బాలివుడ్ కి శాపం కానున్న సంజయ్ దత్త్ జైలుశిక్ష
Publish Date:Mar 22, 2013
Advertisement
బాలివుడ్ నటుడు సంజయ్ దత్త్ కు, అక్రమ ఆయుధాలు కలిగిఉన్న నేరంలో 5ఏళ్ల జైలు శిక్ష విదిస్తూ సుప్రీం కోర్టు నిన్న ఇచ్చిన తీర్పుతో బాలివుడ్ లో కలకలం రేగింది. గతంలో ఆయన 18 నెలలు శిక్ష అనుభవించినందున మిగిలిన కాలం 42 నెలలు అంటే మూడున్నర సం.లు జైలులో ఉండక తప్పదు. గతంలో జైలు జీవితం అనుభవించిన తరువాత ఆయనలో చాలా మంచి మార్పు రావడంతో, బాలివుడ్ లో ఆయన మంచి పేరు సంపాదించుకొని అనేక సినిమాలు కూడా చేస్తున్నారు. ఆ కారణంగానే నేడు ఆయనకీ అందరూ సానుభూతి చూపిస్తున్నారు. అయితే ఆయన ఇప్పుడు ఏకంగా మూడున్నర సం.లు జైలులో గడపాల్సివస్తే వివిధ స్థాయిల్లో ఉన్నఆయన నటిస్తున్న, నటించబోయే సినిమాల నిర్మాతలు తీవ్రంగా నష్టపోక తప్పదు. బాలివుడ్ నిర్మాతలు దాదాపు రూ.250 కోట్లు ఆయన సినిమాలపై పెట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో అన్నిటికంటే ముందుగా చెప్పుకోవలసింది మెగా పవర్ స్టార్ రాం చరణ్ తేజ్ మొట్ట మొదటిసారిగా హిందీ లో చేస్తున్న ‘జంజీర్’ సినిమా. అందులో సంజయ్ దత్త్ గతంలో ప్రాణ్ చోప్రా చేసిన షేర్ ఖాన్ పాత్రను పోషిస్తున్నారు. అదృష్టవశాత్తు ఆ సినిమా షూటింగు ఇటీవలే పూర్తయి, ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉంది గనుక, ఆయన జైలుకి వెళ్ళడం వలన తమ సినిమా ఆగిపోయే ప్రమాదం లేదని ఆ సినిమా నిర్మాత అమిత్ మెహరా అన్నారు. దాదాపు రూ.50-60 కోట్ల భారీ వ్యయంతో తెలుగు(తుఫాన్) హిందీ బాషలలో నిర్మిస్తున్నఈ సినిమా గండం గట్టెక్కినప్పటికీ, అందరికీ ఆ అదృష్టం ఉండదు. సంజయ్ దత్త్ ప్రస్తుతం ‘ఉంగ్లీ’ అనే హిందీ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. పీపీ అగర్వాల్ నిర్మిస్తున్న ‘పోలీస్ గిరి’ అనే మరో సినిమా షూటింగ్ కూడా మధ్యలో ఉంది. రెంటిలో కూడా సంజయ్ దత్త్ చేయవలసిన పోర్షనులో చాల భాగం షూటింగు పూర్తయిందని, ఇప్పుడు మిగిలిన భాగం ఏవిధంగా పూర్తిచేయలో అర్ధం కావట్లేదని నిర్మాతలు అన్నారు. కోర్టు ఇచ్చిన నాలుగు వారాలలో సంజయ్ దత్త్ తో మిగిలిన భాగం పూర్తిచేయడం అసాద్యం గనుక, ఆయన వేసే రివ్యు పిటిషన్ పై కోర్టు స్పందన చూసిన తరువాత, అర్ధంతరంగా ఆగిపోయిన తమ సినిమాలను పూర్తి చేసేందుకు తామే కోర్టును ఆశ్రయించి ఆయనను తాత్కాలికంగా బెయిలుపై విడుదల చేయవలసిందిగా కోరుతామని వారు అన్నారు. ఇక ఈ రెండు సినిమాల పరిస్థితి ఈ విధంగా ఉంటే, సంజయ్ దత్త్ ‘పీకే’, మున్నాభాయ్’ అనే మరో రెండు హిందీ సినిమాలకు కూడా ఇటీవలే ఒప్పందాలు చేసుకొన్నారు. ఆయనకు మంచి పేరు ప్రతిష్టలు, సినిమా నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టిన ‘మున్నాభాయ్ యమ్బీ బీయస్’ (తెలుగులో శంకర్ దాదా యమ్బీ బీయస్) సినిమాకు మూడో భాగంగా తీయబోయే ఈ సినిమా మరియు ‘పీకే’ రెండూ కూడా ఇక ఇప్పుడు పూర్తిగా ఆగిపోయినట్లే భావించవచ్చును.
http://www.teluguone.com/news/content/sanjay-dutt-32-21828.html
హాయిగా నవ్వుకునే టిట్ బిట్స్ వున్న ఫన్ బక్కెట్ కామెడీ పదమూడో ఎపిసోడ్ని ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయండి..
మొన్నీమధ్య విడుదలైన గోపీచంద్ ‘సౌఖ్యం’ సినిమా మీద మన సక్కుబాయి రివ్యూ ఏమిటో చూసేద్దామా?
డిసెంబర్ 27, 2015 నుంచి జనవరి 02, 2016 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ రెండు నిమిషాల నిడివి వున్న ఫన్ బక్కెట్ పన్నెండో కాపీ చూడండి.. మీకు నచ్చి తీరుతుంది. మాదీ గ్యారంటీ..
2015 సంవత్సరంలో టాలీవుడ్లో బిగ్గెస్ట్ హిట్స్గా నిలిచిన సినిమాలు ఏవో ఈ వీడియోలో చూస్తే క్లియర్గా తెలుస్తుంది.
క్రీడాకారుల జీవిత కథలతో రూపొందించిన బాలీవుడ్ సినిమాలు ఘన విజయాలు సాధిస్తున్నాయి. ‘భాగ్ మిల్కా భాగ్’, ‘మేరీకోం’ సినిమాలు దీనికి ఉదాహరణలు. ఆ సినిమాల స్ఫూర్తితోనే అజారుద్దీన్, మహేంద్రసింగ్ ధోనీ జీవిత కథల ఆధారంగా కూడా సినిమాలు రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో అందాల క్రీడాకారిణి
2015 సంవత్సరంలో టాలీవుడ్లో టాప్ 10 ఫ్లాపులుగా మిగిలిన కళాఖండాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి చాలు.. ఫుల్లుగా క్లారిటీ వచ్చేస్తుంది.
టాలీవుడ్లో ఒక్కో ఏడాది కొంతమంది హీరోయిన్లు ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటూ వుంటారు. ఎవరి అకౌంట్లో ఎక్కువ ఫ్లాపులు పడితే వాళ్ళని ఐరన్ లెగ్స్ అనడం టాలీవుడ్లో మామూలే. మరి 2015లో ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటున్న హీరోయిన్లు ఎవరో చూద్దామా...
సుధీర్బాబు హీరోగా నటించిన ‘భలే మంచి రోజు’ గురించి స్టార్ హీరో ప్రభాస్ ఏమంటున్నాడంటే...
ఈవారం అంటే... 20 డిసెంబర్, 2015 నుంచి 26 డిసెంబర్ 2015 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను క్లిక్ చేస్తే చాలు..
డిసెంబర్ 13వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు వివిధ రాశుల వారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో చూస్తే చాలు.
త్రిష అందంగా వుంటుంది.. ఇంకా చెప్పాలంటే సూపరుగా వుంటుంది. అయితే ఇప్పుడు త్రిషని అందరూ త్రిషా.. నువ్వు సూపరు అంటున్నారు. ఈ ప్రశంస ఆమె అందానికి సంబంధించినది కాదు.. ఆమె వ్యక్తిత్వానికి సంబంధించింది. అందాల నటిగా అందరి ప్రశంసలు అందుకోవడం మాత్రమే కాదు.. సమాజం పట్ల బాధ్యతగా కూడా వ్యవహరించే త్రిషను చాలామంది ఈ కోణంలో కూడా అభిమానిస్తూ వుంటారు. ఆమధ్య స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వీధులను ఊడ్చి స్ఫూర్తినిచ్చిన త్రిష అడపాదడపా సమాజ సేవా కార్యక్రమాల్లో
దర్శకుడు రాంగోపాల్ వర్మ అందరినీ మెప్పించగల సినిమాలు తీయడంలో విఫలమవుతున్నా, నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ఆకట్టుకోగలుగుతున్నారు. ఏ విషయంపైనైనా తనకు తోచినట్లు నిర్భయంగా చెప్పగలగడమే అతనికి చాలా పాపులారిటీ తెచ్చిపెట్టిందని చెప్పవచ్చును. అయితే ఆ పాపులారిటీ పెరుతున్న కొద్దీ అతను తన హద్దులను కూడా దాటిపోతున్నట్లు కనిపిస్తోంది. సహజ సిద్దమయిన కొన్ని సమాజ సూత్రాలను, నియమనిబంధనలను తనకు వర్తించవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.





