Publish Date:Nov 12, 2025
ఒకే రోజు మూడు సారీలు. లారీల నిండా సారీలు. వారిలో టాప్ ప్లేస్ కి చెందిన సారీ చెప్పిన వారు.. మంత్రి కొండా సురేఖ. ఈమె గతంలో అంటే తాను మంత్రి అయిన తొలి రోజుల్లో నాగార్జున ఫ్యామిలీకి సంబంధించి ఒక అబాంఢం వేశారు. దీంతో నాగార్జున న్యాయాన్ని ఆశ్రయించారు కూడా. ఆపై సురేఖ మంత్రిపదవి ఊడిపోతుందేమో అన్నంతగా వ్యవహారం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే.. , బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటారే అలా వెంట్రుక వాసిలో అప్పట్లో వేటు నుంచి కొండా సురేఖ తప్పించుకున్నారు. ఆమె మంత్రిగా ఉండి కూడా ప్రభుత్వంలో తమను తొక్కేస్తున్నారని ఆరోపణలు గుప్పించి కూడా పదవిని భద్రంగా కాపాడుకోగలుగుతున్నారు. అది వేరే విషయం. అప్పటి నుంచీ కూడా సురేఖ సైలెంట్ మోడ్ లో కి వెళ్లిపోయానని అంటారు. తానేదైనా అంటే అది మరొకటిగా రూపాంతరం చెందుతోందని.. ఫీలయ్యి మీడియాతో మాట్లాడ్డమే మానేశానని చెప్పుకొచ్చారీ మధ్య ఒక మీడియా చిట్ చాట్ లో. ఇప్పుడు కూడా సురేఖ.. ట్వీట్ చేసి సరిపుచ్చారు తప్ప.. మీడియా ముందుకు రాకుండా జాగ్రత్త వహించారు చూశారా!? దటీజ్ కొండంత సారీల సురేఖ అంటే.
ఇక రెండో బిగ్గెస్ట్ సారీ ఆఫ్ ద ఏపీ విషయానికి వస్తే.. మాజీ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాశ్. ఒక సమయంలో షాడో సీఎం గా వ్యవహించారన్న పేరుండేది. అప్పట్లో ఇద్దరి పట్ల తాను ఎంతో దారుణంగా ప్రవర్తించాననీ ఆయన ఇప్పుడు తాజాగా పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఇంతకీ వారెవరో చూస్తే మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు, ఐఆర్ఎస్ జాస్తి కిషోర్ కుమార్. ఈ ఇద్దరి పట్ల తాను అలా వ్యవహరించి ఉండకుండా ఉండాల్సిందన్న కోణంలో ఆయన చేసిన ఒక వీడియో ప్రెజంటేషన్ ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. అప్పట్లో జగన్ ఏదంటే అది అన్న మాటకన్నా, ప్రవీణ్ ప్రకాశ్ ఏదంటే అదీ అన్న టాక్ వినిపించేది. ఒక దశలో ప్రవీణ్ ప్రకాశ్ మీద ఉపాధ్యాయులంతా కలసి కంప్లయింట్ చేశారంటే పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు. అలాంటి ప్రవీణ్ ప్రకాశ్ నుంచి సారీ.. అది కూడా ఇద్దరు ఉన్నతాధికారులకు అందింది.
ఒక మూడో సారీ.. నటుడు ప్రకాష్ రాజ్చెప్పారు. బేసిగ్గా ప్రకాష్ రాజ్ ఎంత అగ్రెసివ్ గా ఉంటారంటే.. జస్ట్ ఆస్కింగ్ పేరిట ఏకంగా ప్రధాన మంత్రినే ఏ ప్రశ్నలంటే ఆ ప్రశ్నలు అడిగే బాపతు. దేశంలో ఏ చిన్న విషయమైనా సరే ఆయన నిగ్గ దీసి అడుగు- ఈ సిగ్గులేని సమాజాన్ని అనే టైపు. అలాంటి ప్రకాశ్ రాజ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినందుకుగానూ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తనకే పాపం తెలీదంటే అది తప్పు అవుతుందని అన్నారు. అయితే.. తాను గతంలో చేసిన బెట్టింగ్ యాప్ ప్రచారానికిగానూ సారీ చెబుతున్నా! అంటూ మీడియా ముఖంగా చెప్పారు. దీంతో ఒకే రోజు ముగ్గురు ప్రముఖుల నుంచి మూడు సారీలు వెలువడ్డంతో ఇదో సరికొత్త రికార్డు సృష్టించింది. వీరంతా మామూలోళ్లు కారు. అలాంటి మొండి- జగమొండి ఘటాల నుంచి ఇలాంటి క్షమాపణల పర్వం ఈ సమాజం చూస్తుందనుకోలేదు. కాబట్టే ఇంత ఎగ్జయిట్ మెంట్. ఇందులో ఏదైనా తప్పుంటే సారీయే..!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/selebrities-sorry-25-209428.html
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.