బీఆర్ఎస్ పనైపోయినట్లేనా? సీనియర్ల వలసల సంకేతం అదేనా?

Publish Date:Mar 28, 2024

Advertisement

అధికారంలో ఉన్న ప‌దేళ్ల పాటు తెలంగాణ రాజ‌కీయాల‌ను కంటిచూపుతో శాసించిన బీఆర్ ఎస్ అధినేత‌ కేసీఆర్‌..  అధికారం కోల్పోయిన త‌రువాత  పార్టీ లీడర్లు, క్యాడ‌ర్ ను కాపాడుకోలేక చతికిల పడిపోతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ఒక్కొక్క‌రుగా బీఆర్ ఎస్ పార్టీని వీడుతుండ‌టంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.  ద్వితీయ శ్రేణి నేత‌ల నుంచి సీనియ‌ర్ల వ‌ర‌కు బీఆర్ ఎస్ కు గుడ్‌బై చెప్పేస్తున్నారు.

తాజాగా కేసీఆర్‌కు ద‌గ్గ‌ర వ్య‌క్తులుగా పేరున్న నేత‌లు సైతం బీఆర్ ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ పార్టీ నుంచి బ‌రిలో నిలిపేందుకు అభ్య‌ర్థులు సైతం క‌రువైన ప‌రిస్థితి. సిట్టింగ్ ఎంపీలు అనేక మంది బీఆర్ ఎస్ ను వీడి కాంగ్రెస్‌, బీజేపీల్లో చేర‌డంతో బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో కొత్త వారిని బ‌రిలో నిల‌పాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. మ‌రోవైపు వ‌రంగ‌ల్ ఎంపీ అభ్య‌ర్థిగా మాజీ మంత్రి, బీఆర్ ఎస్ ఎమ్మెల్యే క‌డియం శ్రీ‌హ‌రి కుమార్తెకు కేసీఆర్ టికెట్ ఇచ్చారు. ప్ర‌స్తుతం, ఆమె పోటీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డంతో పాటు తన తండ్రి క‌డియం శ్రీ‌హ‌రితో స‌హా   కాంగ్రెస్ గూటికి చేరడానికి రెడీ అయిపోయారు.  శుక్రవారం (మార్చి 29) వీరిరువురూ  హస్తినలో ఢిల్లీ పెద్దలను కలిసి హస్తం కండువా కప్పుకోనున్నారు. కడియం కావ్యను కాంగ్రెస్ వరంగల్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నారు. అలాగే  కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన  కే. కేశ‌వ‌రావుసైతం బీఆర్ ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారు.

రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి బీఆర్ ఎస్ ప‌దేళ్ల పాల‌న‌లో జ‌రిగిన అవినీతి అక్ర‌మాల‌పై గురిపెట్టారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవినీతి, గొర్రెల పంపిణీ ప‌థ‌కంతో  సహా ప‌లు ప‌థ‌కాల్లో అక్ర‌మాల‌ను వెలుగులోకి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల‌ను  కుదిపేస్తోంది. కేసీఆర్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ కోసం ప్ర‌త్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేసి మరీ రేవంత్ రెడ్డితో పాటు ప‌లువురు ప్ర‌తిప‌క్ష పార్టీల్లోని ముఖ్య‌నేత‌ల‌ ఫోన్ల‌ను ట్యాప్ చేసిన‌ట్లు  స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రణీత్ రావుతో పాటు ప‌లువురు పోలీస్ అధికారుల అరెస్టుతో ఫోన్ ట్యాపింగ్ డొంక క‌దులుతోంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం బీఆర్ ఎస్ ముఖ్య‌నేత‌ల మెడ‌కు చుట్టుకునే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయన్న అంచనాలతో  ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. దీంతో బీఆర్ ఎస్ పార్టీలో కొన‌సాగితే రాజ‌కీయ  మ‌నుగ‌డ క‌ష్ట‌మ‌ని భావిస్తున్నకొంద‌రు ముఖ్య‌నేత‌లు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

నేత‌లు పార్టీ మార‌కుండా కేసీఆర్‌, కేటీఆర్ లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నా ఫ‌లితం క‌నిపించ‌డం లేదు. ప్ర‌స్తుతం జ‌రిగే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ పార్టీ క‌నీస స్థానాలలో కూడా విజయం సాధించడం అనుమానంగానే కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతే కాకుండా పార్టీ నుంచి వలసలు కూడా రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు.

ముఖ్యంగా లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ ఎస్ సీనియ‌ర్ నేత‌లుగా, కేసీఆర్ కు సన్నిహితులుగా పేరొందిన కే. కేశ‌వ‌రావు, క‌డియం శ్రీ‌హ‌రి లాంటి వారు పార్టీని వీడేందుకు సిద్ధ‌మ‌య్యార‌న్న వార్త‌ల‌తో బీఆర్ ఎస్ శ్రేణుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. వరంగల్ లోక్ సభ నుంచి బీఆర్ ఎస్ అభ్య‌ర్థిగా క‌డియం శ్రీ‌హ‌రి కుమార్తె కావ్య‌కు కేసీఆర్ టికెట్ ఇచ్చారు. ఇటీవ‌ల ఆమె కేసీఆర్ ను క‌లిసి ఆశీర్వాదం సైతం తీసుకున్నారు. కానీ  అనూహ్యంగా ఆమె పోటీ నుంచి విరమించుకుంటున్నానని   లేఖ విడుద‌ల చేయ‌డం బీఆర్ ఎస్ శ్రేణుల‌ను అయోమ‌యానికి గురిచేస్తోంది.  బీఆర్ఎస్ పై అవినీతి, భూకబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో పోటీ నుండి తప్పుకుంటున్నట్లు  కావ్య‌ తన లేఖలో వివరించారు. జిల్లాలో నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని లేఖలో ప్రస్తావించారు. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ నుండి విరమించుకుంటున్నట్లు లేఖలో   పేర్కొన్నారు.

అయితే  కడియం శ్రీహరి, కడియం కావ్య ఇద్ద‌రూ కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే శ్రీ‌హ‌రితో కాంగ్రెస్ ముఖ్య‌నేత‌లు ప‌లు ద‌ఫాలుగా భేటీ అయిన‌ట్లు స‌మాచారం.  వారం రోజుల క్రిత‌మే శ్రీ‌హ‌రి బీఆర్ ఎస్ ను వీడుతున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఆయ‌న కుమార్తె కావ్య‌కు ఎంపీ టికెట్ ఇవ్వ‌డంతో వారు బీఆర్ ఎస్ లోనే కొన‌సాగుతున్నార‌ని అంద‌రూ భావించారు. కానీ, ఊహించ‌ని రీతిలో కావ్య పోటీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌ట‌కించ‌డం రాష్ట్ర రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే, ఆమె కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్నారని వార్తలు వస్తున్నాయి.

బీఆర్ఎస్ సీనియర్ నేత కే.కేశవరావుసైతం బీఆర్ ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధ‌మ‌య్యారు.    గురువారం (మార్చి 28) కేసీఆర్ తో భేటీ అయిన కే. కేశవరావు పార్టీని వీడుతున్న‌ట్లు చెప్పిన‌ట్లు స‌మాచారం. దీంతో కేకే తీరుపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. నీ ఫ్యామిలీకి పార్టీ ఏం తక్కువ చేసింది? అంటూ కేకేపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే  కేశ‌వ‌రావు మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారని అంటున్నారు. ఇప్ప‌టికే కేశ‌వ‌రావు కుమార్తె, హైద‌రాబాద్ మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మీ శనివారం (మార్చి 30) కాంగ్రెస్ పార్టీ కండువా క‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆమెతోపాటు అదేరో జు కేశ‌వ‌రావు కూడా కాంగ్రెస్ కండువా క‌ప్పుకుంటార‌ని తెలుస్తోంది. కేశ‌వ‌రావుతో పాటు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, మ‌రికొంద‌రు బీఆర్ ఎస్ నేత‌లు కాంగ్రెస్  గూటికి చేరనున్నట్లు స‌మాచారం. మొత్తానికి అధికారం కోల్పోయిన కొద్ది నెల‌ల్లోనే బీఆర్ ఎస్ పార్టీని వీడుతున్న నేత‌ల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండ‌టంతో  బీఆర్ఎస్ ఖాళీ అయ్యేందుకు ఎక్కువ కాలం పట్టదని అంటున్నారు. 

By
en-us Political News

  
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
బెంగాల్ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1969లో కేవలం 70 శాతంగా ఉన్న ఓటింగ్, 1987 నాటికి 78 శాతానికి చేరింది. ఆ తర్వాత 1996లో 80 శాతం, 2011లో 84 శాతంగా నమోదైంది. గత 2021 ఎన్నికల్లో 82 శాతానికి పరిమితమైన ఓటింగ్.. ఇప్పుడు 2026లో ఏకంగా 92 శాతాన్ని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జగిత్యాల వేదికగా జరిగిన సభ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ చరిత్రను పరిశీలిస్తే నాదెండ్ల భాస్కరరావుకు, చంద్రబాబు నాయుడుకు మధ్య సుదీర్ఘమైన రాజకీయ వైరం ఉంది. 1984లో ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలు, ఆపై నాదెండ్ల ముఖ్యమంత్రి కావడం వంటి సంఘటనలు తెలుగు రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.
న్టీఆర్ అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకుని తిరిగి వచ్చేలోపు, నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ చెల్లాచెదురు కాకుండా, ఎమ్మెల్యేలను ఏకం చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. పార్టీని కాపాడిన రక్షకుడి ఇమేజ్ ఆయనకు అప్పుడే వచ్చింది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిథి స్టాలిన్, టీవీకే అధినేత విజయ్, బీజేపీ నాయకురాలు ఖుష్బు, కమల్ హాసన్, రజనీకాంత్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని చంద్రబాబు స్వాగతిస్తూనే.. ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చే ఎవరినైనా ఆహ్వానించాల్సిందేనన్నారు. అయితే సినిమాల్లో ఉన్న ఇమేజ్ రాజకీయాల్లో రాణించడానికి సరిపోదనీ, రాజకీయాలలో పట్టుదల, సహనం చాలా ముఖ్యమన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చారు.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ పరిస్థితిని గమనిస్తే నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పార్టీలో కీలక నేతలు ఉన్నప్పటికీ, వారంతా సమష్టిగా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చంద్రంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ కేడర్‌ అయోమయంలో పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జ్‌గా కన్నబాబు నియామకం తరువాత స్థానిక నేతల నుంచి ఆయనకు ఏ మాత్రం సహకారం అందడం లేదు.
నాదెండ్ల భాస్కరరావు 1935 జూన్ 23న పిచ్చయ్య, వెంకాయమ్మ దంపతులకు గుంటూరు జిల్లా తెనాలి డివిజన్‌లోని దోసేపూడి గ్రామంలో జన్మించారు.
తమిళనాడులో ఎన్డీయేకు పట్టం కట్టండి.. చెన్నైలో సీఎం చంద్రబాబు పిలుపు
మునీర్‌కు ఇరాన్ అగ్రశ్రేణి సైనిక వర్గాలతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఒకవైపు చర్చలకు సహకరిస్తాయని భావిస్తున్నా.. అదే సమయంలో ఆయన విశ్వసనీయతపై అమెరికా నిఘా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మధ్యవర్తిత్వం పేరుతో ఆయన అమెరికా ప్రయోజనాలకు గండి కొట్టేలా వ్యవహరిస్తారా అన్న సందేహాలు వ్యక్తం అవ్వడమే కాకుండా, ఆ దిశగా హెచ్చరికలు సైతం జారీ అవుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.