Publish Date:Nov 29, 2019
టీఆర్ఎస్ పార్టీ రెండో సారి అధికారంలోకి వచ్చాక చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రి పదవులు ఆశించారు. క్యాబినెట్ లో 17 మందికి మాత్రమే చోటు ఉండడంతో కేవలం కొద్ది మందికే అదృష్టం దక్కింది. పదవులు ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పోస్టులు ఇస్తామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు వారంతా చెప్పుకొచ్చారు. ఆ తరుణం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయంలోనే ఇటీవల కొన్ని కీలక పదవులను భర్తీ చేసింది గులాబీ పార్టీ అధిష్టానం. అయితే ఆ పదవులు కూడా దక్కక పోవడంతో కొందరు ఎమ్మెల్యేలు నిరాశకు గురైయ్యారని అధికార పార్టీలో చర్చ జరుగుతోంది.
ఇటీవల రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని నియమించారు సీఎం కేసీఆర్. అయితే మంత్రివర్గంలో చోటు ఆశించి భంగపడ్డ నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే బాజిరెడ్డికి కీలక పదవి ఇస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. గుత్తా సుఖేందర్ రెడ్డికి మండలి చైర్మన్ పదవి ఇవ్వడంతో ఆయన నిర్వహించిన రైతు సమన్వయ సమితి పగ్గాలు బాజిరెడ్డికి ఇస్తామని కేటీఆర్ చెప్పినట్లు సమాచారం. దీంతో బాజిరెడ్డి సైతం ఆ పదవి తనకే వస్తుందన్న ఆశతో మానసికంగా సిద్ధమైపోయారు. కాని ఆ పదవిని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి కట్టబెట్టడంతో బాజిరెడ్డి నిరాశకు గురైనట్లు తెలుస్తోంది.
ఇదే పరిస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి ఎదురైంది. ఆయనకు శాట్స్ ఛైర్మన్ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే గతంలో ఆ పదవిని నిర్వహించిన వెంకటేశ్వరెడ్డికే దాన్ని రెన్యువల్ చేశారు కేసీఆర్. దీంతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. చాలా మంది ఎమ్మెల్యేలు తమకు కీలక పదవులు వస్తాయని ఆశించినా ఫలితం లేకుండా పోయింది. తమ ఆశలకు గండి పడుతుండడంతో సన్నిహితులు.. అనుచరుల వద్ద వారి గోడు వెళ్లబోసుకుంటున్నారు.
పార్టీ ఎమ్మెల్యేలకు కొంతమంది ముఖ్యనేతలకు కేటీఆర్ పదవులిస్తామని చెబుతుంటే కేసీఆర్ మాత్రం తన జాబితాలో ఉన్న వారికే పదవులు కట్టబెడుతున్నారంటూ అధికార టీఆర్ఎస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. కేటీఆర్ ఇచ్చిన మాట అమలు కాకపోవడం హామీ పొందిన నేతలను కలవరానికి గురి చేస్తోంది. ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన నేతలకూ ఏదో ఒక పదవి కట్టబెడతామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇక కొన్ని బహిరంగ సభల్లో కేసీఆర్ సైతం హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ గానూ, కార్పొరేషన్ చైర్మన్ లు గానూ అవకాశం కల్పిస్తామని చెప్పారు. దీంతో వారంతా పదవుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కానీ ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలతో చాలా మంది నేతలు పదవులు దక్కుతాయో లేదోనన్న బెంగతో ఉన్నట్టు తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/senior-trs-leaders-unhappy-with-kcr-decisions-39-91754.html
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.