సికిందరాబాద్ అల్ల‌ర్ల సూత్ర‌ధారి ఆవుల అరెస్టు

Publish Date:Jun 18, 2022

Advertisement

కేంద్రం తీసుకొచ్చిన కొత్త పథకం ‘అగ్నిపథ్’ను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో శుక్రవారం తీవ్ర విధ్వంసం సృష్టించిన కేసులో కీలక సూత్రధారిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ అల్లర్లను పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన ఆవుల సుబ్బారావు ప్రోత్సహించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో ఆవుల సుబ్బారావును అతని ప్రకాశం జిల్లా కంభంలో పోలీసులు అదుపులోకి తీసుకుని, నరసరావుపేటకు తరలించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆవుల సుబ్బారావు సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అల్లర్లకు సుబ్బారావు పాత్ర ఉందనే అనుమానంతో ముందస్తు చర్యల్లో భాగంగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సుబ్బారావుకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 9 ఆర్మీ కోచింగ్ సెంటర్లు ఉన్నాయి.

పక్కా ప్రణాళికతోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. సైన్యం లో చేరేందుకు తమ అకాడమీలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులను రెచ్చగొట్టి సుబ్బారావు ఈ విధ్వం సాన్ని ప్రోత్సహించినట్లు పోలీసు గుర్తించారు. అగ్నిపథ్ వల్ల నష్టం కలుగుతుందని వీడియో సందేశం ద్వారా ఆర్మీ అభ్యర్థులను సుబ్బారావు రెచ్చగొట్టినట్లు పోలీసులు తేల్చారు. సుబ్బారావు ఆధ్వర్యంలోనే ఆందోళనకారులు సికింద్రాబాద్ వచ్చినట్లు గుర్తించారు. నిరసనకారులకు సుబ్బారావు తమ అకాడమీ లోనే షెల్టర్ ఇచ్చినట్లు కూడా పోలీసులు తేల్చారు. ఆందోళనకారులకు వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, పులిహోర పొట్లాలను ప్రైవేట్ ఆర్మీ కోచింగ్ అకాడమీలు సరఫరా చేసినట్లు పోలీసు విచారణలో వెలుగు చూసిందని తెలుస్తోంది.

సికింద్రాబాద్ స్టేషన్ అల్లర్ల కేసులో ఇంతవరకు పోలీసులు 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు 12 మంది యువకులు ప్రధాన కారకులని పోలీసుల అనుమానం. వీరంతా ఆర్మీ ఉద్యోగాల ఆశావహులను రెచ్చగొట్టారని ప్రాథమికంగా పోలీసులు తేల్చారు. హకీంపేట ఆర్మీ సోల్జర్స్, సికింద్రాబాద్ రైల్వే స్టేష్ బాక్స్, 17/6 గ్రూప్ తో పాటు పలు పేర్లతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశారు. ఈ వాట్సాప్ సందేశాలు ఇప్పటికే వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ అల్లర్లలో పాల్గొన్న పలువురు సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సికింద్రాబాద్ స్టేషన్ లో అల్లర్ల వెనుక కరీంనగర్ లోని స్టార్ డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు వసీం హస్తం ఉండొచ్చని కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సికింద్రాబాద్ స్టేషన్ లో విధ్వంసానికి పాల్పడిన ఆందోళనకారులపై పోలీసులు కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐఆర్ఎస్, ఐపీసీ, జీఆర్పీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఐఆర్ఏ 150 సెక్షన్ కింద నేరం రుజువైతే యావజ్జీవ లేదా మరణశిక్షకు గురయ్యే అవకాశం ఉంది. ఈ కేసుల్లో చిక్కు కున్న వారు సైన్యంలో పనిచేసేందుకు అనర్హులవుతారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరేందుకు కూడా ఇబ్బందులు వస్తాయి.  శిక్ష‌ణ‌నిచ్చేవారే ఉద్రిక్త ప‌రిస్థితులు క‌ల్పించేందుకు పూనుకుంటే స‌మాజం ఏం కావాలి?    

అగ్నిప‌థ్ ప‌థ‌కంతో కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల దేశ‌మంత‌టా తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేక‌త ఇంకా  వెల్లువెత్తుతోంది. అన్ని రాష్ట్రాల్లో దాడులు, హింసాత్మ‌క సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి. అయితే శుక్ర‌వారం సికింద్రాబాద్‌లో జ‌రిగిన దాడులు, హింసాత్మ‌క సంఘ‌ట‌న‌లు ముఖ్యంగా  రైళ్లకు  నిప్పు పెట్ట‌డా లు వంటివి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ  క‌నీ వినీ ఎరుగ‌నివి. ఇంత స్థాయిలో యువ‌త తిరుగుబాటు, దాడు ల‌కు పూనుకోవ‌డానికి వారిని రెచ్చ‌గొట్టిన‌ది  సాయి డిఫెన్స్ అకాడ‌మీ వ్య‌వ‌స్థాప‌కుడు ఆవుల సుబ్బారావు అని తేలింది. 

సాయి డిఫెన్స్ అకాడెమీ  సైనిక శిక్ష‌ణా కేంద్రాన్నించీ  ప్ర‌తీ యేడూ చాలామందికి శిక్ష‌ణ‌నిచ్చి సైన్యంలో చేర‌డానికి వీలు క‌ల్పిస్తున్నారు. అయితే ఈ సారి కేంద్రం అగ్నిప‌థ్ ప‌థ‌కంతో  సైనిక శిక్ష‌ణ‌లో వున్న యువత‌కు అన్యాయ‌మే జ‌రుగుతుంద‌న్న‌ది స్ప‌ష్ట మ‌యింది. 17 నుంచి 23 సంవ‌త్స‌రాల మ‌ధ్య‌లో యువ‌త శిక్ష‌ణ‌లో వున్న‌వారికి అగ్నిప‌థ్ ప‌థ‌కం ద్వారా సైన్యంలోకి తీసుకున్న‌ప్ప‌టికీ వారికి  కేవ‌లం నాలుగేళ్లు మాత్ర‌మే ఉద్యోగ భ‌ద్ర‌త వుంటుంది. ఆ త‌ర్వాత తొల‌గించ‌వ‌చ్చు. ఈ  నియ‌మం దేశంలో సైనిక శిక్ష‌ణ పొందుతున్న యువ‌త‌కు ఆశాభంగ‌మ‌యింది. దాన్ని వ్య‌తిరేకిస్తూ దేశంలో యువ‌త తిరగ బ‌డ్డారు. కానీ కేంద్రం ఇసుమంత కూడా వెన‌క‌డుగు వేయ‌లేదు.   ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌డానికే  గ‌ట్టి నిర్ణ‌యం తీసుకుంది. 

ఈ నేప‌థ్యంలో శుక్ర‌వారం సికింద్రాబాద్ రైల్వేస్టేష‌న్‌లో రైళ్ల ద‌గ్ధం, హైద‌రాబాద్ లో అనేక ప్రాంతాల్లో అల్ల‌ర్లు, పోలీసుల లాఠీచార్జీ చివ‌ర‌గా ఫైరింగ్ కూడా చోటుచేసుకుంది. అస‌లు కుర్రాళ్లు ఇంత‌గా రెచ్చి పోవడానికి రైళ్ల రాక‌పోక‌ల‌ను స్థంభింప‌జేయ‌డానికి వారిని రెచ్చ‌గొట్టింది ఆవుల సుబ్బారావు డిఫెన్స్  అకా డ‌మీ సృష్టించిన ప్ర‌త్యేక యాప్ పుణ్య‌మే అన్న‌ది తేట‌తెల్ల‌మ‌యింది. వాట్స‌ప్ గ్రూప్ ద్వారా వేగంగా స‌మా చారం విస్త‌రించి మ‌రింత మంది రెండు తెలుగు రాష్ట్రాల యువ‌త విరుచుకుప‌డ్డార‌న్న‌ది బ‌య‌ట ప‌డిం ది.  ఇదంతా చాలా ముందుగానే ప్లాన్ చేసుకుని అమ‌లు చేసిన ప‌థ‌కంగా తోస్తోంద‌ని ప‌రిస్థితుల‌ను ప‌రిశీలిస్తున్న విశ్లేష‌కులు అంటున్నారు. మ‌రీ దారుణ‌మేమంటే అటు ఆంధ్రా నుంచి పెద్ద సంఖ్య‌లో యువ‌త వ‌చ్చి ఇక్క‌డ దాడుల్లో పాల్గొన‌డానికి కావ‌ల‌సిన మ‌ద్ద‌తు సుబ్బారావు సృష్టించిన యాప్ ద్వారానే ల‌భించింద‌న్న వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. శిక్షణ‌నిచ్చిన వారే ఇలాంటి దాడులు, దారుణాల‌కు ప్రోత్స హించ‌డం అమానుష‌మే అవుతుంది. కేంద్రం తీసుకున్న నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ డిఫెన్స్ అకాడెమీలు, శిక్ష‌ణా కేంద్రాలు మ‌రో విధంగా శాంతియుతంగా త‌మ గోడును తెలియ‌జేయాలి అనే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. కానీ చాలా కాలం నుంచి శిక్ష‌ణ పొందుతూ ఎంతో ఆశ‌తో ఎదురుచూస్తున్న యువ త‌కు కేంద్రం అగ్నిప‌థ్ నిర్ణ‌యం పెద్ద షాక్ అనాలి. వూహించ‌ని నిర్ణ‌యానికి వూహించ‌ని ప‌రిణామాలే చోటుచేసుకున్నాయి. 

By
en-us Political News

  
కేంద్రకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. దీనికి ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. అయితే దీనికి నిర్దిష్టమైన ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు.
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ హడావిడి వెనుక సాయికృష్ణ కుటుంబంపై ప్రేమ ఎంతమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ స్పష్టం చేశారు. జగన్ అసలు టార్గెట్ సీఐ నాగరాజు కాదనీ.. ఆయన ప్రధాన లక్ష్యం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అని విశ్లేషించారు.
అధికార కూటమికి చెందిన నాయకులు, చివరికి హోం మంత్రి సైతం క్షేత్రస్థాయికి వెళ్లి బాధితులను పరామర్శించకపోవడం, సరైన క్లారిటీ ఇవ్వకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేలా ప్రవర్తిస్తున్న అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ బాస్ ను ఆదేశించారు.
ఒక బలమైన ప్రజాధారణ కలిగిన సరికొత్త వేదిక ఏర్పడితే ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
లకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రతిపక్షాల మద్దతుతో సంబంధం లేకుండా.. స్వతంత్రంగా ఆమోదింప చేసుకోవడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు రహస్యం.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో కలిపి ఇప్పటికే దాదాపు 20 లక్షల మందికి పైగా సభ్యులు జనసేనలో చేరారనీ.. ఈ బలంతో తెలంగాణ రాజకీయాల్లో తమ ఉనికిని గట్టిగా చాటుతామని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు, 2028లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీకి దిగుతుందని పవన్ ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఏపీ రాజకీయాలలో కాపు సామాజికవర్గం ఓటు బ్యాంకుకు ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలిగే సత్తా ఉంది. అటువంటి కాపు సామాజికవర్గం విషయంలో జగన్ అనుసరిస్తున్న వ్యూహం మొదటికే మోసం తెచ్చేలా ఉందన్న ఆందోళన వైసీపీ వర్గాలలో వ్యక్తం అవుతున్నది.
శివసేన ఏక్ నాథ్ షిండే, శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే అసలైన వారసులం తామేనంటూ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గం, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని యూబీటీ వర్గం పోటాపోటీగా భారీ బహిరంగ సభలను నిర్వహించడంతో ముంబైలో ఉద్రిక్తతలు పీక్స్ కు వెళ్లాయి.
విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీకి సాయికృష్ణ అదృశ్యం ఘటనను అందివచ్చిన అవకాశంగా భావించి.. పొలిటికల్ మైలేజీ గెయిన్ చేయడానికి శతధా ప్రయత్నించింది. అయితే చంద్రబాబు తన చాణక్యంతో ఆ ప్రయత్నాలకు చెక్ పెట్టారు.
తెలంగాణ రాజకీయాల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం మరోసారి తీవ్ర ఉత్కంఠకు వేదికగా మారింది.
వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో కొడాలి నాని అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై తీవ్రస్థాయిలో వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు రాజ్యాంగ నిబంధనలకు, చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ దాఖలైన ఫిర్యాదులపై సుదీర్ఘంగా సమీక్షించిన ప్రభుత్వం.. తాజాగా ప్రాసిక్యూషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. దీనితో ఆయన అరెస్టయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.
కేసుకు కులాన్ని ఆపాదిస్తూ వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, కొరసాల కన్నబాబు, తోట త్రిమూర్తులు వంటి పెద్దలు కాపు కుల మీటింగ్‌లు పెట్టాలని చూడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సాయికృష్ణపై గతంలో దాదాపు 22 క్రిమినల్ కేసులు, పోక్సో చట్టం కింద కేసులు ఉన్నాయని, సమాజానికి హానికరమైన ఒక నేరచరిత్ర ఉన్న వ్యక్తిని తీసుకువచ్చి కాపు యువకుడిగా ముద్ర వేయడం ద్వారా మొత్తం కులానికి అప్రతిష్ట తెస్తున్నారని మండిపడ్డారు.
ఏపీ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా సాగుతున్న కులాల వ్యూహాలను విశ్లేషించారు. దేశంలో రాజ్యాంగం కల్పించిన రక్షణలు, సామాజిక మార్పుల వల్ల నేడు పల్లెల్లో సైతం కుల వివక్ష దాదాపు అంతరించిపోయిందన్నారు. కానీ.. ఒక వ్యూహం ప్రకారం కొన్ని రాజకీయ పార్టీలు నిర్దిష్ట సామాజిక వర్గాలను టార్గెట్ చేస్తూ, మిగిలిన వర్గాల్లో వారిపై ద్వేషం పెంచేలా వాటిని బూచి గా చూపిస్తూ రాజకీయ పబ్బం గుడుపుకోవాలని చూస్తున్నాయన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.