శశిథరూర్  పోస్టు .. గతంలో సామాజిక అంశాలపై గళమెత్తిన బాలీవుడ్ పెద్దలు నేడు ఎందుకు సైలంటైపోయారన్న చర్చను లేవనెత్తింది. 2012 నాటి అమితాబ్ స్పందన, ప్రస్తుత నీట్ నిరసనలపై అమితాబ్ వంటి  అగ్ర తారల మౌనం వెనుక ఉన్న కారణమేంటన్న చర్చ ఇప్పుడు సర్వత్రా జరుగుతోంది. 

Shashi Tharoor repost, NEET protests Delhi, Amitabh Bachchan 2012 tweet, Bollywood silence on NEET, NEET paper leak news, Jantar Mantar protests

By
en-us Political News

  
స్కూల్ యూనిఫాంలు పంపిణీ చేసిన త‌ర్వాత వాటి నాణ్య‌త‌, సైజు ఇత‌ర అంశాల‌పై ప్ర‌తి విద్యార్థి నుంచి వాట్సాప్ ద్వారా అభిప్రాయ సేక‌ర‌ణ (ఫీడ్ బ్యాక్‌)
చిత్తూరు జిల్లా పలమనేరు అటవీ ప్రాంతం నుంచి అల్లూరి సీతారామరాజు (మన్యం) జిల్లాకు తరలిస్తున్న శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పోరు నెలకొంది.
కాజా గ్రామానికి చెందిన పెద్దకాపు సింహాద్రి వెంకటరామారెడ్డి పొలాల్లోని పాటి దిబ్బనుగురువారం (జులై 23) దున్నతుండగా రెండు చిన్న విగ్రహాలు నాగలి చాలు పైకి వచ్చాయన్న సమాచారం మేరకు శివనాగిరెడ్డి ఆ విగ్రహాలను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలు తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
హైదరాబాదు నగర పరిసరాల్లో ఆర్మీకి చెందిన భూములపై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ రక్షణ శాఖ అధికారులు హైడ్రా కమిషనర్‌ను ఆశ్రయించారు.
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో ప్రక్షాళన, విముక్తి, భద్రత అనే మూడు అంశాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఈ జనరేషన్‌కి ఎమోషనల్ కంట్రోల్ లేకపోవడమే నేరాలకు కారణమా..!
టెక్ మహీంద్రా కంపెనీ ముందు ధర్నాకు దిగిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి..
ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో సీఐడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో తీవ్ర చలననాన్ని రేపింది.
వరంగల్‌లో మీడియా రిపోర్టర్లతో నిర్వహించిన చిట్‌చాట్ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
తన అనుచరులు, స్థానికులతో కలసి ప్రత్యేక వేదికపై కూర్చుని ఈ మౌన నిరసన చేపట్టారు. ఏలాంటి ఉపన్యాసాలు, నినాదాలు లేకుండా కేవలం మౌనంతోనే ఆయన నిరసన వ్యక్తం చేశారు. దేశ రాజథానిలో వేలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా కేంద్రం స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేతులు మారిన ప్రతీసారీ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల అంశం మళ్లీ రాజకీయ తెరపైకి వస్తుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.