ఆంధ్రులకు సాగునీటికొరత తీర్చే గోదావరి - పెన్నార్ లింకు కాలువలు

Publish Date:Aug 13, 2013

Advertisement

ప్రొఫెసర్ టి.శివాజీరావు, డైరెక్టర్, పర్యావరణ అధ్యయన కేంద్రం, గీతం విశ్వవిద్యాలయం, విశాఖపట్నం

 

 

 

ఒకానొకప్పుడు ఎడారికి గురికాబోతున్న రాయలసీమ సాగు భూములకు కృష్ణానదీ జలాలే శరణ్యమని ప్రభుత్వాధికారులు, ఇంజనీర్లు అనుకునేవారు. ఈస్ట్ ఇండియా బ్రిటిషుపాలకులు 19వ శతాబ్దంలోనే తుంగభద్రపై సుంకేశుల ఆనకట్టకట్టి పెన్నానదిలోకి నీరు మళ్ళించడానికి కడప-కర్నూలు సాగునీటికాలువలు త్రవ్వించారంటే రాయలసీమకు కృష్ణాజలాల తరలింపే శరణమని నిరూపించారు. అటు పిమ్మట 1901లో మద్రాసు ప్రభుత్వం నియమించిన సర్.కాలిన్ స్కాట్ కూడా కృష్ణా పెన్నానదుల అనుసంధానం కోసం తుంగభద్ర ప్రాజెక్టు కట్టమన్నారు. అందువల్ల 1905లో ప్రఖ్యాతి గాంచిన ఆంగ్లేయ ఇంజనీరు మెకంజీ దొర తుంగభద్రపై సముద్రమట్టం  మీద 1630 అడుగుల ఎత్తువరకు తుంగభద్ర నీటి జలాశయమట్టాన్ని వుంచుతూ రాయలసీమలో దాదాపు 9 లక్షల ఎకరాలకు సాగునీరిమ్మని సిఫారసు చేశారు. ధనాభావం వల్ల ప్రభుత్వం ఈ ఆయకట్టును 4 లక్షల ఎకరాలకు కుదించింది. 1927లో ప్రభుత్వం కృష్ణానదిపై సంగమేశ్వరం వద్ద ప్రాజెక్టు కట్టి కృష్ణానీటినిదాదాపు 12 లక్షల ఎకరాలకు అందించమన్నారు. ఆ తరువాత మద్రాసు ప్రభుత్వం 1952లో రాయలసీమ సాగునీటి కోసం కృష్ణానదిపై సిద్దేశ్వరం జలాశయాన్ని నిర్మించి 7లక్షల ఎకరాలను సాగుచేద్దామనుకున్నారు.




1953లో ఖోస్లా నిపుణుల కమిటీ సిద్దేశ్వరం డ్యాం జలాశయం నీటిమట్టం 885 అడుగుల నుండి సాగునీటిని రాయలసీమకు మళ్ళించమన్నారు. కానీ దురదృష్టవశాత్తు మద్రాసు రాష్ట్ర ప్రభుత్వాలు యేవి కూడా ఈ ప్రాజెక్టులను డబ్బులేదనే వంకతో అమలుపరచలేదు. అందువల్లనే ఆంధ్రరాష్ట్రాన్ని సాధించటానికి కోస్టల్ ఆంధ్ర, రాయలసీమ నాయకులు ప్రయత్నించినపుడు 1837లో శ్రీబాగ్ ఒడంబడికను సాగునీటి పంపిణీకై రూపొందించి కృష్ణాజలాలను మరలించేటపుడు రాయలసీమకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని పేర్కొన్నారు. కానీ ఆఒడంబడిక ఇంతవరకు అమలుకాలేదు. ప్రస్తుతం తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినట్లయితే రాయలసీమకు నీరు రాక ఎడారిగా మారుతుందని రాజకీయ నాయకులు ఆందోళన చెందుతున్నారు. కానీ దీనికి విరుగుడుగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వైనగంగ-పెన్నా నీటిపారుదల ప్రాజెక్టును 1980 నుండి అమలు చేయమని కోరడంలో రాష్ట్ర శాసనసభ, పార్లమెంటు సభ్యులు విఫలమవుతూ వచ్చారు. ఈ ప్రాజెక్టు వివరాలను తెలుసుకోవడం ఆంధ్రుల అందరి ముఖ్య కర్తవ్యం. అంతే కాదు ఈ ప్రాజెక్టును అమలు చేయడం వల్ల నీటికొరత రాదు.




తెలంగాణా రాష్ట్రం నుండి విడిపోయినట్లయితే కోస్తా జిల్లాలు ఎడారులవుతాయని రాజకీయనాయకులు ప్రజలను భయపెడుతున్నారు. నిజానికి కృష్ణాజలాలను మహారాష్ట్ర, కర్ణాటక, ప్రజలు ఎగువభాగంలో ఉన్న తమ ప్రాంతాలను సస్యశ్యామలం చేయడానికి 
బచావత్ ట్రిబ్యునల్ ఆదేశాలను తుంగలోకి తొక్కి మళ్ళించుకోవడంతో ఆంధ్రకు రావలసిన దాదాపు 460 శతకోటిఘనపుటడుగులు (టి.ఎం.సి.) రావడం లేదని గ్రహించలేకపోతున్నారు. 1978 ప్రాంతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కర్ణాటక నాయకులైన శ్రీశంకరానంద్,  శ్రీరామకృష్ణహెగ్డే అలమట్టి ప్రాజెక్టును విపరీతమైన ఎత్తుకుపెంచినట్లయితే తమ రాష్ట్రంలోని కరవు ప్రాంతాలను సాగుచేసుకోవచ్చునని కేంద్ర జలవనరుల సంఘం అధికారులతో కుమ్మక్కై అలమట్టి డ్యాం ఎత్తును బాగా పెంచేందుకు ప్రయత్నించి సాధించారు. కానీ ఇందువల్ల కృష్ణా డెల్టా భూములు రాయలసీమభూములు ఎడారులవుతాయని అప్పుడే గ్రహించి కొంత మానవతా దృక్పధంతో వారికి ఎక్కువనష్టం రాకుండా చేయడానికి గోదావరి వరదలను, మిగులు జలాలను తెలంగాణా, రాయలసీమ, తమిళనాడు రాష్ట్రాలు కూడా మళ్ళించడానికి ఇంద్రావతి-వైనగంగ-శ్రీశైలం-కావేరి లింకు ప్రాజెక్టును బృహత్తర సాగునీటి ప్రాజెక్టుగా రూపొందించి అమలు చేయాలన్నారు.




ఈ ప్రాజెక్టును కేంద్రప్రభుత్వం సూచించింది కాబట్టి దాన్ని అమలు చేయమని అడగడానికి ఆంధ్రులు ఎన్నుకొన్న రాష్ట్ర శాసనసభ్యులుగాని, పార్లమెంటు సభ్యులుగాని యేమాత్రం శ్రద్ధచూపకపోవడంతో అది మూలన పడేశారు. ఒకానొకప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రాయలసీమను రత్నాలసీమగా మార్చడానికి మిడ్ పెన్నార్ ప్రాజెక్టును రూపొందించి అటు పిమ్మట
తుంగభద్ర జలాశయాన్ని నిర్మించి రాయలసీమ ప్రజలకు సాగునీరిద్దమనుకుంటే స్వార్థపరులైన రాయలసీమ నాయకులే ఈ ప్రాజెక్టులనుండి నీటిని రాయలసీమ భూములకు రానీయకుండా కుట్రలు పన్నిరాయలసీమ బంగారు భవిష్యత్తును నాశనం చేశారు. గతజలసేతుబంధనం అన్నట్లు పాతవిషయాలు మరచిపోయి ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఇంద్రావతి-వైనగంగ-శ్రీశైలం లింకు ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినట్లయితే గోదావరిలో ప్రతి యేటా సముద్రంపాలయ్యే దాదాపు 1000 నుండి 2000 టి.ఎం.సి.ల నీటిని మళ్లించి ఆంధ్ర రాష్ట్రప్రజలకు తాగునీటిని, సాగునీటిని సరఫరా చేయవచ్చు. ఇందుకోసమై ప్రజలంతా ఈ ప్రాజెక్టును గురించి బాగా అర్థం చేసుకునేటట్లు చేయడానికి ఈ క్రింద ఇచ్చిన చిత్రపటం బాగా దోహదపడుతుంది.

By
en-us Political News

  
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో విజయ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జననాయగన్‌ సినీమా విడుదలపై నెలకొన్న అనిశ్చితిని ఆయన ప్రజల ముందు ఉంచారు. అలాగే.. కరూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాద ఘటనను ప్రస్తావిస్తూ.. అది యాధృచ్ఛికంగా జరిగింది కాదని, దాని వెనుక కూడా లోతైన కుట్ర దాగి ఉందన్న అనుమానాలున్నాయన్నారు.
నిజానికి తాను రాజ‌కీయ స‌న్యాసం చేసిన‌ట్టు చెబుతూనే ఉన్నా.. ఇప్ప‌టికీ ఆయ‌న‌ త‌న టీం ద్వారా అకౌంట్ స‌ర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు. ఆపై జ‌గ‌న్ కి లోపాయికారిగా సహకరించేందుకే ఈ రాజీనామా డ్రామాల‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బేసిగ్గా విజ‌య‌సాయిరెడ్డి కామెంట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే.. ఇటీవ‌ల జ‌గ‌న్ అర్ధంప‌ర్దం లేకుండా చేసిన మావిగ‌న్ అనే ప్ర‌తిపాద‌న‌ మీదే. కానీ రేణుక చౌద‌రి స‌భ‌లో లేవ‌నెత్తిన క‌మ్మ‌రావ‌తిని ప‌ట్టుకుని.. పోస్టులు పెట్ట‌డం స‌రికాద‌ంటున్నారు.
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి.
గురువారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును రాజ్యసభలో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని విషయంలో ఉన్న చట్టపరమైన అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణ అత్యవసరమని పేర్కొన్నారు. బిల్లుపై జరిగిన చర్చ అనంతరం, సభాపతి సి.పి. రాధాకృష్ణన్ క్లాజ్ వారీగా ఓటింగ్‌ నిర్వహించగా సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజ్యసభ ఆమోదం లభించింది.
. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదనీ, అయితే రాజధాని పేరుతో సాగుతున్న పరిణామాలు, ఆర్థిక భారాలనే ప్రశ్నిస్తున్నామన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి ఇన్నాళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.