సత్తిబాబు మాస్టర్ ప్లాన్!.. జనసేనలోకి బొత్స లక్ష్మణ్

Publish Date:Sep 26, 2024

Advertisement

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యానారాయణ ముందు జాగ్రత్త పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీకి మనుగడ లేదన్న గ్రహింపునకు వచ్చేశారా? పార్టీ తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చానా.. వైసీపీలో కొనసాగితే రాజకీయ భవిష్యత్ ఉండదని భయపడుతున్నారా అంటే రాజకీయవర్గాల నుంచి ఔనన్న సమాధానమే గట్టిగా వినిపిస్తోంది. అయితే నిన్న గాక మొన్న వైసీపీ తరఫున ఎమ్మెల్సీ అయిన తాను పార్టీ మారితే బాగుండదని భావించి ముందుగా తన అనుయాయులను, బంధుగణాన్ని వైసీపీని వీడమని సూచిస్తున్నారని, అందులో బాగంగానే వైసీపీ నుంచి ముందుగా తన సోదరుడు బొత్స లక్ష్మణ్ ను గట్టు దాటించేయాని నిర్ణయించుకున్నారు. త్వరలో బొత్స లక్ష్మణ్ వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరనున్నారు.

బొత్స సత్యనారాయణ పాలిటిక్స్ అంటేనే ఫ్యామిలీ ప్యాకేజ్.. వైఎస్ హయాంలో జిల్లాలో దాదాపు అన్ని పదవుల్లోనూ ఆయన బంధుజనమే ఉన్నారు. బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లాలో గట్టి పట్టున్న నేత అనడంలో సందేహం లేదు. ఆయనతో పాటు భార్య, సోదరులు, బంధువులు కూడా ఎంపీగా, ఎమ్మెల్యేలుగా జిల్లా నుంచి విజయం సాధించిన వారే. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచే బొత్స సత్యనారాణ తిరుగులేని నేతగా ఉన్నారు. జిల్లాలో  ఆయన తిరుగులేని పట్టు సాధించారు. 2014, 2024 ఎన్నికలలో వినా  జిల్లాలో ఆయన కుటుంబానిదే ఆధిపత్యం. వైఎస్ మరణం తరువాత కొంత కాలం జగన్ తో కలిసి నడిచిన బొత్స ఆ తరువాత జగన్ సొంతంగా వైసీపీ పార్టీ ఏర్పాటు చేసిన తరువాత కూడా బొత్స కాంగ్రెస్ లోనే కొనసాగారు.

2014 ఎన్నికల తరువాత ఎప్పుడో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించింది. అప్పుడు జగన్ తొలి క్యాబినెట్ లో బొత్స ఉన్నారు. ఆ తరువాత పునర్వ్యవస్థీకరణలోనూ బొత్స తన మంత్రి పదవిని కాపాడుకోగలిగారు. అయితే అప్పుడు అంటే జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో బొత్సకు కోరుకున్న మంత్రి పదవి అయితే దక్కలేదు. ఆ అసంతృప్తి అప్పట్లో స్పష్టంగా కనిపించింది. విద్యాశాఖ అధికారులెవరూ జగన్ ను లెక్క చేయని పరిస్థితి ఉండేది. అప్పట్లోనే తెలుగు వన్  జగన్ కేబినెట్ లో సీనియర్ల చిటపటలు అన్న శీర్షికతో బొత్స అసంతృప్తిపై వార్తాకథనం ప్రచురించింది. 

ఇది కూడా చదవండి .. జగన్ కాబినెట్లో సీనియర్ల చిటపటలు 

ఇక గతంలో జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా బొత్సలో పేరుకున్న అసంతృప్తి అలాగే ఉండిపోయింది. అయినా సంయమనం పాటించి పార్టీలో కొనసాగారు. సకల శాఖల మంత్రిగా గుర్తింపు పొందిన గత ప్రభుత్వ ముఖ్య సలహాదారుతో కలిసి వైసీపీ పాపాలన్నిటిలోనూ సింహభాగం పంచుకున్నారు.  సరే వైసీపీ ఘోర పరాజయం తరువాత కూడా వైసీపీలోనే  కొనసాగుతున్నారు. పార్టీలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమైనా ఎమ్మెల్సీ సాధించడంలో బొత్స తన రాజకీయ చాణక్యాన్ని చాటుకున్నారు. అయినా వైసీపీ ఎమ్మెల్సీగా ఉంటే రాజకీయ భవిష్యత్ ఉండదన్న భయం, గతంలో అంటే తనకు అప్రాధాన్య శాఖ ఇచ్చి జగన్ అవమానించారన్న కోపం మాత్రం అలాగే ఉండిపోయినట్లున్నాయి. అందుకే అదును చూసి పావులు కదుపుతున్నారు. ముందుగా తన సోదరుడిని జనసేనలోకి పంపుతున్నారు. ఆ తరువాత వరుసగా ఆయన ఫ్యామిలీ ప్యాకేజీని జనసేనకు పరిచయం చేస్తారు. బొత్స వ్యవహారశైలి తెలిసిన అందరూ ఇదే అంటున్నారు.

ఇక బొత్స కుటుంబంలో బొత్స మాటే ఫైనల్ అందుకే బొత్స చెప్పగానే మారు మాట్లాడకుండా బొత్స లక్ష్మణ్ వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరడానికి రెడీ అయిపోయారు. ఆయన వెంట.. ఒకరి తరువాత ఒకరుగా బొత్స సహా ఆయన బంధుగణం అంతా జిల్లాలో వైసీపీ జెండాను పీకేసి జనసేనకు జై కొట్టడానికి ఎంతో సమయం పట్టదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికల్లో  బొత్స కుటుంబం మొత్తం కొట్టుకుపోయింది. బొత్స ఒక్కరే  ఎమ్మెల్సీ  అయ్యారు. అయితే అధికారం లేని పార్టీ ఎమ్మెల్సీగా బొత్స బావుకునేదేమీ ఉండదు. అందుకే  తన దారి తాను చూసుకోవడానికి, తనతో పాటు తన బంధుగణాన్నీ రాజకీయ సమాధి నుంచి కాపాడేందుకు జనసేనకు చేరువ అవుతున్నారని చెబుతున్నారు.  

By
en-us Political News

  
తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.
అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు.
ఆదివారం తన 53వ పుట్టిన రోజు జరుపుకున్న జగన్ కు చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిల తదితరులు సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు ప్రతిగా జగన్ కూడా ఒక్క మంత్రి లోకేష్ కు తప్ప మిగిలిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి దయనీయంగా మారిందన్న ఆయన గత పదేళ్ల అధికార గర్వంతో విర్రవీగిన నేతల కండలు ఇప్పుడు కరిగిపోయాయని ఎద్దేవా చేశారు.
రాజకీయ ప్రత్యర్థులే కాదు.. ప్రభుత్వ విధానాలు సరిగా లేవన్న సామాన్యులపై కూడా జగన్ పాలనలో దాడులు జరిగాయి. ఇక అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలూ సరే సరి. సరే జనం విషయం గుర్తించి 2019లో తాము కట్టబెట్టిన అధికారాన్ని 2024 ఎన్నికలలో లాగేసుకుని అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ చంద్రబాబుకు అప్పగించారు.
చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు.
ఆదివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ తెలపడంలోనూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చెల్లెలిగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ గారికి అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
సోషల్ మీడియాలో జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద వెలసిన ఓ భారీ కటౌట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు.
భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అన్న విజయసాయి.. అటువంటి దేశంలో ఉంటూ.. బంగ్లాలో హిందువులు లక్ష్యంగా సాగుతున్న దాడులపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ దాడులకు ఖండించని వారు దేశ భక్తులే కాదని విజయసాయి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కోర్టుకు వెడదామా? అంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ జీవోలోనే స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్లడం ఎలా అన్నది అర్ధం కాక వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు.
తాను ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసిన తొలి సారే పరాజయం పాలైన సంగతిని గుర్తు చేసుకున్న ఆయన, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని, ఓడిన చోటే గెలవాలన్న పట్లుదలతో పని చేసి ఫలితం సాధించానని లోకేష్ వివరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.