సికిందరాబాద్ అల్ల‌ర్ల సూత్ర‌ధారి ఆవుల అరెస్టు

Publish Date:Jun 18, 2022

Advertisement

కేంద్రం తీసుకొచ్చిన కొత్త పథకం ‘అగ్నిపథ్’ను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో శుక్రవారం తీవ్ర విధ్వంసం సృష్టించిన కేసులో కీలక సూత్రధారిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ అల్లర్లను పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన ఆవుల సుబ్బారావు ప్రోత్సహించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో ఆవుల సుబ్బారావును అతని ప్రకాశం జిల్లా కంభంలో పోలీసులు అదుపులోకి తీసుకుని, నరసరావుపేటకు తరలించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆవుల సుబ్బారావు సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అల్లర్లకు సుబ్బారావు పాత్ర ఉందనే అనుమానంతో ముందస్తు చర్యల్లో భాగంగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సుబ్బారావుకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 9 ఆర్మీ కోచింగ్ సెంటర్లు ఉన్నాయి.

పక్కా ప్రణాళికతోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. సైన్యం లో చేరేందుకు తమ అకాడమీలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులను రెచ్చగొట్టి సుబ్బారావు ఈ విధ్వం సాన్ని ప్రోత్సహించినట్లు పోలీసు గుర్తించారు. అగ్నిపథ్ వల్ల నష్టం కలుగుతుందని వీడియో సందేశం ద్వారా ఆర్మీ అభ్యర్థులను సుబ్బారావు రెచ్చగొట్టినట్లు పోలీసులు తేల్చారు. సుబ్బారావు ఆధ్వర్యంలోనే ఆందోళనకారులు సికింద్రాబాద్ వచ్చినట్లు గుర్తించారు. నిరసనకారులకు సుబ్బారావు తమ అకాడమీ లోనే షెల్టర్ ఇచ్చినట్లు కూడా పోలీసులు తేల్చారు. ఆందోళనకారులకు వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, పులిహోర పొట్లాలను ప్రైవేట్ ఆర్మీ కోచింగ్ అకాడమీలు సరఫరా చేసినట్లు పోలీసు విచారణలో వెలుగు చూసిందని తెలుస్తోంది.

సికింద్రాబాద్ స్టేషన్ అల్లర్ల కేసులో ఇంతవరకు పోలీసులు 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు 12 మంది యువకులు ప్రధాన కారకులని పోలీసుల అనుమానం. వీరంతా ఆర్మీ ఉద్యోగాల ఆశావహులను రెచ్చగొట్టారని ప్రాథమికంగా పోలీసులు తేల్చారు. హకీంపేట ఆర్మీ సోల్జర్స్, సికింద్రాబాద్ రైల్వే స్టేష్ బాక్స్, 17/6 గ్రూప్ తో పాటు పలు పేర్లతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశారు. ఈ వాట్సాప్ సందేశాలు ఇప్పటికే వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ అల్లర్లలో పాల్గొన్న పలువురు సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సికింద్రాబాద్ స్టేషన్ లో అల్లర్ల వెనుక కరీంనగర్ లోని స్టార్ డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు వసీం హస్తం ఉండొచ్చని కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సికింద్రాబాద్ స్టేషన్ లో విధ్వంసానికి పాల్పడిన ఆందోళనకారులపై పోలీసులు కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐఆర్ఎస్, ఐపీసీ, జీఆర్పీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఐఆర్ఏ 150 సెక్షన్ కింద నేరం రుజువైతే యావజ్జీవ లేదా మరణశిక్షకు గురయ్యే అవకాశం ఉంది. ఈ కేసుల్లో చిక్కు కున్న వారు సైన్యంలో పనిచేసేందుకు అనర్హులవుతారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరేందుకు కూడా ఇబ్బందులు వస్తాయి.  శిక్ష‌ణ‌నిచ్చేవారే ఉద్రిక్త ప‌రిస్థితులు క‌ల్పించేందుకు పూనుకుంటే స‌మాజం ఏం కావాలి?    

అగ్నిప‌థ్ ప‌థ‌కంతో కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల దేశ‌మంత‌టా తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేక‌త ఇంకా  వెల్లువెత్తుతోంది. అన్ని రాష్ట్రాల్లో దాడులు, హింసాత్మ‌క సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి. అయితే శుక్ర‌వారం సికింద్రాబాద్‌లో జ‌రిగిన దాడులు, హింసాత్మ‌క సంఘ‌ట‌న‌లు ముఖ్యంగా  రైళ్లకు  నిప్పు పెట్ట‌డా లు వంటివి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ  క‌నీ వినీ ఎరుగ‌నివి. ఇంత స్థాయిలో యువ‌త తిరుగుబాటు, దాడు ల‌కు పూనుకోవ‌డానికి వారిని రెచ్చ‌గొట్టిన‌ది  సాయి డిఫెన్స్ అకాడ‌మీ వ్య‌వ‌స్థాప‌కుడు ఆవుల సుబ్బారావు అని తేలింది. 

సాయి డిఫెన్స్ అకాడెమీ  సైనిక శిక్ష‌ణా కేంద్రాన్నించీ  ప్ర‌తీ యేడూ చాలామందికి శిక్ష‌ణ‌నిచ్చి సైన్యంలో చేర‌డానికి వీలు క‌ల్పిస్తున్నారు. అయితే ఈ సారి కేంద్రం అగ్నిప‌థ్ ప‌థ‌కంతో  సైనిక శిక్ష‌ణ‌లో వున్న యువత‌కు అన్యాయ‌మే జ‌రుగుతుంద‌న్న‌ది స్ప‌ష్ట మ‌యింది. 17 నుంచి 23 సంవ‌త్స‌రాల మ‌ధ్య‌లో యువ‌త శిక్ష‌ణ‌లో వున్న‌వారికి అగ్నిప‌థ్ ప‌థ‌కం ద్వారా సైన్యంలోకి తీసుకున్న‌ప్ప‌టికీ వారికి  కేవ‌లం నాలుగేళ్లు మాత్ర‌మే ఉద్యోగ భ‌ద్ర‌త వుంటుంది. ఆ త‌ర్వాత తొల‌గించ‌వ‌చ్చు. ఈ  నియ‌మం దేశంలో సైనిక శిక్ష‌ణ పొందుతున్న యువ‌త‌కు ఆశాభంగ‌మ‌యింది. దాన్ని వ్య‌తిరేకిస్తూ దేశంలో యువ‌త తిరగ బ‌డ్డారు. కానీ కేంద్రం ఇసుమంత కూడా వెన‌క‌డుగు వేయ‌లేదు.   ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌డానికే  గ‌ట్టి నిర్ణ‌యం తీసుకుంది. 

ఈ నేప‌థ్యంలో శుక్ర‌వారం సికింద్రాబాద్ రైల్వేస్టేష‌న్‌లో రైళ్ల ద‌గ్ధం, హైద‌రాబాద్ లో అనేక ప్రాంతాల్లో అల్ల‌ర్లు, పోలీసుల లాఠీచార్జీ చివ‌ర‌గా ఫైరింగ్ కూడా చోటుచేసుకుంది. అస‌లు కుర్రాళ్లు ఇంత‌గా రెచ్చి పోవడానికి రైళ్ల రాక‌పోక‌ల‌ను స్థంభింప‌జేయ‌డానికి వారిని రెచ్చ‌గొట్టింది ఆవుల సుబ్బారావు డిఫెన్స్  అకా డ‌మీ సృష్టించిన ప్ర‌త్యేక యాప్ పుణ్య‌మే అన్న‌ది తేట‌తెల్ల‌మ‌యింది. వాట్స‌ప్ గ్రూప్ ద్వారా వేగంగా స‌మా చారం విస్త‌రించి మ‌రింత మంది రెండు తెలుగు రాష్ట్రాల యువ‌త విరుచుకుప‌డ్డార‌న్న‌ది బ‌య‌ట ప‌డిం ది.  ఇదంతా చాలా ముందుగానే ప్లాన్ చేసుకుని అమ‌లు చేసిన ప‌థ‌కంగా తోస్తోంద‌ని ప‌రిస్థితుల‌ను ప‌రిశీలిస్తున్న విశ్లేష‌కులు అంటున్నారు. మ‌రీ దారుణ‌మేమంటే అటు ఆంధ్రా నుంచి పెద్ద సంఖ్య‌లో యువ‌త వ‌చ్చి ఇక్క‌డ దాడుల్లో పాల్గొన‌డానికి కావ‌ల‌సిన మ‌ద్ద‌తు సుబ్బారావు సృష్టించిన యాప్ ద్వారానే ల‌భించింద‌న్న వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. శిక్షణ‌నిచ్చిన వారే ఇలాంటి దాడులు, దారుణాల‌కు ప్రోత్స హించ‌డం అమానుష‌మే అవుతుంది. కేంద్రం తీసుకున్న నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ డిఫెన్స్ అకాడెమీలు, శిక్ష‌ణా కేంద్రాలు మ‌రో విధంగా శాంతియుతంగా త‌మ గోడును తెలియ‌జేయాలి అనే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. కానీ చాలా కాలం నుంచి శిక్ష‌ణ పొందుతూ ఎంతో ఆశ‌తో ఎదురుచూస్తున్న యువ త‌కు కేంద్రం అగ్నిప‌థ్ నిర్ణ‌యం పెద్ద షాక్ అనాలి. వూహించ‌ని నిర్ణ‌యానికి వూహించ‌ని ప‌రిణామాలే చోటుచేసుకున్నాయి. 

By
en-us Political News

  
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది.
టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో యూనిట్ ఇంఛార్జ్‌లకు నిర్వహించిన శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు హైకోర్టులో ఏకంగా 300 కోర్టు కేసులు వేయించారని, అయితే ధర్మాసనం వారికి తీవ్రంగా మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పిందని గుర్తుచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే వైకాపా నైజమని మండిపడ్డారు.
మ్మెల్సీ రామసుబ్బారెడ్డి తన సతీమణి ఇందిరమ్మతో కలిసి దీక్షా శిబిరానికి చేరుకున్నారు. అయితే పోలీసులు అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. ఈ దశలో వైపీపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు ఎమ్మెల్సీ దంపతులను, పలువురు కార్యకర్తలను అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.
విజయ్ రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు స్పందించలేదు. తన భార్యపై గానీ, కోర్టులో ఉన్న విడాకుల ప్రక్రియపై గానీ విజయ్ పన్నెత్తు మాట మాట్లాడలేదు. వ్యక్తిగత విషయాలకూ, రాజకీయాలకూ సంబంధం లేదని ఒక్క ముక్కలో తేల్చేశారు.
తెలంగాణలో త్వరలో జరగనున్న  స్థానిక  ఎన్నికల్లో  బీజేపీకి  ఏ పార్టీతోనూ  పొత్తులు పెట్టుకునే ఆలోచన  లేదని స్పష్టం చేశారు. జనసేన పార్టీతో తమకు ఉన్న మిత్రబంధం కేవలం కేంద్ర స్థాయికి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమని, తెలంగాణలో ఆ పొత్తును పొడిగించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
వైసీపీ అధినేత జగన్ మాత్రం బాధితుల వేదనను, కష్టాలను ఇసుమంతైనా పట్టించుకోకుండా, అక్రమాలకు పాల్పడిన నిందితుల వద్దకు వెళ్లి వారిని పరామర్శిస్తూ, ఓదార్చడం వింతగా విడ్డూరంగా ఉందన్నారు. అక్రమాలకు పాల్పడండి అండగా ఉంటానంటూ జగన్ నిందితులకు భరోసా ఇస్తున్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు.
దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్న సీనియర్ నేత చలసానికి సొంత పార్టీ నుంచే ఈ స్థాయి ఒత్తిడి రావడం వెనుక కృష్ణా జిల్లా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. ఎన్టీఆర్ తెచ్చిన మాక్స్ చట్టం కింద స్వతంత్రంగా నడుస్తున్న ఈ డెయిరీలో ప్రభుత్వ జోక్యానికి తావు లేకపోయినా. . చలసానిపై ఈ స్థాయిలో రాజీనామాకు ఒత్తడి రావడం పట్ల పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్‌రాజ్‌లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.