వైఎస్ వారసత్వ పోటీలో వెనుకబడ్డ జగన్!?

Publish Date:Jan 11, 2025

Advertisement

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల మధ్య తమ తండ్రి వైఎస్ రాజకీయవారసత్వం కోసం తీవ్రమైన పోటీ జరుగుతోంది. అయితే ఈ పోటీలో షర్మిలే ఒకింత ముందున్నారన్న అభిప్రాయం కూడా ప్రజలలో వ్యక్తం అవుతున్నది. నిర్భయంగా, నిస్సంకోచంగా షర్మిల తన అన్న, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా చేసిన తప్పిదాలను ఎండగట్టడమే కాకుండా, వైఎస్ ఆశయాలకు తూట్లు పొడిచారంటూ పలు ఉదంతాలను సోదాహరణంగా వివరిస్తున్నారు. ముఖ్యంగా వైఎస్ తన రాజకీయ జీవితంలో ఎన్నడూ బీజేపీకి అనుకూలంగా మాట్లాడింది లేదు. పైగా నిఖార్సైన కాంగ్రెస్ నేతగా ఆయన తన జీవితాంతం బీజేపీని వ్యతిరేకించారనీ, అందుకు భిన్నంగా తన అన్న, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ బీజేపీతో అంటకాగుతున్నారనీ విమర్శిస్తున్నారు. 

వాస్తవానికి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత జగన్ కాంగ్రెస్ తో విభేదించి వైసీపీ పేర సొంత పార్టీని ఏర్పాటు చేసిన సమయంలో ఆయన కుటుంబం మొత్తం ఏకతాటిపై నిలిచింది. వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ వారసుడిగా ఆయన కుటుంబం ముక్తకంఠంతో జగన్ ను ప్రకటించింది. అయితే 2019 ఎన్నికలలో జగన్ పార్టీ విజయం సాధించింది. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అంతే అప్పటి నుంచీ పరిస్థితి మారిపోయింది.

 ఆ మార్పు ఎలా ఎందుకు వచ్చిందంటే.. ఎదుగింటి సందింటి  రాజశేఖరరెడ్డి (వైఎస్ఆర్)  కుటుంబం లో యుద్ధం మొదలయింది. ఆస్తుల తగాదా నుంచి అది వారసత్వ పోరు వరకూ వెళ్లింది.  ఆస్తుల పోరు కాస్తా రాజకీయ వారసత్వ రణం వరకూ వెళ్లింది.  ఈ యుద్ధంలో అన్న జగన్ ఒక వైపు.. చెల్లి వైఎస్ షర్మిల మరో వైపు మోహరించారు. అమ్మ కుమార్తె షర్మిల వైపే నిలిచారు. వాస్తవానికి రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణం తరువాత ఆయన కుటుంబం మొత్తం ఒక్కటై నిలిచింది. కష్ట కాలంలో ఒకరినొకరు ఓదార్చుకోవడంలో కానీ, తండ్రి రాజకీయ అండ చేజారిపోకుండా చూసుకోవడంలో కానీ, రాజకీయంగా కుటుంబం పెత్తనం సడలిపోకుండా కాపాడుకోవడంలో కానీ తల్లి, కుమారుడు, కుమార్తె, వీళ్లే కాకుండా వైఎస్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి, ఆయన కుటుంబం ఇలా మొత్తం వైఎస్ కుటుంబం అంతా ఏకతాటిపై నిలిచింది.   

జగన్ సొంతంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి, ఆ పార్టీ అధినేతగా తన సొంత రాజకీయ ప్రయాణం ఆరంభించారు. 2014 ఎన్నికలలో విభజన ఎమోషన్స్ తో పాటు వైఎస్ కుమారుడు వైఎస్ జగన్ పై ఉన్న పలు కేసులు, ఆయన వ్యవహార శైలిపై ప్రజలలో ఉన్న సంశయాలు, అనుమానాల కారణంగా జగన్ పార్టీ అధికారం చేజిక్కించుకోలేకపోయింది. అయితే విపక్ష నేతగా నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన జగన్ అసెంబ్లీని బాయ్ కాట్ చేసి పాదయాత్ర, ఓదార్పు యాత్ర అంటూ నిత్యం జనంలోనే గడిపారు. ఆయన ఆక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లడంతో వచ్చిన సానుభూతి, తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై జనంలో ఉన్న అభిమానానికి తోడు, సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు జగన్ పై జరిగిన కోడి కత్తి దాడి, బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య వంటి సంఘటనలు జగన్ కు ప్లస్ అయ్యాయి. దాంతో ఆ ఎన్నికలలో జగన్ పార్టీ వైసీపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. వైసీపీ విజయానికి పైన చెప్పిన అన్ని కారణాలతో పాటు వైఎస్ కుటుంబం మొత్తం జగన్ కు అండగా నిలబడటం కూడా ప్రధాన కారణంఅనడంలో ఇసుమంతైనా సందేహం లేదు. జగన్ జైల్లో ఉన్న సమయంలో జగనన్న వదిలిన బాణాన్ని అంటూ షర్మిల చేసిన ప్రచారం, ప్రసంగాలు, జగన్ తల్లి విజయమ్మ కుమారుడి కోసం రోడ్డుపై బైఠాయించి మరీ తెలిపిన నిరసనలు, బాబాయ్ వైఎస్ వివేకా, ఆయన కుమార్తె డాక్టర్ సునీత వెన్నంటి ఉండటం ఇలా ఇవన్నీ జగన్ కు  కలిసి వచ్చాయి.   ఇదేళ్లు గిర్రున తిరిగే సరికి నాడు అంటే 2019 ఎన్నికల సమయంలో వైఎస్ కు కలిసి వచ్చిన అంశాలే   ఆయనకు 2024 ఎన్నికలలో ప్రతికూలంగా మారాయి. 

నాడు జగన్ వెనుక ఐక్యంగా నిలిచిన కుటుంబం అండ లేకుండా పోయింబది. నాడు జగన్ కు అనుకూలంగా సానుభూతి వెల్లువెత్తడానికి కారణమైన వివేకా హత్య, కోడికత్తి దాడి కేసుల్లో ఇప్పుడు వెళ్లన్నీ ఆయన వైపే చూపించాయి. అలాగే నాడు జగన్ కు కొండంత అండగా నిలిచిన చెల్లి వైఎస్ షర్మిల ఆయనకు వ్యతిరేకంగా 2024 ఎన్నికలలో కాంగ్రెస్ ఏపీ అధినేత్రిగా పగ్గాలు చేపట్టారు. నాడు జగనన్న వదిలిన బాణాన్ని అంటూ జనంలోకి వచ్చిన షర్మిల 2024 ఎన్నికలలో జగన్ కు గురిపెట్టిన బాణంగా మారి ఆయనపై విమర్శలు గుప్పించారు.  ఇవన్నీ కూడా జగన్ స్వయంకృతాపరాధాలే అని చెప్పక తప్పదు.  తల్లి చెల్లి సహా వైఎస్ కు సన్నిహితులు అన్న వారందరినీ జగన్ వదిలించేసుకున్నారు.  

సరే ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత కూడా జగన్ తీరు మారలేదు. తనపై విమర్శలు గుప్పించిన చెల్లి షర్మిలపై తన సోషల్ మీడియాలో అసభ్య ప్రచారం చేయించారు. దీంతో ఆమె జగన్ పై మరింత తీవ్రంగా విమర్శల దాడి చేస్తున్నారు. ఆ క్రమంలోనే తాజాగా ఆమె  మరోసారి వైఎస్ రాజకీయ వారసురాలిని తానే నని ప్రకటించుకున్నారు. ప్రధాని మోడీతో జగన్ సంబంధాలు కొనసాగుతున్నాయన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను తుంగలోకి తొక్కి జగన్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.  జగన్ బీజేపీతో  అంటకాగుతూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి వారసుడినని ఎలా చెప్పుకుంటారని నిలదీశారు. రాజశేఖర్ రెడ్డి వారసుల్లో బీజేపీని వ్యతిరేకిస్తుంది తాను మాత్రమే అని చెప్పారు. ఈ రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక విధానాలపై పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని షర్మిల స్పష్టం చేశారు. మొత్తంగా వైఎస్ వారసత్వ పోరులో జగన్ ను వెనక్కు నెట్టి షర్మిల ముందుకు వచ్చారని చెప్పకతప్పదు. అధికారంలో ఉండగా వైఎస్ బ్రాండ్ ను వదిలించుకుని సొంత బ్రాండ్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించిన జగన్.. ఓటమి తరువాత మళ్లీ వైఎస్ పేరు జపిస్తుండటం సహజంగానే జనంలో ఆయనను చులకన చేసింది. దీంతో షర్మిల వైపునకే వైఎస్ అభిమానులు మొగ్గు చూపుతున్నారు. 

By
en-us Political News

  
తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.
అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు.
ఆదివారం తన 53వ పుట్టిన రోజు జరుపుకున్న జగన్ కు చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిల తదితరులు సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు ప్రతిగా జగన్ కూడా ఒక్క మంత్రి లోకేష్ కు తప్ప మిగిలిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి దయనీయంగా మారిందన్న ఆయన గత పదేళ్ల అధికార గర్వంతో విర్రవీగిన నేతల కండలు ఇప్పుడు కరిగిపోయాయని ఎద్దేవా చేశారు.
రాజకీయ ప్రత్యర్థులే కాదు.. ప్రభుత్వ విధానాలు సరిగా లేవన్న సామాన్యులపై కూడా జగన్ పాలనలో దాడులు జరిగాయి. ఇక అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలూ సరే సరి. సరే జనం విషయం గుర్తించి 2019లో తాము కట్టబెట్టిన అధికారాన్ని 2024 ఎన్నికలలో లాగేసుకుని అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ చంద్రబాబుకు అప్పగించారు.
చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు.
ఆదివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ తెలపడంలోనూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చెల్లెలిగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ గారికి అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
సోషల్ మీడియాలో జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద వెలసిన ఓ భారీ కటౌట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు.
భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అన్న విజయసాయి.. అటువంటి దేశంలో ఉంటూ.. బంగ్లాలో హిందువులు లక్ష్యంగా సాగుతున్న దాడులపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ దాడులకు ఖండించని వారు దేశ భక్తులే కాదని విజయసాయి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కోర్టుకు వెడదామా? అంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ జీవోలోనే స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్లడం ఎలా అన్నది అర్ధం కాక వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు.
తాను ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసిన తొలి సారే పరాజయం పాలైన సంగతిని గుర్తు చేసుకున్న ఆయన, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని, ఓడిన చోటే గెలవాలన్న పట్లుదలతో పని చేసి ఫలితం సాధించానని లోకేష్ వివరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.