పదవుల కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్న టీఆర్ఎస్ నాయకులు

Publish Date:Nov 1, 2019

Advertisement

 

ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్ అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ తరువాత ఇతర పార్టీల నుంచి పలువురు నాయకులు వలస వచ్చి గులాబీ గూటికి చేరారు. వీరందరూ తమకు ఏదో ఒక రూపంలో అవకాశం వస్తుందన్న విశ్వాసంతో టీఆర్ఎస్ లోకి వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీలోకి వచ్చిన గజ్వేల్ నియోజక వర్గ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డికి ఇటీవలే కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. దీంతో మళ్లీ పదవుల పంపకంపై చర్చ మొదలైంది. ఒక వైపు పలు కార్పొరేషన్ చైర్మన్ ల పదవీ కాలం కూడా ముగియడంతో ఆశావహులు తమకు వీటిలో ఏదో ఒకటి దక్కకపోతుందా అన్న ఆశతో ఉన్నారు. ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వారు, మంత్రి పదవులు ఆశించి దక్కని వారు కూడా తమకు ఏదో ఒక అవకాశం ఇస్తారన్న నమ్మకంతో ఉన్నారు. సెప్టెంబరులో మంత్రి వర్గ విస్తరణ సమయంలో సీనియర్ నాయకులకు పదవులు ఇస్తామని ప్రకటించారు కేసీఆర్ . ఆ ఎఫెక్ట్ తో దసరాకు పదవుల పంపకం ఉంటుందని ఆశించారు ఆశావహులు. హుజూర్ నగర్ భై ఎలక్షన్స్ రావటంతో టీఆర్ఎస్ పెద్దలంతా వాటిపై దృష్టి పెట్టారు. దీనితో పదవుల పంపకం జరగలేదు. 

ఇప్పుడు కూడా మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశాలున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం ఇందుకు సంబంధించిన కసరత్తు కూడా మొదలు పెట్టింది. ఇటువంటి పరిస్థితుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీ తిరిగి కొంత ఆలస్యం అవుతుందేమోనన్న అనుమానాలు ఆశావహుల్లో వ్యక్తమవుతున్నాయి. నామినేటెడ్ పోస్టుల పదవీ కాలం ముగిసిన ఒకరిద్దరు చైర్మన్ లకు మరోసారి అవకాశం దక్కింది.ఇప్పటికే కార్పొరేషన్ చైర్మెన్ లుగా ఉండి పదవీ కాలం పూర్తయిన వారు కూడా తమకు ఇంకోసారి అవకాశం ఉంటుందా అని లెక్కలు వేసుకుంటున్నారు. మొత్తంగా టిఆర్ఎస్ లో నామినేటెడ్ పదవులు రాని వారు, పదవులు వచ్చి కాల పరిమితి ముగిసిన వారు తమ భవిష్యత్తు ఏంటా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మునిసిపల్ ఎన్నికల తరువాత పదవుల పంపకం ఉంటుందా లేక వాటితో సంబంధం లేకుండా పదవుల భర్తీ చేస్తారా అన్నది చూడాల్సి ఉంటుంది.
 

By
en-us Political News

  
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.