Publish Date:Nov 12, 2025
ఒకే రోజు మూడు సారీలు. లారీల నిండా సారీలు. వారిలో టాప్ ప్లేస్ కి చెందిన సారీ చెప్పిన వారు.. మంత్రి కొండా సురేఖ. ఈమె గతంలో అంటే తాను మంత్రి అయిన తొలి రోజుల్లో నాగార్జున ఫ్యామిలీకి సంబంధించి ఒక అబాంఢం వేశారు. దీంతో నాగార్జున న్యాయాన్ని ఆశ్రయించారు కూడా. ఆపై సురేఖ మంత్రిపదవి ఊడిపోతుందేమో అన్నంతగా వ్యవహారం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే.. , బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటారే అలా వెంట్రుక వాసిలో అప్పట్లో వేటు నుంచి కొండా సురేఖ తప్పించుకున్నారు. ఆమె మంత్రిగా ఉండి కూడా ప్రభుత్వంలో తమను తొక్కేస్తున్నారని ఆరోపణలు గుప్పించి కూడా పదవిని భద్రంగా కాపాడుకోగలుగుతున్నారు. అది వేరే విషయం. అప్పటి నుంచీ కూడా సురేఖ సైలెంట్ మోడ్ లో కి వెళ్లిపోయానని అంటారు. తానేదైనా అంటే అది మరొకటిగా రూపాంతరం చెందుతోందని.. ఫీలయ్యి మీడియాతో మాట్లాడ్డమే మానేశానని చెప్పుకొచ్చారీ మధ్య ఒక మీడియా చిట్ చాట్ లో. ఇప్పుడు కూడా సురేఖ.. ట్వీట్ చేసి సరిపుచ్చారు తప్ప.. మీడియా ముందుకు రాకుండా జాగ్రత్త వహించారు చూశారా!? దటీజ్ కొండంత సారీల సురేఖ అంటే.
ఇక రెండో బిగ్గెస్ట్ సారీ ఆఫ్ ద ఏపీ విషయానికి వస్తే.. మాజీ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాశ్. ఒక సమయంలో షాడో సీఎం గా వ్యవహించారన్న పేరుండేది. అప్పట్లో ఇద్దరి పట్ల తాను ఎంతో దారుణంగా ప్రవర్తించాననీ ఆయన ఇప్పుడు తాజాగా పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఇంతకీ వారెవరో చూస్తే మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు, ఐఆర్ఎస్ జాస్తి కిషోర్ కుమార్. ఈ ఇద్దరి పట్ల తాను అలా వ్యవహరించి ఉండకుండా ఉండాల్సిందన్న కోణంలో ఆయన చేసిన ఒక వీడియో ప్రెజంటేషన్ ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. అప్పట్లో జగన్ ఏదంటే అది అన్న మాటకన్నా, ప్రవీణ్ ప్రకాశ్ ఏదంటే అదీ అన్న టాక్ వినిపించేది. ఒక దశలో ప్రవీణ్ ప్రకాశ్ మీద ఉపాధ్యాయులంతా కలసి కంప్లయింట్ చేశారంటే పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు. అలాంటి ప్రవీణ్ ప్రకాశ్ నుంచి సారీ.. అది కూడా ఇద్దరు ఉన్నతాధికారులకు అందింది.
ఒక మూడో సారీ.. నటుడు ప్రకాష్ రాజ్చెప్పారు. బేసిగ్గా ప్రకాష్ రాజ్ ఎంత అగ్రెసివ్ గా ఉంటారంటే.. జస్ట్ ఆస్కింగ్ పేరిట ఏకంగా ప్రధాన మంత్రినే ఏ ప్రశ్నలంటే ఆ ప్రశ్నలు అడిగే బాపతు. దేశంలో ఏ చిన్న విషయమైనా సరే ఆయన నిగ్గ దీసి అడుగు- ఈ సిగ్గులేని సమాజాన్ని అనే టైపు. అలాంటి ప్రకాశ్ రాజ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినందుకుగానూ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తనకే పాపం తెలీదంటే అది తప్పు అవుతుందని అన్నారు. అయితే.. తాను గతంలో చేసిన బెట్టింగ్ యాప్ ప్రచారానికిగానూ సారీ చెబుతున్నా! అంటూ మీడియా ముఖంగా చెప్పారు. దీంతో ఒకే రోజు ముగ్గురు ప్రముఖుల నుంచి మూడు సారీలు వెలువడ్డంతో ఇదో సరికొత్త రికార్డు సృష్టించింది. వీరంతా మామూలోళ్లు కారు. అలాంటి మొండి- జగమొండి ఘటాల నుంచి ఇలాంటి క్షమాపణల పర్వం ఈ సమాజం చూస్తుందనుకోలేదు. కాబట్టే ఇంత ఎగ్జయిట్ మెంట్. ఇందులో ఏదైనా తప్పుంటే సారీయే..!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/selebrities-sorry-39-209427.html
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 2) దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో కొలికపూడి దురుసుగా వ్యవహరించారు.
నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు.
వాస్తవానికి మల్లు భట్టి విక్రమార్క్ జగన్ ను తన కుమారుడి వివాహానికి జనగ్ ను బెంగళూరు వెళ్లి ఆహ్వానించాల్సి ఉంది. అయితే జగన్ స్వయంగా తాను మంగళవారం తాడేపల్లి వస్తాననీ, అప్పుడు ఆహ్వానిస్తే సరిపోతుందనీ కబురు పంపారు.
ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే మండలి సభ్యత్వానికి వారు చేసిన రాజీనామాలను చైర్మన్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు.
మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
రాజ్యసభ ఎన్నికలకు 9 మంది అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.
స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఆలయ పురోహితులు ఎంపీ చిన్ని దంపతులకు అందజేశారు. అయితే, తనకు కూడా వస్త్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ఒకరికే ఇస్తారని చెప్పిన ఆలయ అధికారులు, ఆయనకు తలంబ్రాలు అందించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చేతిలోని పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కుని తన తలపై పెట్టుకున్నారు.
జగన్ హయాంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్న మంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా 198 సాగునీటి ప్రాజెక్టులకు ప్రీ-క్లోజర్ ఇస్తే, వాటిలో 102 ప్రాజెక్టులు రాయలసీమలోనే ఉన్నాయని గుర్తుచేశారు.
వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకుడిగా, బూతుల నానిగా అనితర సాధ్యమైన గుర్తింపు ఉన్న కొడాలి నాని, 2024 ఎన్నికలలో వైసీపీ పరాజయం, గుడివాడ నియోజకవర్గంలో తాను స్వయంగా ఓడిపోవడంతో వెనక్కు తగ్గారు. కేసుల భయంతో మౌనాన్ని ఆశ్రయించారు. అసలు రాజకీయాలలో ఉన్నారా లేరా అన్నంతగా సైలెంట్ అయిపోయారు.
జగన్ రాష్ట్రానికి చుట్టపు చూపుగా మాత్రమే వచ్చి అత్యధికంగా బెంగళూరులోనే మకాం ఉంటుండం ఒక కారణమైతే.. రాష్ట్రానికి, సొంత జిల్లాకు వచ్చినప్పుడు కూడా కార్యకర్తలు, నాయకులకు అప్పాయింట్ మెంట్ దొరకని పరిస్థితి మరో కారణంగా చెబుతుంటారు. ముఖ్యంగా జగన్ అందుబాటులో లేకపోవడం ప్రభావం ఆయన సొంత జిల్లా కడపలో మరీ తీవ్రంగా ఉంది.
కవిత సైతం తన వల్ల పార్టీ ఎలా ఓడిపోయిందని ప్రకటించి చేతులు దులుపుకోవడం కాదు.. అందుకు సంబంధించి వివరణ ఇవ్వాలనీ, లెక్కలు తేల్చాలనీ డిమాండ్ చేయడం ద్వారా మొత్తం బీఆర్ఎస్ నే డిఫెన్స్ లో పడేశారు. దాని నుంచి బయటపడడానికి ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ రంగంలోకి దిగి.. అప్పటి కేటీఆర్, కేసీఆర్ ల ప్రసంగాలు, ప్రకటనలను రీ పోస్టు చేస్తూ హడావుడి చేస్తున్నది.
తుమ్మల నాగేశ్వరరావు తన కుటుంబ సభ్యులతో కలిసి ఐదు రోజుల కిందట దుబాయ్ వెళ్లారు. మంత్రి కుటుంబ సభ్యులలో ఒకరు అనారోగ్యంతో ఉండటంతో మెరుగైన చికిత్స అందించడం కోసం ఆయన దుబాయ్కు వెళ్లినట్లు సమాచారం. చికిత్స అనంతరం తిరిగి రావాలని భావిస్తున్న తరుణంలో పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చి, ఆ ప్రభావంతో దుబాయ్ విమానాశ్రయం మూతపడింది.
అదొక మార్ఫింగ్ వీడియో, ఏఐ జనరేటెడ్ వీడియో అన్నారు. ఇందులో తన పరువు తీసే కుట్ర దాగి ఉందన్న బీఆర్ నాయుడు.. తనతో పాటు టీటీడీ ప్రతిష్ట మంటగలిపే యత్నం ఉందని ఆరోపించారు. అందుకే తాను సైబర్ క్రైమ్ ని ఆశ్రయించానన్నారు.
Publish Date:Feb 28, 2026
ఆ పార్టీ అగ్రనాయకత్వం అప్పట్లో ప్రదర్శించిన ఉదాశీనత.. కవిత అవినీతిని సర్టిఫై చేసినట్లైందని అప్పట్లోనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అదే విషయాన్ని కల్వకుంట్ల కవిత కోర్టు తీర్పు అనంతరం మీడియా సమావేశంలో ఎత్తి చూపారు. పార్టీ కోసం కాకుండా.. పార్టీలో ఉన్న కొందరి స్వార్థం కోసం తనను బలిపశువును చేశారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేశాయి.