Publish Date:Oct 17, 2022
సినిమాలకు మించిన ట్విస్టులు రాజకీయాలకు మంచిన ప్రకటనలు క్రికెట్లో జరిగిపోతున్నాయి. భారత్ పేసర్ మహమ్మద్ షమీ ఫిట్నెస్ కారణంగా జట్టులో ఉంటాడా ఉండడా అన్న సందేహాలు పెరిగిపోయా యి. అతని స్థానంలో మరో యువ పేసర్కి ఛాన్స్ ఇవ్వాలనే జట్టు కెప్టెన్తో సహా అంటూ వచ్చారు. అందు కు బోర్డు నిర్ణయం కూడా జోడయింది. కానీ ఎట్టకేలకు షమ్మీని టీ.20 ప్రపంచకప్కి ఆస్ట్రేలియాకి పంపారు. అయినా చాలమంది అతని ఫిట్నెస్ మీద అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నా రు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాడు షమీ. సోమవారం ఆసీస్తో తలపడిన వామప్ మ్యాచ్లో చివరి 20వ ఓవర్లో వచ్చి ఏకంగా నాలుగు వికెట్లు తీసుకుని ఆసీస్ని, భారత్ క్రికెట్ వీరాభిమానులను ఎంతో ఆశ్చర్యపరిచాడు.
ఎలా సాధ్యం.. ఏదయినా ఏ క్షణాన్నయినా జరగవచ్చనడానికి ఇదో పెద్ద ఉదాహరణ. కె.ఎల్. రాహుల్ (57), సూర్యకుమార్ యాదవ్ (50) ధనాధన్ బ్యాటింగ్ చేసి అర్ధసెంచరీలతో ఆసీస్కి చుక్కలు చూపించా రు. వారి బ్యాటింగ్ ధాటితో భారత్ 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఆసీస్ కూడా బాగానే ఆడింది. కానీ వారి ఆశలు చివరి ఓవర్లోనే దెబ్బతిన్నాయి. అదీ షమీ రాకతో. అప్పటివరకూ కేవలం ఫీల్డర్గానే కనపడు తున్న షమీకి బంతి ఎప్పుడిస్తాడని అందరూ కెప్టెన్ని తిట్టుకునే ఉంటారు. కానీ ఊహించని విధంగా పరి స్థితులు బేరీజు వేసి లాభంలేదనుకున్నాడో ఏమో చివరి 20వ ఓవర్లో షమీకి బంతి ఇచ్చారు.
జులై తర్వాత మళ్లీ టీమ్ ఇండియాకి ఆడటం ఇదే మొదలు. కోవిడ్తోనూ, ఫిట్నెస్ సమస్యలతోనూ జట్టు కు షమీ దూరమయ్యాడు. కానీ వాటిని అధిగమించి జట్టులోకి వచ్చినా అంత ప్రతిభను తిరిగి ప్రదర్శి స్తాడా అన్న అనుమానం అందరికీ ఉంది. కానీ ఇక్కడ ఈ వామప్ మ్యాచ్లో అతని సామర్ధ్యం అనుమానా లను పటాపంచలు చేసింది. యార్కర్లతో ఆసీస్ బ్యాటర్లను పెవిలియన్ దారి పట్టించడంలో గొప్ప నైపు ణ్యమే ప్రదర్శించాడు. మొదటి రెండు బంతులకీ రెండేసి పరుగులు ఇచ్చి తర్వాత నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీశాడు.
ఈ మ్యాచ్లో మరో అద్భుతం కింగ్ కోహ్లీ సూపర్ క్యాచ్. పాట్ కమిన్స్ సిక్స్ కొట్టానని తెగ సంతోషపడు తు న్న తరుణంలోనే ఆ సంతోషం ఆ క్షణంలోనే తొలగిపోయింది. కింగ్ బౌండరీ లైన్లో గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్ పట్టి కమిన్స్ పెవిలియన్ దారి పట్టించాడు. అతని ఆ ఫీట్ కి కెప్టెన్ తో పాటు ప్రేక్షకులూ ఫిదా అయ్యారు. మరి కింగ్ కోహ్లీనా మజాకా.. అన్నారంతా!
టోర్నీలో ఆరంభమ్యచ్ ఈ నెల 23న భారత్ పాకిస్తాన్ తలపడతాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/shammi-wizardness-stuns-cricket-fans-39-145585.html
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్స్టార్ రజనీకాంత్తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.