జగన్ నీకు క్యారెక్టర్ ఉందా?.. సూటిగా నిలదీసిన షర్మిల!

Publish Date:Feb 7, 2025

Advertisement

ఏపీసీసీ అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వయానా సోదరి అయిన షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అన్న జగన్ మోహన్ రెడ్డికి ఇతరుల క్యారెక్టర్ గురించి మాట్లాడే కనీస అర్హత లేదని కుండబద్దలు కొట్టారు. 

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలలో ఓటమి తరువాత నుంచీ వైసీపీకి గడ్డు కాలం దాపురించినట్లే కనిపిస్తోంది. ఆ పార్టీ నుంచి ఒకరి తరువాత ఒకరు అన్నట్లుగా నాయకులు బయటకు వెళ్లిపోతున్నారు. అలా వెళ్లి పోతున్నవారిలో జగన్ కు అత్యంత సన్నిహితులుగా ముద్రపడిన వారూ ఉంటున్నారు. కొద్ది రోజుల కిందటే వైసీపీలో కీలక నేత, జగన్ కుటుంబానికి సన్నిహితుడు, జగన్ అక్రమ కేసులలో సహ నిందితుడు అయిన విజయసాయిరెడ్డి పార్టీకి దూరమయ్యారు. పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికీ, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి.. ఇక నుంచీ తాను రాజకీయాల జోలికి పోనని ప్రకటించారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ పట్ల తన స్వామి భక్తిని ప్రదర్శించారు. తనకు అవకాశాలిచ్చినందుకు ఆయనకు కృతజ్ణతలు తెలిపారు. ఇక నుంచి వ్యవసాయమే తన వ్యాపకం అని చెప్పిన విజయసాయిరెడ్డి అన్నట్లుగానే తాను సాగు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపే ఫొటోలను సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. అక్కడితో రాజకీయాలలో, వైసీపీలో విజయసాయి రెడ్డి పాత్రకు ఎండ్ కార్డ్ పడిపోయిందనే అంతా భావించారు. 

అయితే జగన్ విదేశీ పర్యటన ముగించుకు వచ్చిన కొన్ని రోజుల తరువాత తాడేపల్లి ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ రెడ్డి రాజీనామాపై స్పందించారు.  అన్ని అవకాశాలూ ఇచ్చిన పార్టీని కాదని బయటకు వెళ్లపోవడం సరికాదన్నట్లుగా మాట్లాడారు. రాజకీయాలలో ఎవరికైనా సరే క్యారెక్టర్ ముఖ్యమని అనడం ద్వారా   విజయసాయిరెడ్డికి క్యారెక్టర్ లేదని చెప్పకనే చెప్పారు. 
దీనిపై విజయసాయి కూడా ఘాటుగా స్పందించారు. తనకు క్యారెక్టర్ లేదని జగన్ అనడాన్ని తప్పుపట్టారు. క్యారెక్టర్ ఉంది కనుకనే పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదులు కున్నానని చెప్పుకొచ్చారు.  తన క్యారెక్టర్ గురించి జగన్ మాటలు పూర్తి అవాస్తవాలు అన్నదే విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా చేసిన పోస్టు సారాంశం. విజయ సాయి రెడ్డి తరువాత జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన మోపిదేవి వెంకటరమణ కూడా జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్ కు క్యారెక్టర్ గురించి మాట్లాడే అర్హత లేదన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు విమర్శలు ఉన్నాయి. జగన్ అక్రమ ఆస్తుల కేసులో తాను జైలుకు వెళ్లిన సంగతిని గుర్తు చేస్తూ నిజంగా తనకు క్యారెక్టర్ లేకపోతే జగన్ అక్రమాస్తుల కేసులో ఇరుక్కుని ఉండేవాడినే కాదని చెప్పుకొచ్చారు.

వీరిద్దరి  కౌంటర్ ను తలదన్నేలా ఇప్పడు షర్మిల మీడియా ముందుకు వచ్చి జగన్ క్యారెక్టర్ పై సంచలన విషయాలను వెల్లడించారు.  జగన్ వ్యక్తిత్వం, విశ్వసనీయత గురించి మాట్లాడటం అతి పెద్ద జోక్ గా షర్మిల అభివర్ణించారు.  తోబుట్టువునైన తనపైనా, తన వ్యక్తిత్వంపైనా జగన్ నీచాతినీచంగా బురద జల్లారని షర్మిల ఆరోపించారు. విజయసాయి వైసీపీకి రాజీనామా చేసిన తరువాత తనతో భేటీ అయ్యారని చెప్పిన షర్మిల ఆ సందర్భంగా ఆయన చాలా చాలా విషయాలు చెప్పారని పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా విజయసాయి గతంలో మీడియా సమావేశంలో మాట్లాడడానికి కారణం జగన్ ఒత్తిడేనని విజయసాయి తనతో చెప్పారనీ, షేర్ల విషయంలో జగన్ చెబుతున్నదంతా అవాస్తవమని తన తల్లి విజయమ్మ లేఖ రాయడంతో మరో సారి మీడియా సమావేశం పెట్టి విజయమ్మలేఖను ఖండించాల్సిందిగా జగన్ విజయసాయిపై ఒత్తిడి తెచ్చారనీ, ఆయన వినకపోవడంతో సుబ్బారెడ్డితో మీడియా సమావేశంలో మాట్లాడించారనీ షర్మిల తెలిపారు. ఈ విషయాలన్నీ విజయసాయి స్వయంగా తనతో చెప్పారని షర్మిల వెల్లడించారు. ఇంత నీచానికి ఒడిగట్టిన జగన్ క్యారెక్టర్ గురించి మాట్లాడటమేంటని ఆమె ఎద్దేవా చేశారు. జగన్ కు క్యారెక్టర్ అంటే అర్ధం తెలియదని దుయ్యబట్టారు.  

మేనకోడలు, మేనల్లుడి ఆస్తులు కాజేయాలని కుట్రలు చేసిన వ్యక్తి జగన్ అని షర్మిల విమర్శలు గుప్పించారు.   జగన్, ఆయన భార్య భారతి బైబిల్ ముందు పెట్టుకుని వారి క్యారెక్టర్ ఏంటో, ఎంత దిగజారిపోయారో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. 

By
en-us Political News

  
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ త‌ర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవ‌రిని ఎమ్మెల్సీ చేయాల‌ని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం న‌రేంద‌ర్ రెడ్డి.. నేడు ఆయ‌న రాజ‌కీయ స‌ల‌హాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్ద‌ల స‌భ‌లోకి స‌గ‌ర్వంగా అడుగు పెడుతున్నారు.
సీట్ల సర్దుబాటుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ ఇంత వరకూ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయాన్నికేంద్ర హోంమంత్రికి వివరించిన సీఎం రేవంత్.. వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణ, పరిశ్రమల వృద్ధి దృష్ట్యా రాష్ట్రానికి మరిన్ని ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని, తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాలని కోరారు.
సంక్రాంతి సంబరాలు నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రెండు వర్గాల మధ్యా పోటీ కొనసాగుతున్నది. సీతం రాజు సుధాకర్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ముగ్గుల పోటీ నిర్వహిస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కనకమాలక్ష్మి ఆలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇది ఒక్కటే కాదు, కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా తలో దిక్కు అడుగులు వేస్తున్నారు.
కొద్దికాలం కిందట శరద్ పవార్ తాను రాజ్యసభకు పోటీ చేసే ప్రశక్తే లేదని ప్రకటించారు. అయితే ఇటీవల ఆయన అన్న కొడుకు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిణామాలపై ఆసక్తికర చర్చ జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 2) దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో కొలికపూడి దురుసుగా వ్యవహరించారు. నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు.
వాస్తవానికి మల్లు భట్టి విక్రమార్క్ జగన్ ను తన కుమారుడి వివాహానికి జనగ్ ను బెంగళూరు వెళ్లి ఆహ్వానించాల్సి ఉంది. అయితే జగన్ స్వయంగా తాను మంగళవారం తాడేపల్లి వస్తాననీ, అప్పుడు ఆహ్వానిస్తే సరిపోతుందనీ కబురు పంపారు.
ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే మండలి సభ్యత్వానికి వారు చేసిన రాజీనామాలను చైర్మన్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు.
మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
రాజ్యసభ ఎన్నికలకు 9 మంది అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.
స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఆలయ పురోహితులు ఎంపీ చిన్ని దంపతులకు అందజేశారు. అయితే, తనకు కూడా వస్త్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ఒకరికే ఇస్తారని చెప్పిన ఆలయ అధికారులు, ఆయనకు తలంబ్రాలు అందించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చేతిలోని పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కుని తన తలపై పెట్టుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.