ఏపీ రాజకీయాలను మలుపు తిప్పనున్న షర్మిల కుమారుడి వివాహం?!

Publish Date:Dec 31, 2023

Advertisement

జనవరిలో ఏపీ రాకీయాలు కీలక మలుపు తిరగనున్నాయి. మార్చిలో ఏపీలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఫిబ్రవరిలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. దీంతో జనవరిలో ఏపీ రాజకీయాలు ఊహకందని మలుపులు తిరగనున్నాయి. అధికార వైసీపీ సహా విపక్షాలు  జనవరిలో అభ్యర్థులను ప్రకటించనున్నాయి. దీంతో భారీ స్థాయిలో వలసలు కూడా ఉండనున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా అధికార  వైసీపీ నుండి పదుల సంఖ్యలో నేతల జంపింగుకు ఆస్కారం ఉంది. అసంతృప్త ఎమ్మెల్యేలు విపక్ష పార్టీల వైపు చూస్తుండగా.. ఇప్పుడు వీరికి కాంగ్రెస్ పార్టీ బెస్ట్ అప్షన్ గా కనిపిస్తున్నట్లు సూచనలున్నాయి. ఏపీ కాంగ్రెస్ పార్టీకి షర్మిల అధ్యక్షురాలిగా రాబోతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో తెలంగాణ ఎన్నికలకు ముందే షర్మిల కాంగ్రెస్ లో చేరడం ఖరారు కాగా.. తెలంగాణ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ అందుకు కాస్త సమయం ఇచ్చారు. ఇక ఇప్పుడు ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో షర్మిల చేతికి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించడం ఖరారైంది.

అన్నీ అనుకున్నట్లు జరిగితే జనవరి మొదటి వారంలోనే షర్మిల అధికారికంగా కాంగ్రెస్ లో చేరనుండగా.. అదే రోజున ఏపీపీసీసీ అధ్యక్షురాలిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. కాగా, ఆ తరువాత జనవరి మూడవ వారంలో జరగనున్న షర్మిల కుమారుడి వివాహం ఏపీ రాజకీయాలను మలుపు తిప్పనున్నట్లు రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతున్నది. జనవరి 17న షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం జోధ్ పూర్ లోని ఉమైద్ ప్యాలెస్ లో జరగనుండగా.. ఆ తర్వాత హైదరాబాద్ లో భారీ స్థాయిలో రిసెప్షన్ వేడుక నిర్వహించనున్నారు. ఇక పెళ్లి వేడుకే అయినా ఒక రకంగా ఏపీ రాజకీయాలను మలుపు తిప్పే వేడుకగా భావిస్తున్నారు. ఈ రిసెప్షన్ వేడుకకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో పాటు మరికొందరు కాంగ్రెస్ పెద్దలు కూడా హాజరుకానుండగా.. ఇదే వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాలలోని నేతలను ఆహ్వానించనున్నట్లు తెలుస్తుంది. ఒక రకంగా ఈ వేడుక నేతల సమీకరణకు వేదికగా మారనున్నట్లు చెప్తున్నారు.

ముఖ్యంగా గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంతో సంబంధం ఉన్న నేతలను షర్మిల దగ్గర చేసుకొనేందుకు తన కుమారుడి పెళ్లి రిసెప్షన్ వేడుకను షర్మిల వేదికగా భావిస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు వైసీపీలో ఉన్న ఒకప్పటి కాంగ్రెస్ నేతలతో విజయమ్మ సంప్రదింపులకు ఈ రిస్పెప్షన్   బీజం వేయనున్నట్లు కనిపిస్తుంది. అదే విధంగా సోదరుడు సీఎం జగన్ మోహన్ రెడ్డితో షర్మిల విబేధాలు, తల్లి విజయమ్మ షర్మిల పక్షాన అండగా నిలబడం, వైఎస్ వివేకా హత్య అనంతరం దూరమైన మరో సోదరి డాక్టర్ సునీత న్యాయపోరాటం, ఇప్పుడు వైఎస్ కుటుంబంలో అగాధాలు ఈ పెళ్లితో మరోసారి చర్చకు రానుండగా.. అసలు జగన్ కు ఈ వేడుకకు ఆహ్వానం అందుతుందా? అందినా జగన్ ఈ వేడుకకు వస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. అలాగే ఈ పెళ్లి ఏపీలో వైఎస్ అభిమానులకు ఎలాంటి సంకేతం ఇవ్వనుందన్నది ఉత్కంఠ రేపుతోంది. ఏది ఏమైనా షర్మిల కుమారుడి రిసెప్షన్ ఏపీ రాజకీయాలను మలుపు తిప్పడం ఖాయంగా కనిపిస్తున్నది. 

షర్మిల ఏపీ రాజకీయాలకు వస్తారా? కాంగ్రెస్ పార్టీలో చేరతారా అనే దాగుడు మూతలు ఇకలేవు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక ఖరారైంది. ఆమె ఏపీ రాజకీయాలలో క్రియాశీలంగా పని చేయనున్నారని తేలిపోయింది. అన్న జగన్ తో షర్మిల ప్రత్యక్ష యుద్దానికి సిద్ధమేనని నిర్దారణ అయిపోయింది. అందులో భాగంగానే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు క్రిస్మస్ బహుమతులు పంపించారు. అది కూడా వైఎస్ కుటుంబం తరపున ఈ బహుమతులు పంపుతున్నట్లు షర్మిల శుభాకాంక్షలు తెలిపి.. వైఎస్ రాజకీయ వారసత్వంలో తనకు కూడా వాటా ఉన్నట్లు ఆమె పరోక్షంగా చెప్పేశారు. ఇప్పుడు ఆ వారసత్వాన్ని దక్కించుకునేందుకు అదే కుటుంబ వేడుకను వేదికగా మలచుకోనున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇది వైసీపీకి, జగన్ మోహన్ రెడ్డికి మింగుడుపడని వ్యవహారం అనడంలో ఎలాంటి అనుమానాలు లేవు. షర్మిల కుమారుడి వివాహ రిసెప్షన్ ఏపీ రాజకీయాలలో పెను మార్పులకు వేదిక అవ్వడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
జన్ సూరాజ్ పార్టీని స్థాపించి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. 2014 ఎన్నికలలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే ఘన విజయం సాధించడం నుంచి మొదలు పెడితే.. 2019లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ నాయకత్వంలోని వైసీపీ, ఆ తరువాత పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ లను అధికారంలోకి తీసుకురావడానికి తన వ్యూహాలే కారణమని తన భుజాలను తానే చరిచేసుకుని మరీ చెప్పుకున్న ప్రశాంత్ కిషోర్.. తన సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోలేక చతికిల పడ్డారు.దీంతో ప్రశాంత్ కిశోర్ ప్రతిష్ఠ మసకబారింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎండగట్టారు. అమరావతిని జగన్ నిరంతరం ప్రయత్నిస్తున్నారనీ, ఇప్పుడు కొత్తగా మావిగన్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు
ఏపీకి రాజధాని ఏది? అమరావతి శాశ్వతమా లేక మావిగాన్ అంటూ జగన్ చేసిన ప్రతిపాదనతో మళ్లీ రాజధానిపై జనంలో అనుమానాలు మొదలయ్యాయా? అన్న చర్చ మొదలైంది. ఏపీ రాజధాని విషయంలో మరో ప్రయోగం మొదలుకాబోతోందా? అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతి వేడుకలు దేశరాజధానిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్లమెంటు ఆవరణలోని ప్రేరణా స్థల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేశాధినేతలు, రాజకీయ దిగ్గజాలు ఒకే వేదికపైకి వచ్చారు. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
బీజేపీకి ఓటేస్తే.. సామాజిక న్యాయానికి పాడె కట్టడమేనన్నారు. రాష్ట్రంలోని బీజేపీని అడుగుపెట్టనీయవద్దని, ఒక్క సీటు కూడా వారికి ఇవ్వకుండా తమిళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల కోరారు.
అమరావతికి సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధ రాజధానిగా గుర్తింపు లభించిన తరువాత కూడా సజ్జల మౌలిక వసతులు లేని ప్రాంతంలో వేలకోట్టు కుమ్మరిస్తోందంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు కూడా అమరావతి అభివృద్ధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నా.. గ్రాఫిక్స్ రాజధాని అంటూ పాత పాటే పాడారు సజ్జల.
ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశం అత్యంత ఆత్మీయంగా, భావోద్వేగాల మధ్య సాగింది. చాలా కాలం తర్వాత తన పాత మిత్రుడిని కలిసిన జీవన్ రెడ్డి ఒ ఉద్వేగానికి లోనయ్యారు.
గత కొంతకాలంగా తనపై సాగుతున్న అభిశంసన ప్రక్రియ, అలాగే నివాసంలో లభించిన లెక్కకు రాని నగదు వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం నితీశ్ కుమార్ ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి పదవికి మరో మూడు నాలుగు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. తాను లేని పక్షంలో రాష్ట్ర బాధ్యతలను కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
వైసీపీ సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా న్యాయమూర్తులు రాజకీయ ఫ్లెక్సీలపై స్పందిస్తూ.. ఎవరిని ధ్వంసం చేయాలని చూస్తున్నారు? 2029లో రాష్ట్రాన్నా లేక ప్రజలనా? అంటూ ప్రశ్నించారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన రోజున జరిగిన పరిణామాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.