ఆదివాసుల జీవితాలను ఆదుకోండి!

Publish Date:Aug 9, 2022

Advertisement

మనుషులు నాగరికులు కాకముందు వారి జీవితం వేరుగా ఉండేది.  మనిషి కోతి నుండి పుట్టాడని ఆదిమమానవుడు కాలక్రమంలో మార్పులకు లోనవుతూ నేడు నాగరిక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని, నాగరికుడిగా బ్రతుకున్నాడని చెబుతారు. ఈ నాగరిక అనాగరిక అంశాల మధ్య తేడాలు ఎన్ని ఉన్నా, ఆ రెండింటిలో ఉన్న మనుషులు వారి వారి జీవితాలను కొనసాగించడానికి పోరాటం చేయక తప్పదు. అయితే కాలంతో కొన్ని మాత్రమే అభివృద్ధి చెందినట్టు మనుషులు కూడా కొందరే అభివృద్ధి చెంది నాగరిక సమాజంలో కొందరు, ఆటవిక సమాజంలో కొందరు ఉండిపోయారు. 

అడవులను నమ్ముకుని, ప్రకృతి మధ్య, ఆటవిక వనరులను ఉపయోగించుకుంటూ, ఆ అడవినే దైవంగా భావిస్తూ బ్రతుకుతున్న ఆటవిక జాతులు చాలా ఉన్నాయి. సమాజంలో కుల, మత, వర్గ భేదాలు, ఆర్థిక వ్యవస్థ, అన్నిటికి మించి స్వార్థంగా ఆలోచించడం వల్ల ఇలాంటి ఆటవిక జాతులకు నేటికి సరైన న్యాయం అంటూ జరగడం లేదు. అడవులలో నివసించేవారిని ఆదివాసీలు అంటారు. గిరిజనులైన వీరు సంచారజీవితాన్ని గడుపుతూ ఉన్నచోట అనుకూలమైన వ్యవసాయం చేసుకోవడం, ప్రకృతి వనరుల మధ్య బ్రతకడం, ముఖ్యంగా అటవీ ఉత్పత్తులను దగ్గర్లోని సంతల్లో అమ్మడం చేస్తూ జీవిస్తారు.

ప్రపంచ వ్యాప్తంగా సుమారు "వంద దేశాలలో" "అయిదు వేల ఆదివాసీ తెగలు" ఉన్నట్టు గుర్తించారు. వీరిలో ఒక్కో తెగ ఒక్కో భాష మాట్లాడుతూ ఉంటుంది. ప్రస్తుతం ఆదివాసీ తెగలు "ఆరువేల ఏడువందల" భాషలు మాట్లాడుతున్నారు. మొత్తంమీద "వీరి జనాభా" చూస్తే సుమారు "నలభై కోట్లకు" పైన ఉంది. ప్రపంచ జనాభాలో వీరి జనాభా శాతం తక్కువే అయినప్పటికీ అభివృద్ధి చెందుతున్న ప్రపంచీకరణలో ఆదివాసీలు తమ హక్కుల కోసం పోరాడాల్సి వస్తోంది. 

ఆదివాసీల జీవనశైలి వారి అలవాట్లు, సంప్రదాయాలు అన్నీ ఎంతో విశిష్టమైనవి. వారి సంస్కృతి సంప్రదాయాలను, వారి హక్కుల్ని కాపాడటం కోసం ప్రతి సంవత్సరం ఆగష్టు 9 వ తేదీన ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవాలని 1993లో ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. ఈ తీర్మానం అమలు అయిన తరువాత  అడవులపై హక్కులు ఆదివాసులకే ఉన్నాయని 2010 జూలై 14న జాతీయ అభివృద్ధి మండలి సమావేశంలో నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రకటించారు. అయితే అది అమలు కాలేదు. 

దేశ పార్లమెంటుల్లోనూ రాష్ట్ర రాజకీయాల్లోనూ ఆదివాసీలు ఉన్నా ఆదివాసీల అభివృద్ధి వారి హక్కుల కోసం నోరుతెరచి మాట్లాడేవారు వాటిని సాధించుకోవాలని ప్రయత్నం చేసేవారు కనిపించడం లేదు. కారణం వారిలో వారే స్వార్థపరులుగా మారిపోవడం కూడా. 

ఉప్పుతో కూడా కోట్ల వ్యాపార సామ్రాజ్యాలు నడుపుతున్న నేటి వ్యాపార అధినేతల మనసులో ఆదివాసులు అంతరించిపోతే ఎంతో ఆటవిక భూములు, అక్కడ ఉత్పత్తులతో వ్యారసామ్రాజ్యాన్ని విస్తృతం చేసుకోవాలనే ఆలోచనలే ఆదివాసుల జీవితాలను ప్రమాద కోరల్లో నిలబెడుతున్నాయి. ఈ ఆదివాసుల సంరక్షణకు నడుం బిగిస్తూ నక్సల్స్ వంటి పోరాట బృందాలు ఏర్పడ్డా వారికి కూడా నిరంతరం హింసాయుత జీవితం, ప్రాణం మీద భరోసాలేని బ్రతుకు దిక్కవుతోంది.

అటవీ భూముల కోసం, ఆ భూముల్లో ఖనిజాల కోసం, ఇతర ఉత్పత్తుల కోసం, విలువైన కలప కోసం ఆశపడి పూర్తిగా ఆదివాసులని అంతం చేయాలని అనుకుంటున్న నేటి నాగరిక సమాజానిది ఎలాంటి మనస్తత్వమో ఆలోచిస్తే అర్థమవుతుంది.

ఎన్నో రకాల కుటీర పరిశ్రమలు, చేతి కళలు, ఆరోగ్య రహస్యాలు, ఆయుర్వేద మూలికలకు నిలయమైన అడవులను నిర్వీర్యం చేస్తూ అక్కడి ఆదివాసులకు నరకం చూపించడం మృగలక్షణం అనే మాట సరిగ్గా సరిపోతుంది. మానవ నాగరిత ప్రారంభమైన అడవులను, మానవ జీవితం మొదలైన విధానాన్ని అంతం చేయడం అంటే నడవడానికి సహకరిస్తున్న కాళ్ళను నరికేసుకోవడమే. ఆ తరువాత ఈ ప్రపంచంలో మనిషి ఉనికి కోసం చాలా కష్టాలు పడి వెతకాలి. ఎందుకంటే మనుషులు మృగాలుగా మారిపోయాక నిజమైన మనుషులు కనబడతారో లేదో మరి.

 మనసున్నవారు ఆదివాసులకు చేతనైన సహాయం చెయ్యాలి. విద్య, వైద్యం వంటి వసతులు కలిగించాలి. అప్పుడు వాళ్ళు తమ సామర్త్యాన్ని చాటిచెబుతారు. సహాయం చేసే ఉద్దేశ్యం లేనివారు ఎవరి జీవితాల్ని వాఫు చూసుకోవాలి. అంతేకానీ వారి జీవితాలను దుర్భర పరిస్థితుల్లోకి నెట్టి వారిని ఇబ్బందిపెట్టకూడదు.

ప్రస్తుతం భారత రాష్ట్రపతిగా ఆదివాసీ మహిళ ద్రౌపతి ముర్ము ఎంపికైన సందర్భంగా చాలామంది ఆదివాసీ ప్రజల గురించి మాట్లాడుతున్నారు. అయితే ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఏ తెగలో అయినా ఏ జాతిలో అయినా ఒక వ్యక్తి దేశ స్థాయి పదవిని, గౌరవాన్ని పొందినంత మాత్రాన ఆ తెగలోనూ, ఆ జాతి లోనూ మార్పు వచ్చేయదు. ప్రతి మనిషి మేలైన జీవితం కోసం పాటుపడాల్సిందే. కాబట్టి వారి జీవితం కోసం తపించే ఆదివాసులని నొప్పించకండి.

                                          ◆నిశ్శబ్ద.

By
en-us Political News

  
చుట్టూ ఉన్నవాళ్లు అందరూ మంచివాళ్లు ఉండరు. మనుషుల్లో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ కొందరిలో స్వార్థం..
నేటి వేగవంతమైన జీవితంలో మనుషులకు అన్ని భౌతిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ, రెండు విషయాలలో మాత్రం  వెనుకబడిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మొదటిది గాఢమైన, నిజమైన సంబంధాలను నిలబెట్టుకోవడం కాగా, రెండవది మనశ్శాంతి లేకపోవడం
ప్రతి ఒక్కరూ దీర్ఘాయువును కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ వృద్ధాప్యాన్ని యవ్వనంలో ఉన్నంత ఆరోగ్యంగా, అద్భుతంగా గడపాలని, 100 ఏళ్ల వరకు బ్రతకాలని,  ఆ వయసులో కూడా ఎలాంటి వ్యాధులు లేకుండా ఉండాలని కోరుకుంటారు.
ప్రపంచంలో ప్రతి ప్రాణికి ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా మనిషికి ఏ మాత్రం అనారోగ్యంగా అనిపించినా మొదట వైద్యుడిని కలుస్తాడు.  వైద్యులు ఆరోగ్య జాగ్రత్తలు,  అనారోగ్యం తగ్గడానికి మందులు...
ఏ రిలేషన్ కు అయినా  మంచి కమ్యూనికేషనే  పునాది. అది స్నేహమైనా, కుటుంబమైనా, లేదా ఆఫీసు  వాతావరణమైనా, చక్కగా కమ్యూనికేట్ చేయడం అనేది..
ప్రేమ అనేది బార్యాభర్తలు, ప్రేమికుల మధ్య ఉండే మధురమైన అనుభూతి. నిజానికి  అన్ని బంధాలలో ప్రేమ ఉన్నా.. ప్రేమికులు, భార్యాభర్తల...
ఏ బంధం అయినా ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇద్దరు వ్యక్తుల మధ్య పరిస్థితులు,  సందర్బాలు చాలా మారుతూ ఉంటాయి. కొన్ని సార్లు అర్థం చేసుకోలేని పరిస్థితులు ఎదురవుతాయి,  మరికొన్ని సార్లు చాలా ఎమోషనల్ గా అటాచ్ అయిపోయి ఉంటారు...
ఆడపిల్లను కన్న ప్రతి తల్లిదండ్రి  పెద్దయ్యే వరకు అపురూపంగా ఒక యువరాణిలాగా పెంచుకుంటారు. కానీ వయసుకు వచ్చాక తప్పనిసరిగా పెళ్లి చేసి ఇంకొక ఇంటికి కోడలిగా పంపాల్సిందే.. అయితే భారతదేశంలో..
కూరల రుచిని పెంచడం నుండి సలాడ్‌ల వరకు టమోటాలను అన్నింటికీ ఉపయోగిస్తారు. చాలామంది కూరగాయల కంటే టయోటాలే ఎక్కువ కొనుగోలు చేస్తుంటాయి. అయితే  వేసవి కాలంలో టమోటాలను ఒకేచోట నిల్వ చేయడం ..
ప్రేమలో ఒక్కసారి మోసపోయినా.. మోసపోయిన వ్యక్తి కుంగిపోతాడు. ఆ మోసం వల్ల కలిగే బాధ నుండి కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది. ప్రేలో మోసపోయినా, ఇతరుల చేతుల్లో మోసపోయినా ఒకసారి జరిగితే దాన్ని పొరపాటుగా..
ప్రేమలు, వివాహ బంధాలు ఎందుకు విఫలమవుతున్నాయి? నమ్మకం, అవగాహన, స్వేచ్ఛ ప్రాముఖ్యత ఏమిటి? బ్రేకప్‌ల కారణాలు మరియు పరిష్కారాలపై సి. కళ్యాణ్ చెప్పిన ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి...
ప్రేమ,  సహజీవనం, పెళ్లి.. ఏదైనా కావచ్చు.. అమ్మాయిలు అబ్బాయిలతో రిలేషన్ లో ఉండటం నేటి కాలంలో జరుగుతోంది.  రిలేషన్ లో ఉన్నప్పుడు అమ్మాయిలు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు..
భార్యాభర్తల సంబంధాలలో ప్రేమ, నమ్మకం , సాన్నిహిత్యం చాలా అవసరం. కౌగిలించుకోవడం, చేతులు పట్టుకోవడం లేదా కేవలం ఆప్యాయతను వ్యక్తపరచడం వంటివి ఏ వివాహ బంధాన్నైనా బలపరుస్తాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.