మాకొద్దు దొరా.. తెలంగాణ సీఎస్ పదవిపై వెనకడుగు వేస్తున్న ఐఏఎస్ అధికారులు

Publish Date:Dec 18, 2019

Advertisement

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కె జోషి ఈ నెల ( డిసెంబర్ ) 31వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు చాలా ముఖ్యమైనది. కాబట్టి ఇప్పట్నుంచే అధికారుల గురించి సర్కారు పెద్దలు ఆరా తీయడం ఆ పదవి గురించి ఐఏఎస్ లు చర్చించుకోవడం సహజంగానే జరుగుతుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి కోసం సీఎం కేసీఆర్ 14 మంది పేర్లను పరిశీలిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే వారిలో చాలా మంది అయిష్టం గానే ఉన్నట్టు తెలిసింది. గతంలో ఈ పోస్టు కోసం రెండు మూడు నెలలకు ముందే సీనియర్ ఐఏఎస్ అధికారులు క్యూ కట్టేవారు. తమ సీనియారిటీ ధ్రువపత్రాలని ప్రభుత్వానికి సమర్పించేవారు. తమకే అవకాశం కల్పించాలంటూ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసే వారు. ఎవరికి వారు తమ తమ స్థాయిలో ప్రయత్నాలు చేసేవారు. సీనియార్టీ ప్రకారం సీఎస్ పోస్టు దక్కకుంటే ట్రిబ్యునళ్లను సైతం ఆశ్రయించి దాని సాధించే అంత పోటీ ఉండేది. అయితే ఇప్పుడు అంతగా ఎవరూ ఆసక్తి చూపడం లేదని చెపుతున్నారు.

అనేక సమస్యలు ఇబ్బందులు ఉన్నప్పుడు సిఎస్ పదవి ఎందుకని కొందరు ఐఎఎస్ లు అనుకుంటున్నారు. సిఎస్ కు ఉన్న అధికారాల విషయంలోను ప్రభుత్వం బ్రేక్ వేయడం ప్రధాన కారణంగా చెబుతున్నారు. సిఎస్ పరిధిలో ఉన్న అధికారాల అంశాల్లో కూడా సీఎంఓ జోక్యం చేసుకుంటోందనే భావన ఉంది. సచివాలయం లేకపోవటం అరాకొర వసతులు ఉన్న బిఆర్ కె భవన్ కు వెళ్లడానికి అయిష్టత లాంటి కారణాల వల్ల కూడా అనాసక్తితో ఉన్నట్టు తెలిసింది. ప్రధానంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆయా శాఖల సమీక్షలు సమావేశాలకు కూడా ముఖ్యమంత్రి సీఎస్ ను ఆహ్వనించకపోవడం పట్ల వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సీఎస్ కు ఉన్న అధికారాలని ప్రశ్నార్థకం చేస్తున్న తరుణంలో ఆ పోస్టు తీసుకోవడం ఎందుకు ఆ తరువాత ఆపసోపాలు పడటం ఎందుకని ఐఏఎస్ లు లైట్ తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది.

By
en-us Political News

  
సోషల్ మీడియాలో జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద వెలసిన ఓ భారీ కటౌట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు.
భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అన్న విజయసాయి.. అటువంటి దేశంలో ఉంటూ.. బంగ్లాలో హిందువులు లక్ష్యంగా సాగుతున్న దాడులపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ దాడులకు ఖండించని వారు దేశ భక్తులే కాదని విజయసాయి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కోర్టుకు వెడదామా? అంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ జీవోలోనే స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్లడం ఎలా అన్నది అర్ధం కాక వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు.
తాను ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసిన తొలి సారే పరాజయం పాలైన సంగతిని గుర్తు చేసుకున్న ఆయన, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని, ఓడిన చోటే గెలవాలన్న పట్లుదలతో పని చేసి ఫలితం సాధించానని లోకేష్ వివరించారు.
ఆ సందర్భంగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు.. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గాన్ని మంగళగిరికి దీటుగా అభివృద్ధి చేస్తానన్నారు.
పార్టీ అధినేత కేసీఆర్ త‌ర్వాత అంత‌టి వాడిగా.. ఆయన పొలిటిక్ వారసుడిగా కేటీఆర్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన ఏ ఎన్నికలోనూ పార్టీ విజయాన్ని నమోదు చేసింది లేదు.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో నంబర్ 1, 2, 3 అంటూ హైరాక్కీని బట్టి చూస్తే లోకేష్ మూడో స్థానంలో ఉన్నారు. జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తరువాత రెండో స్థానంలో ఉన్నారని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ హైరాక్కీని దాటి త్వ‌ర‌లో లోకేష్ కి ముఖ్య‌మంత్రి ప‌ద‌విని అప్ప‌గించేందుకు గ్రౌండ్ వర్క్ జరుగుతోందా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి.
లోక్ సభలో కాంగ్రెస్ సంఖ్యా బలం 400కు మించి ఉన్న సందర్భాలు ఉన్నాయి. కానీ అప్పుడెవ‌రూ కాంగెస్ ని ఓట్ చోరీ అంటూ ఎగ‌తాళి చేయ‌లేదు. ఎవ‌రి క‌ష్టం వారు ప‌డుతూ.. ప్ర‌జ‌ల్ని మెప్పించే ప‌ని మాత్ర‌మే చేస్తూ వ‌చ్చేవార‌మ‌ని తాజాగా మాజీ ప్ర‌ధాని దేవెగౌడ‌ వ్యాఖ్యానించారు.
అసలింతకీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఒక్క చంద్రబాబు కాదు, కేంద్ర ప్రభుత్వం సహా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ అనుసరిస్తున్నాయి. ఈ పీపీపీ విధానం వల్ల ఎటువంటి నష్టం లేదని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. ఎవరెంతగా చెప్పినా జగన్ మాత్రం తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లు వ్యవహరిస్తున్నారు.
పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించిన అధికారులను అభినందించిన ఆయన ఈ ఎన్నికలలో పార్టీ విజయం కోసం కష్టపడిన కార్యకర్తలకు, అలాగే పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ణతలు తెలిపారు.
ఈ పథకంలో ఉన్న లోపాలన సవరించి రాష్ట్రాల బాధ్యతను మరింత పెంచి పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా చెబుతోంది. అయితే కాంగ్రెస్ మాత్రం మోడీ సర్కార్ ఉద్దేశాలను తప్పుపడుతోంది.
బీజేపీ ఉనికి రాష్ట్రంలో నామమాత్రంగానే మిగిలిందని ఈ ఎన్నికల ఫలితాలు తేల్చాయి. అవన్నీ పక్కన పెడితే ఈ పంచాయతీ ఎన్నికల మూడో విడతలో ఓ ఆసక్తికర విషయంపై తెలుగు రాష్ట్రాలలో చర్చ మొదలైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.