Publish Date:Feb 21, 2025
మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుందన్నది నానుడి. ఎవరైనా సరే కర్మ ఫలం అనుభవించ కతప్పదంటారు. ఇప్పుడు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే సరిగ్గా అదే జరుగుతోందనిపించక మానదు. గతంలో అంటే జగన్ తాను అధికారంలో ఉన్న సమయంలో తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లు వ్యవహరించే వారు. నోటికి హద్దూ పద్దూ లేదన్నట్లుగా ప్రత్యర్థి పార్టీల నేతలను ఇష్టారీతిగా విమర్శలు గుప్పించే వారు. భాషను ఉపయోగించే విషయంలో జగన్ ఇసుమంతైనా మర్యాద పాటించిన దాఖలాలు లేవు.
ఆ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ లపై అనుచిత భాషాప్రయోగం చేశారు. ఇక జనసేనాని వపన్ కల్యాణ్ విషయంలో అయితే చెప్పనే అవసరం లేదు. పవన్ కల్యాణ్ వివాహాలపైన ఆయన చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉండేవి. సరే ఇక పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ఆయన ఎప్పుడూ దత్తపుత్రుడు అని సంబోధిస్తూ ఉండేవారు. చంద్రబాబు నాయుడికి మద్దతు పలుకుతున్నారు కనుక ఆయన చంద్రబాబు దత్తపుత్రులు అన్నది ఆయన భావన. ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా జగన్ ప్రత్యర్థులను కించపరిచే వ్యాఖ్యలు చేయడానికి ఇసుమంతైనా వెనుకాడే వారు కాదు.
ఇప్పుడు ఆయన దత్తపుత్రుడు వ్యాఖ్య అయనకే ఎదురువచ్చి తగిలింది. సొంత సోదరి, ఏపీసీసీ చీఫ్ షర్మిల జగన్ ను దత్తపుత్రుడు అని సంబోధించింది. కౌపీన సంరక్షార్థం.. అంటే కేసుల నుంచి రక్షణ కోసం జగన్ బీజేపీకి, ప్రధాని మోడీకి దత్తపుత్రుడుగా మారిపోయారని షర్మిల విమర్శించారు. అధికారంలో ఉన్నంత కాలమూ జగన్ మోడీ దత్తపుత్రుడుగానే ఉన్నారన్న షర్మిల, ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత కూడా అలాగే వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ను కించపరిచేందుకు జగన్ చాలా తరచుగా ఉపయోగించిన దత్తపుత్రుడు అనే పదాన్నే ఇప్పుడు సొంత సోదరి షర్మిల జగన్ ను ఉద్దేశించి వాడారు. అందుకే అంటారు కర్మ ఎవరినీ వదలదని.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sharmila-criticise-jagan-as-modis-dattaputrudu-39-193216.html
Publish Date:Sep 10, 2026
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.