Publish Date:Oct 11, 2022
ఎంత బాగా ఆడినా, ఎంతగా ప్రశంసలు పొందినా కొందరికి దురదృష్టం వెన్నాడుతూనే ఉంటుంది. చాలా కాలం నుంచి భారత్ జట్టులో కీలకపాత్రవహించి జట్టు విజయాల్లో పాలుపంచుకోవాలనుకున్న స్టార్ బ్యాట్స్ మన్లు ప్రపంచకప్ జట్టుకి ఎంపిక కాకుండా జట్టుకు దూరం కావడం జరుగుతూనే ఉంది. అం దుకు పెద్ద ఉదాహరన వివిఎస్ లక్ష్మణ్. ఇపుడు సంజూ శాంసన్. సంజూ 2022 ప్రపంచకప్ కి చివరి నిమి షంలో అవకాశం కోల్పోయాడు.
సంజూ ఇటీవల ఎంతో అద్భుతంగా రాణిస్తున్న బ్యాటర్లలో ఒకడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో తలపడుతు న్న వన్డే సిరీస్ మొదటి మ్యాచ్లో 63 బంతుల్లో 86 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నిం గ్స్ సెలక్టర్లను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రేక్షకులు, తోటి ప్లేయర్లు అతన్ని వరల్డ్ కప్ జట్టులో ఉండా లని కోరు కున్నారు. కానీ అతనికి దినేష్ కార్తిక్, రిషబ్ పంత్ గట్టిపోటీనే ఇచ్చారు. రాంచీలో జరిగిన రెండో మ్యాచ్ లో కూడా 36 బంతుల్లో 30 పరుగులు చేయడంలో జట్టు కీలకదశలో ఇన్నింగ్స్ను నిలబెట్ట డంలో నమ్మదగ్గ బ్యాటర్గా ఆకట్టుకున్నాడు. శ్రేయస్ అద్బుత సెంచరీ చేయడంతో సిరీస్ బెస్ట్ ప్లేయర్గా నిలిచినప్పటికీ, సంజూ శాంసన్ ఎంతో మంచి ప్లేయర్గా అందరి మన్ననలు అందు కున్నాడు.
దక్షిణాఫ్రికా, భారత్ వన్డే సిరీస్లో సంజూ తన స్థాయిని ప్రదర్శించడానికి, సెలక్టర్లను ఆకట్టుకోవడానికి కాయ కష్టం చేశాడు. కానీ అదృష్టం వరించలేదు. అతని స్థానంలో రిషబ్ పంత్, దినేష్ కార్తీక్లకు అవ కాశం ఇచ్చారు. అయితే, బ్యాటింగ్ లైన్లో 5వ స్థానంలో చెప్పుకోదగ్గ బ్యాటర్గా సెలక్టర్లు గుర్తిం చారు. అయితే, దినేష్ కార్తీక్ కూడా లేట్గా గొప్ప గుర్తింపు పొందిన ప్లేయర్గానే గుర్తింపు పొంది జాతీయ జట్టు లోకి రావడం గమనార్హం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sanju-samson-missed-out-world-cup-chance-39-145251.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.