పుష్ప–2 తొక్కిసలాట…ఛార్జిషీట్ దాఖలు

Publish Date:Dec 27, 2025

Advertisement

 

సంధ్య  థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. మొత్తం  23 మందిపై అభియోగాలు నమోదు చేశారు. ఏ-1గా సంధ్య  థియేటర్‌ మేనేజ్మెంట్, ఏ-11గా అల్లు అర్జున్‌ను పేర్కొన్నారు. హైదరాబాద్‌ నగరంలో పుష్ప–2 సినిమా ప్రదర్శన సందర్భంగా సంధ్య థియేటర్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే... ఈ కేసులో ఒక మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు కి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పటివరకు ఆ బాలుడు కోలుకోలేదు... ఘటన జరిగిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటన పై సమగ్ర దర్యాప్తు పూర్తి చేసిన చిక్కడపల్లి పోలీసులు కోర్టులో ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు. ఈ కేసులో ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్‌తో పాటు మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చుతూ అభియోగాలు నమోదు చేశారు.

ఈ ఘటన దేశవ్యా ప్తంగా తీవ్ర చర్చకు దారి తీయగా, పోలీసుల దర్యాప్తు లో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యే అవకాశం ఉందని తెలిసినా కూడా సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడమే ఈ దుర్ఘటనకు ప్రధాన కారణమని పోలీసులు తమ ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు.
చార్జిషీట్‌లో అల్లు అర్జున్, ఆయన మేనేజర్, వ్యక్తిగత సిబ్బంది సభ్యులు, అలాగే 8 మంది బౌన్సర్లు నిందితుల జాబితాలో ఉన్నారు. పెద్ద సంఖ్యలో అభిమానులు చేరతారని తెలిసినా సరైన ముందస్తు ఏర్పాట్లు లేకుండా సంధ్య థియేటర్‌కు వెళ్లడం, భద్రతా వ్యవస్థను పర్యవేక్షించడంలో నిర్లక్ష్యం వహించడమే నేరంగా పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్‌ను నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేసినట్లు ఛార్జిషీట్‌లో వివరించారు.

ఈ తొక్కిస లాట ఘటనకు సంధ్య థియేటర్ యాజమాన్య నిర్లక్ష్యమే ప్రధాన కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రేక్షకుల నియం త్రణకు తగిన ఏర్పాట్లు చేయకపోవడం, ప్రవేశ ద్వారాల వద్ద భద్రతా సిబ్బందిని సముచితంగా నియమించకపోవడం, ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్‌ను పాటించకపోవడం వంటి అంశాలు ఛార్జిషీట్‌లో ప్రస్తావించారు. ఈ కారణంగా థియేటర్ యాజమాన్యంతో పాటు మేనేజర్‌పైనా అభియోగాలు నమోదు చేశారు.ఈ దుర్ఘటనలో ఓ మహిళ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడికి తీవ్ర గాయాలు కావడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 

సినిమా చూడాలనే ఉద్దేశంతో థియేటర్‌కు వచ్చిన కుటుంబం ఇలా విషాదంలో మునగడం ప్రజల హృదయాలను కలిచి వేసింది. బాధిత కుటుం బానికి న్యాయం చేయాలనే డిమాండ్‌తో పలు వర్గాలు ఆందోళనలు కూడా వ్యక్తం చేశాయి. చిక్కడపల్లి పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను కోర్టు స్వీకరించనుండగా, కేసు తదుపరి విచారణకు వెళ్లనుంది. ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు ఎలా కొనసాగుతాయన్న దానిపై సినీ పరిశ్రమతో పాటు ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.భారీ జనసమూహాలు పాల్గొనే కార్యక్రమాల్లో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

By
en-us Political News

  
హైదరాబాద్‌లో చైనా మాంజా వాడకం వల్ల ఏర్పడుతున్న ప్రాణాంతక ప్రమాదాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి.
కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ యువతులు మృతి చెందారు
ప్రతి క్రెడిట్ కార్డుకు ఓ పరిమితి ఉంటుంది. ఆ పరిమితి ఆ కార్డు హోల్డర్ ఆదాయం, బ్యాంకు ఖాతా స్థితి, అతడి క్రెడిట్ హిస్టరీని బట్టి బ్యాంకులు నిర్ణయిస్తాయి. కానీ ఈ సాధారణ నియమాలకు పూర్తి భిన్నంగా , ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన క్రెడిట్ కార్డు ఉంది. దానికి ఎలాంటి ఖర్చు పరిమితి ఉండదు. అదే ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన క్రెడిట్ కార్డుగా పేరొందిన అమెరికన్ ఎక్స్‌ప్రెస్ సెంచూరియన్ కార్డ్.
రాయచోటిని మదనపల్లి జిల్లాకి మార్పుపై మంత్రి రాంప్రసాద్‌రెడ్డి భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు.
జనం తీవ్ర భయాందోళనలతో రోడ్లపైకి పరుగులు తీశారు. ఇలాన్ కౌంటీ హాల్ కు 32 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం కేంద్రీకృతమూ ఉన్నట్లు అధకారులు తెలిపారు.
వాస్తవానికి ప్రహ్లాద్‌కు ఏమాత్రం తెలియకుండానే అతడి పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి కీలక డాక్యుమెంట్లను రవి దొంగలించినట్లు పోలీసులు గుర్తించారు. అలా దొంగిలించిన పత్రాలతో ప్రహ్లాద్ పేరుపై నకిలీ పత్రాలు సృష్టించి, బ్యాంక్ ఖాతాలు తెరవడం, ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించడంతో పాటు అతని ఐడెంటిటీని వెబ్‌సైట్ కార్యకలాపాలకు ఉపయోగించుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది.
ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది.
సీఎంకు ఇంటెలిజెన్స్ సమాచారం వస్తుందనీ, ఈ పద్థతి నెహ్రూ హయాం నుంచీ ఉన్నదేననీ అన్నారు. ఇప్పుడు రేవంత్ సర్కార్ లో నిఘా వ్యవస్థ లేదా అని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని అన్నారు.
కమిషనరేట్ లో పని చేస్తున్న మరో ఇన్ స్పెక్టర్ న స్టాక్ మార్కెట్ లో పెట్టుబడుల పేరుతో బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు దాదాపు 39 లక్షల రూపాయల మేర మోసం చేశారు.
తాను దత్తత తీసుకున్న గ్రామంలో ఆమె ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆమె రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తో కలిసి పాల్గొన్నారు. ఆ సందర్భంగా కేంద్రమంత్రి నరసాపురం లేస్ క్రాష్ట్ గురించి ప్రస్తావించి, ప్రశంసించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్లు ఎలమంచిలి స్టేషన్‌లో రైలును నిలిపివేసే లోపే ఆ బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
మరో రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా, హైదరాబాద్ నగరంలో న్యూ ఇయర్ వేడుకలకు ప్రజలు సిద్ధమవుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.