Publish Date:Aug 15, 2025
వైసీపీ భయపడినంతా అయ్యింది. వైసీసీ అధినేత జగన్ కు స్వయానా సోదరి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల జగన్ పై నిప్పులు చెరిగారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలలో అన్యాయం జరిగిందంటూ ఆక్రోశం వ్యక్తం చేసిన జగన్.. ఆ సందర్బంగా రాహుల్ గాంధీపై కూడా విమర్శలు కురిపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాహుల్ గాంధీ హాట్ లైన్ లో టచ్ లో ఉంటారంటూ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను కాంగ్రెస్ నిర్ద్వంద్వంగా ఖండించింది. జగన్ పై విమర్శలు గుప్పించంది. అయితే వైసీపీ మాత్రం జగన్ అనవసరంగా రాహుల్ పై వ్యాఖ్యలు చేసి షర్మిలను రెచ్చగొట్టారనీ అంతర్గత సంభాషణల్లో పేర్కొన్నారు.
ఆమె రియాక్షన్ ను పార్టీ, జగన్ తట్టుకోవడం కష్టమని బెంబేలెత్తి పోయారు. కొందరు వైసీపీయులైతే బాహాటంగానే జగన్ రాహుల్ హాట్ లైన్ వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందన్న తమ అభిప్రాయాన్ని బాహాటంగానే చెప్పేశారు. షర్మిల ఎలాంటి విమర్శల బాంబులు పేలుస్తుందోన్న ఆందోళన వ్యక్తం చేశారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో కనీసం డిపాజిట్ కూడా దక్కకుండా వైసీపీ అభ్యర్థి ఓటమి పాలు కావడంతో పార్టీ ప్రతిష్టే కాకుండా జగన్ ప్రతిష్ఠ కూడా దిగజారిందనీ, ఇక షర్మిల విమర్శలకు మొదలు పెడితే జగన్ ప్రతిష్ఠ పాతాళానికి దిగజారడం ఖాయమనీ భయపడ్డారు.
వారి భయమే ఇప్పుడు నిజమైంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై జగన్ చేసిన విమర్శలకు షర్మల ఘాటుగా స్పందించారు. జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజకీయాలలో ద్వంద్వ ప్రమాణాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ అన్నారు. రాహుల్ గాంధీకి బలప్రదర్శన వ్యూహాలు తెలియవనీ, వాహనాల కింద జనాలను నలిపేయడం రాదనీ షర్మిల జగన్ వై విమర్శనాస్త్రాలు కురిపించారు. జగన్ హాట్ లైన్ గురించి మాట్లాడటం వింతగా ఉందన్న షర్మిల . చంద్రబాబు, రాహుల్ గాంధీ కాదనీ, జగనే నిత్యం మోడీ, అమిత్ షాలప్రాపకం కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. పార్టీ సభ్యుల తప్పులకు ఇతరులను నిందించడం జగన్ నైజం అన్న షర్మిల జగన్ నాయకత్వాన్ని, విలువలను ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నారనీ, జగన్ కు అసలు ప్రజాస్వామ్యం అంటేనో పొసగదనీ విమర్శించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sharmila-fires-jagan-25-204274.html
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు