జగన్ తప్పు చేస్తున్నారా.. అవినీతి మరకలు వచ్చి చేరుతున్నాయా?

Publish Date:May 29, 2019

Advertisement

 

వైసీపీ అధినేత జగన్ గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. కొద్దినెలల జైల్లో కూడా ఉన్నారు. ఆయనతో పాటు కొందరు అధికారులు కూడా జైలు పాలయ్యారు. అయితే జగన్ అధైర్యపడలేదు. తనని అన్యాయంగా జైల్లో పెట్టారని ప్రజల్లోకి వెళ్లారు. 2014 ఎన్నికల్లో అడుగు దూరంలో అధికారానికి దూరమయ్యారు. అయినా జగన్ ప్రజల్లో ఉండడానికే ప్రయత్నించారు. జగన్ పై ప్రజల్లో నమ్మకం పెరిగింది. 2019 ఎన్నికల్లో వైసీపీకి బ్రహ్మరథం పట్టారు. జగన్ ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం కూడా చేయబోతున్నారు. ఇప్పటికే జగన్ 6 నెలల్లో మంచి సీఎంగా పేరు తెచ్చుకుంటానని.. ఎన్నికల్లో విజయానంతరం ప్రకటించారు. అయితే జగన్ సీఎంగా మంచి పేరు తెచ్చుకోవడానికి కన్నా ముందే పాత అవినీతి ఆరోపణల మరకలు వచ్చి చేరి ఆయన ఇమేజ్ ను దెబ్బ తీసేలా ఉన్నాయి.

అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయన చుట్టూ ఉన్న అధికారులు నెమ్మదిగా మళ్ళీ జగన్ చుట్టూ చేరుతున్నారు. వారు ప్రస్తుతం తెలంగాణలో పని చేస్తున్నా ఏపీ కేడర్ కు బదిలీ కావడానికి డిప్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. వీరిలో కొందరు జగన్ అవినీతి కేసులలో నిందితులు కూడా ఉన్నారు. గనుల కేటాయింపు విషయంలో ఆరోపణలు ఎదురుకున్న అప్పటి ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి ప్రస్తుతం తెలంగాణలో విధులు నిర్వహిస్తూ, ఏపీ కేడర్ కు బదిలీ కావడానికి డిప్యుటేషన్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే దీనివల్ల జగన్ పై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని, అదే జరిగితే అంతా బాగుందనుకున్న టైంలో ఆయన అనవసరంగా చెడ్డ పేరు తెచ్చుకున్నట్లు అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సరైన పాలనతో గతంలో తన మీద ఉన్న మచ్చలు తుడుచుకునే ప్రయత్నం చెయ్యాల్సింది పోయి మళ్ళీ వారినే తెచ్చి పెడితే అనవసరమైన వివాదాలకు కేంద్రబిందువు కావడమే అవుతోంది. మరి ఆరు నెలల్లో మంచి సీఎంగా పేరు తెచ్చుకుంటానంటున్న జగన్.. అవినీతి ఆరోపణలు ఉన్నవారిని దగ్గర చేర్చుకొని అనవసరంగా తలనొప్పులు తెచ్చుకుంటారో.. లేక అలాంటి వారిని దూరం పెట్టి ప్రజల నమ్మకాన్ని నిజం చేస్తూ మంచి పాలన అందిస్తారో చూద్దాం.

By
en-us Political News

  
ఇప్పటికే ఇదే కేసులో విజయసాయి రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారించింది. ఆ సిట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసినది. అయితే ఈడీ మాత్రం కేంద్ర పరిధిలోది. ఇక్కడే అంటే ఈడీ విజయసాయిని మద్యం కుంభకోణం కేసులో విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వడమే జగన్ కు ప్రమాదఘంటికలు మోగినట్లేనా అన్న అనుమానాలకు తావిస్తున్నాయి.
ఇప్పటికే గంటల తరబడి విజయ్ ను విచారించిన సీబీఐ మరో మారు ఈ నెల 19న విచారణకు రావాలని నోటీసులు పంపింది. అయితే ఈ వేధింపుల వెనుక ఉన్నది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీయేనని పరిశీలకులు అంటున్నారు.
తన కృషికి తగిన గుర్తింపు రాలేదన్న కినుకతో ఏబీవీ ఉన్నట్లు కనిపిస్తున్నారు.ఏపీ పోలీసు హౌసింగ్ బోర్డు చైర్మన్ పదవిని చేపట్టలేదు. జగన్ హయాంలో జరిగిన అవకతవకలపై విమర్శలతో పాటుగా, ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వ నిర్ణయాలనూ ప్రశ్నించడం ఆరంభించారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు రానున్న మునిసిపోల్స్ లో జనసేనతో తమ పార్టీకి ఎటువంటి పొత్తూ లేదంటూ ప్రకటించడం రాజకీయంగా కలకలం సృష్టించింది. బీజేపీ తెలంగాణ మునిసిపోల్స్ లో స్వతంత్రంగా పోటీ చేస్తుందని, జనసేన సహా ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవనీ కుండబద్దలు కొట్టేశారు.
రివ‌ర్ బేసిన్ లో రాజ‌ధాని నిర్మాణ‌మా అంటూ అమ‌రావ‌తిపై త‌న అక్క‌సు మొత్తాన్ని వెళ్ల‌గ‌క్కారు జ‌గ‌న్ మోహ‌న రెడ్డి.
సరిగ్గా మూడు దశాబ్దాల కిందట ఇదే కోనసీమలోని పాశర్లపూడి గ్రామంలో వచ్చిన బ్లోఅవుట్‌తో కోనసీమ ఉలిక్కిపడింది. అంతకు ముందు ప్రకృతి వైపరిత్యాలను మాత్రమే అనుభవించిన కోనసీమ ప్రజ మానవ తప్పిదం కారణంగా తీరని నష్టాన్ని చవి చూసింది. ఆ తరువాత కూడా బ్లో ఔట్ లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కోనసీమలోని ఇరుసుమండ గ్రామంలో బ్లోఔట్ సంభవించింది. వారం రోజులుగా మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి.
ఇంత స్పష్టంగా కవిత బీఆర్ఎస్ ను ఎండగట్టినా ఆ పార్టీ అగ్ర నేతలెవరూ ఇంత వరకూ నేరుగా స్పందించలేదు. అసలు కవిత విషయంలో ఎలా స్పందించాలో వారికి తెలియడం లేదని పరిశీలకులు అంటున్నారు. అయితే కవిత పై బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పూర్తి స్థాయిలో ప్రారంభమైతే రోజుకు సుమారు 300 విమానాలు ల్యాండింగ్, టేక్‌ఆఫ్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి. రెండు వైపుల నుంచీ ల్యాండింగ్, టేక్‌ఆఫ్ సదుపాయం ఉండటం ఈ విమానాశ్రయం ప్రత్యేకత. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎయిర్‌పోర్ట్‌ను తీర్చిదిద్దుతున్నారు.
కొండ‌గ‌ట్టు తెలంగాణాలో ఉన్న కోవెల అయినా.. ప‌వ‌న్ త‌న ప‌ర‌పతి ఉప‌యోగించి.. టీటీడీ నుంచి సుమారు 36 కోట్ల రూపాయ‌ల విరాళం ఇప్పించారు. ఈ మొత్తం ద్వారా.. భ‌క్తుల వ‌స‌తి కోసం 90 గ‌దుల ధ‌ర్మ‌శాల‌, ఆపై ధీక్ష విర‌మ‌ణకు వీలుగా ఉండేందుకు మ‌రో భ‌వ‌నం నిర్మాణానికి పవన్ స్వయంగా శంకుస్థాపన చేశారు.
సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తును ప్రత్యేక సిట్ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తు జగన్ సన్నిహితులనే కాదు జగన్ ను కూడా వణికిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల ప్రసాదాల తయారీలో నాణ్యతా లోపం అంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు, ప్రతిష్ఠకు పంగనామాలు పెట్టి మరీ యధేచ్ఛగా వ్యవహరించిన చరిత్ర వైసీపీ నేతలది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తిరుమలలో వారి హవాయే కొనసాగుతోంది. కూటమి సర్కార్ తీరు అయిన వాళ్లకి ఆకుల్లో.. అన్న చందంగా తయారైందంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలు పార్టీ ధిక్కార స్వరం వినిపించడం, ఆ పార్టీని అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. పరాజయాలు తమకు కొత్త కాదనీ, మళ్లీ పుంజుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, పరిశీలకులు మాత్రం ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీలు ఒక్కటొక్కటిగా జారిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది.
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.