సత్తిబాబు మాస్టర్ ప్లాన్!.. జనసేనలోకి బొత్స లక్ష్మణ్

Publish Date:Sep 26, 2024

Advertisement

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యానారాయణ ముందు జాగ్రత్త పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీకి మనుగడ లేదన్న గ్రహింపునకు వచ్చేశారా? పార్టీ తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చానా.. వైసీపీలో కొనసాగితే రాజకీయ భవిష్యత్ ఉండదని భయపడుతున్నారా అంటే రాజకీయవర్గాల నుంచి ఔనన్న సమాధానమే గట్టిగా వినిపిస్తోంది. అయితే నిన్న గాక మొన్న వైసీపీ తరఫున ఎమ్మెల్సీ అయిన తాను పార్టీ మారితే బాగుండదని భావించి ముందుగా తన అనుయాయులను, బంధుగణాన్ని వైసీపీని వీడమని సూచిస్తున్నారని, అందులో బాగంగానే వైసీపీ నుంచి ముందుగా తన సోదరుడు బొత్స లక్ష్మణ్ ను గట్టు దాటించేయాని నిర్ణయించుకున్నారు. త్వరలో బొత్స లక్ష్మణ్ వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరనున్నారు.

బొత్స సత్యనారాయణ పాలిటిక్స్ అంటేనే ఫ్యామిలీ ప్యాకేజ్.. వైఎస్ హయాంలో జిల్లాలో దాదాపు అన్ని పదవుల్లోనూ ఆయన బంధుజనమే ఉన్నారు. బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లాలో గట్టి పట్టున్న నేత అనడంలో సందేహం లేదు. ఆయనతో పాటు భార్య, సోదరులు, బంధువులు కూడా ఎంపీగా, ఎమ్మెల్యేలుగా జిల్లా నుంచి విజయం సాధించిన వారే. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచే బొత్స సత్యనారాణ తిరుగులేని నేతగా ఉన్నారు. జిల్లాలో  ఆయన తిరుగులేని పట్టు సాధించారు. 2014, 2024 ఎన్నికలలో వినా  జిల్లాలో ఆయన కుటుంబానిదే ఆధిపత్యం. వైఎస్ మరణం తరువాత కొంత కాలం జగన్ తో కలిసి నడిచిన బొత్స ఆ తరువాత జగన్ సొంతంగా వైసీపీ పార్టీ ఏర్పాటు చేసిన తరువాత కూడా బొత్స కాంగ్రెస్ లోనే కొనసాగారు.

2014 ఎన్నికల తరువాత ఎప్పుడో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించింది. అప్పుడు జగన్ తొలి క్యాబినెట్ లో బొత్స ఉన్నారు. ఆ తరువాత పునర్వ్యవస్థీకరణలోనూ బొత్స తన మంత్రి పదవిని కాపాడుకోగలిగారు. అయితే అప్పుడు అంటే జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో బొత్సకు కోరుకున్న మంత్రి పదవి అయితే దక్కలేదు. ఆ అసంతృప్తి అప్పట్లో స్పష్టంగా కనిపించింది. విద్యాశాఖ అధికారులెవరూ జగన్ ను లెక్క చేయని పరిస్థితి ఉండేది. అప్పట్లోనే తెలుగు వన్  జగన్ కేబినెట్ లో సీనియర్ల చిటపటలు అన్న శీర్షికతో బొత్స అసంతృప్తిపై వార్తాకథనం ప్రచురించింది. 

ఇది కూడా చదవండి .. జగన్ కాబినెట్లో సీనియర్ల చిటపటలు 

ఇక గతంలో జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా బొత్సలో పేరుకున్న అసంతృప్తి అలాగే ఉండిపోయింది. అయినా సంయమనం పాటించి పార్టీలో కొనసాగారు. సకల శాఖల మంత్రిగా గుర్తింపు పొందిన గత ప్రభుత్వ ముఖ్య సలహాదారుతో కలిసి వైసీపీ పాపాలన్నిటిలోనూ సింహభాగం పంచుకున్నారు.  సరే వైసీపీ ఘోర పరాజయం తరువాత కూడా వైసీపీలోనే  కొనసాగుతున్నారు. పార్టీలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమైనా ఎమ్మెల్సీ సాధించడంలో బొత్స తన రాజకీయ చాణక్యాన్ని చాటుకున్నారు. అయినా వైసీపీ ఎమ్మెల్సీగా ఉంటే రాజకీయ భవిష్యత్ ఉండదన్న భయం, గతంలో అంటే తనకు అప్రాధాన్య శాఖ ఇచ్చి జగన్ అవమానించారన్న కోపం మాత్రం అలాగే ఉండిపోయినట్లున్నాయి. అందుకే అదును చూసి పావులు కదుపుతున్నారు. ముందుగా తన సోదరుడిని జనసేనలోకి పంపుతున్నారు. ఆ తరువాత వరుసగా ఆయన ఫ్యామిలీ ప్యాకేజీని జనసేనకు పరిచయం చేస్తారు. బొత్స వ్యవహారశైలి తెలిసిన అందరూ ఇదే అంటున్నారు.

ఇక బొత్స కుటుంబంలో బొత్స మాటే ఫైనల్ అందుకే బొత్స చెప్పగానే మారు మాట్లాడకుండా బొత్స లక్ష్మణ్ వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరడానికి రెడీ అయిపోయారు. ఆయన వెంట.. ఒకరి తరువాత ఒకరుగా బొత్స సహా ఆయన బంధుగణం అంతా జిల్లాలో వైసీపీ జెండాను పీకేసి జనసేనకు జై కొట్టడానికి ఎంతో సమయం పట్టదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికల్లో  బొత్స కుటుంబం మొత్తం కొట్టుకుపోయింది. బొత్స ఒక్కరే  ఎమ్మెల్సీ  అయ్యారు. అయితే అధికారం లేని పార్టీ ఎమ్మెల్సీగా బొత్స బావుకునేదేమీ ఉండదు. అందుకే  తన దారి తాను చూసుకోవడానికి, తనతో పాటు తన బంధుగణాన్నీ రాజకీయ సమాధి నుంచి కాపాడేందుకు జనసేనకు చేరువ అవుతున్నారని చెబుతున్నారు.  

By
en-us Political News

  
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో కీలక సమావేశం నిర్వహించారు.
కేవలం మర్యాదపూర్వక భేటీలుగా వీటిని చూడలేమని, దీని వెనుక తెలంగాణలో ఎన్డీయే కూటమిని బలోపేతం చేసే భారీ వ్యూహం దాగి ఉందనీ ప్రముఖ విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ప్రధాని మోదీ చంద్రబాబు నాయుడు నివాసంలో గంటకు పైగా గడపడం.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పరామర్శించడం వెనుక లోతైన రాజకీయ అర్థాలు ఉన్నాయన్నారు.
తమిళనాడు ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా ఏటా సుమారు రూ.48వేల‌ కోట్ల ఆదాయం వస్తోంది. ప్రస్తుతం మూసివేసినవి కేవలం 717 దుకాణాలు మాత్రమే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దుకాణాల్లో ఇది కేవ‌లం 15శాతం మాత్ర‌మే. ఇందువల్ల ఆదాయంలో కొంత తగ్గుదల ఉన్నప్పటికీ, అది భారీ నష్టం కాకపోవచ్చు.
తమిళనాట కొత్త రాజకీయానికి తెర తీసిన నటుడు దళపతి విజయ్… ప్రత్యేకతను చాటుతున్నారు. తమిళ సంప్రదాయానికి భిన్నంగా పంచెకట్టును పక్కనపెట్టేసిన విజయ్, సూట్ వేసుకుని మరీ ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అది పక్కన పెడితే.. రాజకీయాలలో విలువలకు పెద్ద పీట వేస్తాననడానికి సంకేతంగా సీఎం హోదాలో విజయ్ తాజా మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ఇంటికి వెళ్లి మరీ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
పార్టీలోని ఒక కీలక వర్గం దళపతి విజయ్ తమిళగ వెట్రి కళగం వైపు మొగ్గు చూపుతోంది. విలుప్పురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సి.వి. షణ్ముగం, ఆయన వర్గంలోని కీలక నేతలు విజయ్ పార్టీ వైపు చూస్తున్నారన్న చర్చ తమిళనాట జోరుగా సాగుతోంది.
అభిషేక్ బెనర్జీ గత దశాబ్దంగా అత్యున్నత స్థాయి భద్రతా వలయంలో ఉంటూ వచ్చారు. అయితే సోమవారం సాయంత్రం జారీ చేసిన పరిపాలనా ఉత్తర్వుల ప్రకారం, ఆయనకు కేటాయించిన అదనపు సెక్యూరిటీ సిబ్బందిని, ప్రత్యేక పైలట్ వాహనాలను ఉపసంహరించారు. ఇకపై ఆయనకు ఒక సాధారణ పార్లమెంటు సభ్యుడికి ఉండే భద్రత మాత్రమే ఉంటుంది.
కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) కీలక నిర్ణయం తీసుకుంది.
మాములుగా మోడీ లోకేష్ తో క్లోజ్ గా ఉండే ఫోటోల‌కే లెక్క‌లేన‌న్ని కామెంట్లు వ‌స్తుంటాయి. అలాంటిది లోకేష్ త‌న‌యుడికి కూడా మోడీ ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేకంగా ముచ్చటించడం ప్రాథాన్యత సంతరించుకుంది. చంద్రబాబు, లోకేష్ తో పాటు నారా వారి ఇంట మూడో తరం పిల్లవాడు దేవాన్ష్ కు కూడా ప్రధాని మోడీ ఇంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణాలేంటంటూ.. నెటిజనులు పలు విధాలుగా స్పందిస్తున్నారు.
డీఎంకే శాసన సభాపక్ష ఉపనేతగా పార్టీ సీనియర్ నాయకుడు కేఎన్ నెహ్రూ, పార్టీ విప్‌గా ఈవీ వేలు నియమితులయ్యారు. అంతకు ముందు డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. కూటమిని వీడిన కాంగ్రెస్‌ను విమర్శిస్తూ ఈ సమావేశం తీర్మానం చేసింది.
రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ఇందు కోసం చంద్రబాబు సోమవారం (మే 11) ఉదయం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఆయన అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.
ప్రధాని మోడీ తమ నివాసానికి వచ్చిన సందర్భంగా ఆయనతో కుటుంబం దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా.. దానికి ఒక భావోద్వేగ వ్యాఖ్యను జోడించారు. మా ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటానని ప్రధానికి ప్రామిస్ చేశానని పేర్కొన్నారు.
తెలంగాణ సీఎం తనతో చేతులు కలపితే.. పూర్తి స్థాయిలో సాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ ప్రధాని రేవంత్ కు ఇచ్చిన ఆఫర్ సంచలనం రేపింది. రేవంత్ ను బీజేపీలో చేరమని ప్రధాని కోరుతున్నారా? అంటూ నెటిజనులు ప్రశ్నిస్తున్నారు.
త‌న ప్ర‌భుత్వ అప్పుల‌పై విజ‌య్ విమ‌ర్శ‌లు గుప్పించి, హామీల అమ‌లు నుంచి త‌ప్పించుకోడానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఈ మేర‌కు విజ‌య్ ఆరోప‌ణ‌ల‌పై స్టాలిన్ విడుదల చేసిన ఓ ప్రకటనలో.. మోస‌పూరిత ప్ర‌క‌ట‌న‌ల‌తో ప్ర‌జ‌ల్ని త‌ప్పుదారి ప‌ట్టించొద్ద‌ని హిత‌వు చెబుతూనే.. ఉచిత విద్యుత్‌, మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌, మాద‌క ద్ర‌వ్యాల ర‌వాణా అడ్డుకునేందుకు మొద‌టి సంత‌కం చేసిన విజ‌య్‌ని స్టాలిన్ అభినందించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.