Publish Date:May 11, 2024
నో డౌట్.. జగన్కి తన చెల్లెలు షర్మిల ఉసురు తప్పకుండా తగులుతుంది. అధికారం తుడిచిపెట్టుకుని పోతుంది. సొంత చెల్లి షర్మిల అన్నను విభేదించిన పాపానికి ఆమె మీద సోషల్ మీడియాలో పేటీఎం బ్యాచ్ చేత నానామాటలు అనిపించాడు జగన్. షర్మిలను అన్ని రకాలుగా అవమానించాడు. సొంత అన్న అయి వుండి, చెల్లెలు కట్టుకున్న చీర మీద కామెంట్లు చేశాడు. చివరికి ఆమె పుట్టుక విషయంలో కూడా దుష్ప్రచారం చేయించాడు. ఇవన్నీ మీడియా ముందు చెప్పుకుని షర్మిల కన్నీరు పెట్టుకుంది. ఇంటి ఆడపిల్ల కంట కన్నీరు పెట్టించిన జగన్ కన్ఫమ్గా ఫలితం అనుభవిస్తాడు. పరిస్థితులను ఎంతో ధైర్యంగా ఎదుర్కొనే షర్మిలను, జగన్ 16 నెలలపాటు జైల్లో వుంటే, అన్నాళ్ళూ పార్టీని కాపాడిన షర్మిలను, అన్న కోసం పాదయాత్ర చేసిన షర్మిలను ఈ రకంగా అవమానించడం నిజంగా దారుణం. ఈ పాపాలన్నిటికీ ఫలితం అనుభవించడానికి జగన్ మానసికంగా సిద్ధపడాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sharmila-crying-to-bad-propaganda-39-175673.html
పవన్ కళ్యాణ్తోపాటు జనసేన పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం తన పేరును ‘పద్మనాభరెడ్డి’గా మార్చుకోవడానికి సిద్ధపడ్డారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన బిఆర్ఎస్ ఇటీవల జరిగిన మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి గెలిచి ఖాతా తెరిచారు. ఒక రోజు తర్వాత సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ లో ఒక్క లోకసభ నియోజకవర్గంలో కూడా ఖాతా తెరవ లేదు. సిట్టింగ్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ఘోర పరాజయాన్ని చవి చూశారు.
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కేంద్రంలో అధికారం కావాలంటే మ్యాజిక్ ఫిగర్ 272 స్థానాలు గెలవాలి.కాని బీజేపీ సొంతంగా 250 స్థానాలు మాత్రమే వచ్చాయి.మ్యాజిక్ ఫిగర్ కు 22 స్థానాలు తగ్గాయి. కాని ఎన్డీఏ మిత్రపక్షాలకు 41 స్థానాలు రావడంతో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు ఢోకాలేదు.
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వేసవి సెలవుల కారణంగా గత కొన్ని రోజులుగా భక్తులు తిరుమలకు పోటెత్తారు. ఆ తాకిడి బుధవారం తగ్గింది.
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంతో కేసీఆర్ అర్జెంటుగా చంద్రబాబుకు, పవన్కి అభినందనలు తెలియజేశాడు. బీజేపీకి మాత్రం అభినందనలు తెలపలేదు.
ఢిల్లీలో ఏడు స్థానాలనూ గెలుచుకున్న బీజేపీ పంజాబ్లో మాత్రం బోర్లా పడింది. పంజాబ్ ఓటర్ పంజా విసరడంతో బీజేపీకి ఒక్క సీటు కూడా రాలేదు. మొత్తం 14 స్థానాల్లో 10 స్థానాలు కాంగ్రెస్ సొంతం చేసుకోగా, మూడు స్థానాలు ఇతర పార్టీలు సొంతం చేసుకున్నాయి.
రాజస్థాన్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య జరిగిన హోరాహోరీ పోరులో బీజేపీ పైచేయి సాధించింది. మొత్తం 25 స్థానాల్లో బీజేపీ 14 స్థానాలు సాధించగా, కాంగ్రెస్ 10 స్థానాలు సాధించింది. ఇతరులు 1 స్థానాన్ని సొంతం చేసుకున్నారు.
72 సంవత్సరాల మంగళగిరి నియోజకవర్గ చరిత్రలో నారా లోకేష్ రికార్డ్ మెజారిటీ సాధించారు.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంతో జగన్ రాజీనామా చేశారు.
మధ్యప్రదేశ్ని బీజేపీ ఊడ్చేసింది. మొత్తం 29 స్థానాలనూ కొల్లగొట్టింది.
కేజ్రీవాల్ అరెస్టు ప్రభావం ఢిల్లీ ఓటర్ల మీద ఎంతమాత్రం కనిపించలేదు. ఢిల్లీలోని ఏడు పార్లమెంట్ స్థానాల్లో మొత్తం బీజేపీనే సొంతం చేసుకుంది.
బీజేపీకి ఎప్పుడూ గుజరాత్ అండగా నిలుస్తూనే వుంటుంది. పైగా మోడీ, అమిత్ షా నాయకత్వంలో వున్న పార్టీ కాబట్టి గుజరాత్ బీజేపీ వైపే వుంటుంది. అందుకే గుజరాత్లో మొత్తం 26 పార్లమెంట్ స్థానాల్లో 26 స్థానాల్లో బీజేపీ, 1 స్థానంలో కాంగ్రెస్ గెలిచాయి.