నగరిలో రోజా సీన్ సితారేనా?.. మంత్రి పదవి మూన్నాళ్ల ముచ్చటేనా?

Publish Date:Oct 18, 2022

Advertisement

ఇంట్లో ఈగల మోత... బయట పల్లకీల మోత అన్న సామెత కొంచం అటూ ఇటూగా మంత్రి రోజాకు అతికినట్లు సరిపోతుంది. నటిగా, రాజకీయ నాయకురాలిగా ఫైర్ బ్రాండ్ ముద్ర వేయించుకున్న రోజాకు మంత్రి పదవి చేపట్టిన తరువాత మాత్రం ఇబ్బందులు, ఇక్కట్ల, అవమానాలు, పరాభవాలే ఎదురౌతున్నాయి. నియోజకవర్గం బయట మంత్రి హోదాలో గాంభీర్యం పదర్శిస్తూ ఎలాగోలా నెట్టుకొచ్చేస్తున్నా సొంత నియోజకవర్గం నగరిలో మాత్రం ఆమెకు ఈగల మోతే.. నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు ఆమెను పట్టించుకోవడం లేదు.

కనీసం ప్రొటో కాల్ ప్రకారమైనా ప్రభుత్వ పరంగా నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు ఆమెకు ఆహ్వానం సంగతి అటుంచి కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదు. ఈ విషయాలను పార్టీ అధిష్ఠానం దృష్టికి రోజా తీసుకువెళ్లినా వారు లైట్ తీసుకుంటున్నారు. రోజాను కూడా లైట్ తీసుకోమనే చెబుతున్నారు. జిల్లాకే చెందిన మరో మంత్రి పెద్ది రామచంద్రారెడ్డికి జిల్లా అంతటా రాజమర్యాదలు జరుగుతుంటే.. రోజాకు మాత్రం పలకరించే దిక్కు లేని పరిస్థితి ఎదురౌతోంది. అధిష్ఠానం కూడా నగరి సహా జిల్లా అంతటా పెద్ది రెడ్డి మాటే చెల్లుబాటు అవుతుందనీ, ఆయన ఆధిపత్యాన్ని అంగీకరించి ఆయన చెప్పిన విధంగా పని చేసుకుపోవడం ఉభయ తారకంగా  ఉంటుందని రోజాకు చెప్పకనే చెబుతోందని నియోజకవర్గంలో ఓ టాక్.

ఇక తాజాగా రోజాకు తన సొంత నియోజవకర్గంలో రైతు భరోసా కేంద్రం భూమి పూజ కార్యక్రమానికి ఆహ్వానం, సమాచారం లేకుండానే కానిచ్చేయడాన్ని రోజా జీర్ణించుకోలేకపోయారు. పైగా ఆ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించిన వారంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గీయులే కావడంతో ఆమె తన ఆవేదనను పార్టీకి చెందిన మరో నాయకుడికి ఫోన్ ద్వారా తెలియజేశారు. ఆ ఫోన్ లో రోజా మాట్లాడిన మాటలు సామాజిక మాధ్యమంలో తెగవైరల్ అయిపోయాయి. రాజకీయాలు చేయడం కష్టం అంటే ఆమె ఆవేదన వ్యక్తం చేయడం, ప్రాణం పెట్టి పార్టీకి పని చేసినా... తన వ్యతిరేకులకే నియోజకవర్గంలో పెద్ద పీట వేసి ప్రోత్సహించడం బాధగా ఉందంటూ చెప్పడం ఇవన్నీ ఆమె గొంతుకతో సహా ఆడియో రిలీజ్ కావడం రోజాకే ఎదురు తిరిగింది.

ఆ ఆడియోను రోజానే రిలీజ్ చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం నగరిలో రోజాకు మద్దతుగా కనీసం క్యాడర్ కూడా లేదని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.  ఇప్పటికే గడపగడపకూ కార్యక్రమంలో ఆశించిన స్థాయిలో పాల్గొనడం లేదని పార్టీ అధినేత, సీఎం జగన్ రోజాకు చిన్నపాటి క్లాస్ తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నవంబర్ లో మరో సారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందనీ, ఆ పునర్వ్యవస్థీకరణలో రోజాకు ఉద్వాసన ఖాయమనీ వైసీపీ శ్రేణుల్లోనే ఓ టాక్ జోరుగా సాగుతోంది. పైగా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు విషయంలో విమర్శలను తిప్పి కొట్టే విషయంలో కూడా రోజా వెంటనే స్పందించకపోవడం పట్ల కూడా సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారంటున్నారు. ‘మీకు మంత్రి పదవులు ఇచ్చింది

బుగ్గ కార్లలో తిరిగి సొంత పనులు చేసుకోవడానికి కాదంటూ జగన్ తీవ్ర స్థాయిలో చేసిన వ్యాఖ్యలు నేరుగా కాకున్నా పరోక్షంగా రోజాను ఉద్దేశించి చేసినవేనని కూడా పార్టీ శ్రేణులు అంటున్నాయి. మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ రోజా పై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. పదవీ ప్రమాణం చేసిన తరువాత హైదరాబాద్ వెళ్లి జగన్మాత విజయమ్మ ఆశీస్సులు తీసుకోవడం దగ్గర నుంచి.. ఇటీవల ఆమె జబర్దస్త్ షోకు వెళ్లడం వరకూ దాదాపు అన్ని విషయాలలోనూ రోజాపై పార్టీలోనే కాదు సామాజిక మాధ్యమంలోనూ విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలోనే పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ రోజాకు క్లాస్ పీకారని అంటున్నారు. నగరి నియోజకవర్గంలో రోజాకు వ్యతిరేకంగా బలమైన గ్రూపు తయారవ్వడం, మరో వైపు గడపగడపకూ కార్యక్రమంలో ఆమె చురుకుగా పాల్గొనడం లేదని పార్టీ అదిష్ఠానం భావిస్తుండటంతో వచ్చే ఎన్నికలలో రోజాకు పార్టీ టికెట్ అనుమానమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
తెలుగువన్ వాస్తవ వేదిక తాజా సంచికలో వివేక హత్య కేసుపై విస్తృత చర్చ జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
పుట్టా మహూష్ ఇచ్చిన వివరణ ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులోతెలుగుదేశం పార్టీ నాయకుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి విదితమే ఈ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ గా స్పందించి.. పుట్టా మహేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పార్టీ హైకమాండ్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసి ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాని ఆదేశించింది.
ఆమె పోరాటం ప్రధానంగా తన తండ్రి కేసీఆర్, ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపైనేనని విస్పష్ట సంకేతాలిచ్చేశాయి. డాడీ అంటే తన తండ్రి కేసీఆర్ అని, చిన్న మోదీ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పరోక్షంగా అయినా స్పష్టంగా చెప్పారు.
ఒకప్పుడు అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీలో కీలక నేతగా, ఆ పార్టీ అధినేత జగన్ కు సన్నిహితుడిగా, ఆయన కుటుంబ బంధువుగా బాలినేని శ్రీనివాసరెడ్డి చక్రం తిప్పారు. అయితే గత ఎన్నికలకు ముందు నుంచే వైసీపీలో బాలినేని పరిస్థితి పొమ్మనలేక పొగపెట్టిన చందంగా మారింది.
తెలంగాణ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ లో 13 వేల 679 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక పోతే మల్లు భట్టి విక్రమార్క మొత్తం 3 లక్షల24 వేల234 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు.
టి.సి. రాజన్ 1967లో స్వతంత్ర పార్టీ తరపున పలమనేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాజకీయాల్లో ఆయన తన సుదీర్ఘ సేవలతో ప్రత్యేక గుర్తింపు పొందారు.
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేయెన్నం శ్రీనివాస్ రెడ్డి శాసనసభ విప్‌లుగా నియమితులయ్యారు. అలాగే శాసనమండలిలో అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లను విప్‌లుగా నియమించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.