అత్యాచారం చేసిన సౌదీ దౌత్యవేత్తకి శిక్ష పడుతుందో లేదో?

Publish Date:Sep 10, 2015

Advertisement

 

నేటికీ రాజరిక పరిపాలన కొనసాగుతున్న సౌదీ అరేబియాలో చిన్నపాటి నేరాలకి కూడా కటినమయిన శిక్షలు అమలు చేస్తుంటారు. ఇక హత్యలు, మానభంగాల కేసులలో అయితే ఇక ప్రాణాల మీద ఆశలు వదులుకోవలసిందే. ఆ శిక్షలు కూడా మామూలుగా ఉండవు. అటువంటి కేసుల్లో చాలాసార్లు శిరచ్చేదనం చేస్తారు.

 

అదే ఒక సౌదీ దౌత్యవేత్త పదేపదే ఇద్దరు మహిళలను రోజుల తరబడి మానభంగం చేస్తే? తను మానభంగం చేయడమే కాకుండా తన స్నేహితుల చేత కూడా వారిని మానభంగం చేయిస్తుంటే? రోజూ వారిని మానభంగం చేస్తూనే వారికి తినడానికి తిండి కూడా ఇవ్వకుండా వారి చేత ఇంట్లో గొడ్డు చాకిరీ చేయించుకొంటుంటే? ఎటువంటి శిక్షలు విధించాల్సి ఉంటుందో సౌదీ ప్రభుత్వమే చెప్పాల్సి ఉంది.

 

డిల్లీలోగల సౌదీ ఎంబసీలో పనిచేస్తున్న ఒక సౌదీ అధికారి ఇంట్లో ఇద్దరు నేపాలీ మహిళలు పనిమనుషులుగా చేస్తున్నారు. వారిలో ఒకామె వయసు 50సం.లు మరొకరిది 30సం.లు. వారిరువురూ తమ కుటుంబాలను పోషించుకొనేందుకు సౌదీ అరేబియా వెళ్లి డబ్బు సంపాదించుకోవాలని ఆశ పడ్డారు. కానీ ఒక నేపాలీ ఏజెంట్ వారిని సదరు సౌదీ అధికారి ఇంట్లో పనికి కుదిర్చాడు. అప్పటి నుండి అతను వారిరువురికీ ఈ భూమ్మీద నరకం అంటే ఏమిటో చూపించాడు. రోజుల తరబడి ఆహారం లేకుండా ఇంటి పని చేయవలసి వచ్చేది. అంతే కాకుండా అతనికి రోజూ మసాజులు చేయడం, ఆ తరువాత అతను, అతని ఇంటికి వచ్చే స్నేహితుల చేతిలో మాన భంగానికి గురికావడం చాలా రోజులుగా సాగుతోంది. వారిద్దరినీ మెయితీ-ఇండియా అనే స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు బాలకృష్ణ పాండే రక్షించకపోయుంటే వారు ఏదో ఒకరోజు శవాలయి తేలేవరేమో?

 

వారిని గుర్ గావ్ క్రైం బ్రాంచ్ పోలీసులకి అప్పగించడంతో ఈ వ్యవహారం అంతర్జాతీయ సమస్యగా మారిపోయింది. వారిరువురినీ ఆసుపత్రిలో చేర్పించి వైద్య చికిత్సలు అందించి, వారిపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారించుకొన్నారు. సదరు అధికారి దౌత్యవేత్తగా పనిచేస్తున్నందున దౌత్యపరమయిన రక్షణ కలిగి ఉంటాడు. కానీ ఆ సంగతి తెలియక అతనిని అరెస్ట్ చేసేందుకు ఇద్దరు పోలీసులు సౌదీ ఎంబసీలోకి సోమవారం ప్రవేశించారు. సౌదీ ఎంబసీలోకి పోలీసులు అనుమతి లేకుండా ప్రవేశించి తమ పరిధిని అతిక్రమించారని, అది వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని, కనుక వారిపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరుతూ సౌదీ రాయబారి సౌద్ అల్ సతి, భారత విదేశాంగ శాఖలో గల్ఫ్ దేశాల జాయింట్ సెక్రటరీ తంగ్లూర దార్లంగ్ కి పిర్యాదు చేసారు.

 

ప్రస్తుతం సదరు అధికారిని అరెస్ట్ చేయడానికి వీలులేదు కనుక విదేశాంగ శాఖ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామని క్రైం ఏ.సి.పి. రాజేష్ కుమార్ తెలిపారు. ఆ సౌదీ అధికారిని అరెస్ట్ చేయలేకపోయినా అతనితో కలిసి ఈ హేయమయిన నేరానికి పాల్పడిన వారిని పట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ వారికి దౌత్యపరమయిన రక్షణ కలిగి ఉండి ఉంటే వారినీ అరెస్ట్ చేయడం సాధ్యం కాదని ఆయన తెలిపారు. ఈ వ్యవహారంపై ఇప్పుడు భారత్-సౌదీ విదేశాంగ శాఖ అధికారులు చర్చిస్తున్నారు. బాధిత మహిళలు ఇద్దరూ నేపాల్ దేశానికి చెందిన వారు కావడంతో ఇప్పుడు ఇది మూడు దేశాలకు సంబంధించిన సమస్యగా మారింది.

 

కానీ ఇటువంటి నేరాలకు కటినమయిన శిక్షలు అమలు చేస్తున్న సౌదీ అరేబియా ప్రభుత్వం తమ దేశ దౌత్యవేత్తకి కూడా అదే విధంగా శిక్షిస్తుందో లేక అధికారులకొక న్యాయం సామాన్య ప్రజలకు మరొక న్యాయం అని అంటుందో వేచి చూడాలి.

By
en-us Political News

  
ఇద్దరు అధికారులు దివంగత వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలకమైన శాఖలు నిర్వహించిన వారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ చేతిలో వీరిద్దరూ తీరని అవమానాలకు గురౌతున్నారు.
భారతీయ జనతా పార్టీ దిగుమతుల విభాగం నుంచి డంప్ అయిన జి వి ఎల్ నరసింహారావు , అలాగే తెలుగు దేశం నుంచి బీ జె పి లోకి దిగుమతి అయిన సుజనా చౌదరి, సి ఎం రమేష్, టీ జీ వెంకటేష్...
సినిమాలలో ఎన్నో క్రైమ్ స్టోరీలు, ఎన్నో కిడ్నాప్ సీన్లు చూసుంటారు. అయితే.. కాకినాడలో జరిగిన ఈ రియల్ స్టోరీ ముందు ఆ రీల్ స్టోరీలన్నీ చిన్నబోతాయి. పేరున్న రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న అధికారులు.. ఇలా భారీ తారాగణం నటించిన..
తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్ల కోసం అధికార టీఆర్ఎస్‌లో  పోటాపోటీ నెలకొంది. షెడ్యూల్‌ ప్రకారం రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్‌ మార్చి 6న జారీ కానుంది. 13వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది.
రాజకీయాల్లో ఓడలు బళ్లు అవుతాయి. బళ్లు ఓడలవుతాయి. ప్రజాస్వామ్యంలో ఇది సాధారణమే. ప్రస్తుతం దేశంలోనూ, అనేక రాష్ట్రాల్లోనూ ఇదే జరుగుతోంది. నిన్నమొన్నటివరకు దేశంలోనూ, ఆయా రాష్ట్రాల్లో చక్రం తిప్పినవారంతా...
అమావాస్య రోజు చందమామని చూడాలనుకోవడం, రాజకీయాలలో విలువలు గురించి మాట్లాడాలనుకోవడం ఒకటే అంటుంటారు. అవును ఈ తరం రాజకీయాలను చూస్తే నిజమే అనిపిస్తుంది...
ఆంధ్రప్రదేశ్ లో సొంతంగానే బలపడతాం అని ప్రతి రోజూ ప్రకటనలు గుప్పిస్తున్న భారతీయ జనతా పార్టీ అందుకు ఎలాంటి వ్యూహాలు రచిస్తోంది అంటే? భలే ప్రశ్న అడిగారండి, ఆ విషయం ఆ పార్టీ నాయకులకే తెలియడం లేదు...
60వ దశకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు' నినాదం మార్మోగింది. కుల,మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు విశాఖలో ఉక్కు కర్మాగారం కోసం ఉద్యమించి భారీ ఉద్యమం చేసి దాన్ని సాధించుకున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రెండు సార్లు ముఖ్యమంత్రి, నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు తెరిస్తే హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టింది నేనే. సైబరాబాద్ నిర్మాతను నేను. అని చెప్తూ ఉంటారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఐదు ఆర్ధిక సంవత్సరాల్లో మొత్తం 47,682.87 కోట్ల రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని పొందింది. దేశం మొత్తం మీద ఓవర్ డ్రాఫ్ట్ (ఓ.డి.) అత్యధిక మొత్తం పొందిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలవటంతో...
ఇద్దరు నేతలు...వారి వ్యవహార శైలి.. ...ప్రస్తుతం రాష్ట్రం లో నలుగుతున్న చర్చ ఇదే. ఒకరు సంక్షోభాల నుంచి అవకాశాలను సృష్టించే ఫిలాసఫి నిర్మాతలైతే, మరొకరు..పైన దేవుడున్నాడు... నాన్న చూస్తున్నాడు...
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పటి వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ దాదాపు గా అప్రూవర్ గా మారబోతున్నట్టు సమాచారం. ఈ సంగతి తెలుగుదేశాధినేతకు శరాఘాత సమానమైన విషయమైనప్పటికీ...
ఇది మరో సంక్షోభం... మొన్న జాస్తి కృష్ణ కిషోర్... ఈ రోజు ఏ.బి. వెంకటేశ్వర రావు. కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వితే, కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ మంత్రిత్వ శాఖ ఏ రకంగా స్పందించిందో ఇప్పటికే అనుభవైనప్పటికీ...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.